-
ముస్లింలు, ఎస్టీలను ఆదుకోవాలి
తమ నివేదికల్లో చెల్లప్ప, సుధీర్ కమిషన్ల సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముస్లింలలోని పేద వర్గాలు, షెడ్యూల్డ్ తెగల పరిస్థితి దారుణంగా ఉందని.. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెల్లప్ప, సుధీర్ కమిషన్లను తమ నివేదికల్లో సూచించినట్లు సమాచారం. ఆయా వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చేందుకు రిజర్వేషన్ల పెంపుతోపాటు విద్య, ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. వారిలో సొంతంగా వ్యాపారాలు చేసుకునేవారికి రుణాలు ఇప్పించాలని, సబ్సిడీలు అందజేయాలని కమిషన్లు ప్రతిపాదించాయి. రాష్ట్రంలో ఎస్టీలకు 6 శాతం, ముస్లింలకు 4 శాతం (బీసీ ఈ కేటగిరీలో) రిజర్వేషన్లు కొనసాగుతుండగా.. వాటిని 12 శాతానికి చొప్పున పెంచుతామని టీఆర్ఎస్ తమ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక... ఆయా వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితిని చూపేందుకు, వెనుకబాటుతనాన్ని నిర్ధారించేందుకు గణాంకాలు, సమాచారం అవసరమైంది. గతంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినా.. దాని ద్వారా సేకరించిన సమాచారాన్ని రిజర్వేషన్ల పెంపునకు పరిగణనలోకి తీసుకోవడంలో న్యాయమైన చిక్కులు ఎదురవుతాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ వర్గాలపై అధ్యయనం చేసేందుకు ఎస్టీ, మైనారిటీ కమిషన్లను ఏర్పాటు చేసింది. కాయతీ లంబాడాలు, వాల్మీకి బోయలను కలిపితే.. రాష్ట్రంలో ఎస్టీ జనాభా శాతం, వారి పరిస్థితులతోపాటు కాయతీ లంబాడాలు, వాల్మీకి బోయలను ఎస్టీల్లో కలిపితే పరిస్థితి ఏమిటనే అంశంపై చెల్లప్ప కమిషన్ పరిశీలన జరిపింది. ఈ వర్గాలను ఎస్టీల్లో కలిపితే పెరిగే జనాభాకు అనుగుణంగా ఎస్టీల రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలన్నది ప్రభుత్వ యోచన. దీంతో జిల్లాల్లో కాయతీ లంబాడాలు, వాల్మీకి బోయలు నివసించే ప్రాంతాలతో పాటు, ఇతర సమాచారాన్ని సేకరించేందుకు కమిషన్ ప్రయత్నించింది. జిల్లాల్లో ఈ రెండింటిని ఎస్టీల్లో కలపాలన్న ప్రతిపాదనను వివిధ ఎస్టీ సంఘాలు, నాయకులు వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా ఆయా తెగలు ఏయే జాబితాల్లో ఉన్నాయన్న అంశాన్ని కమిషన్ పరిశీలించింది. ఇతర ఎస్టీ తెగలతో పోల్చితే.. ఈ కులాల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం, సాంస్కృతికంగా, సంప్రదాయాలు, పండుగలు ప్రత్యేకంగా ఉన్నాయా లేదా అన్న అంశాలపై అధ్యయనం చేసింది. కాయతీ లంబాడాలు, వాల్మీకి బోయలకు సంబంధించి చారిత్రక ఆధారాలు, కచ్చితమైన సమాచారం, గణాంకాలు పూర్తిగా అందుబాటులో లేకపోవడం కొంత సమస్యగా మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్టీలను విద్య, ఉపాధి, ఆర్థికపరంగా ఆదుకోవాలని కమిషన్ తన నివేదికలో సూచించింది. ఎస్టీల జనాభాకు అనుగుణంగా 9 % వరకు రిజర్వేషన్లను కల్పించవచ్చునని ప్రతిపాదించింది. ముస్లింల స్థితిగతులు ఘోరం రాష్ట్రంలో ముస్లింల స్థితిగతులు దారుణంగా ఉన్నాయని సుధీర్ కమిషన్ తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 9 వేల మంది నుంచి 46 అంశాలపై శాంపిల్ సర్వే ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని కమిషన్ సేకరించింది. ఈ నేపథ్యంలో మిగతా వర్గాలతో పోలిస్తే ముస్లింలలో వెనుకబాటు ఎక్కువగా ఉందనే అంచనాకు కమిషన్ వచ్చినట్లు తెలుస్తోంది. పేద ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వివిధ చర్యలు చేపట్టాల్సి ఉందని నివేదికలో సూచించినట్లు సమాచారం. ముస్లిం పిల్లలకు అన్ని స్థాయిల్లో గురుకుల విద్యను అందించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ముస్లింలలో బాగా వెనుకబడిన వర్గాలకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించాలని, సబ్సిడీ అందించాలని సిఫారసు చేసినట్లు సమాచారం. చదువుకున్న వారికి ఉద్యోగాలు లభించే ఏర్పాటు చేయాలని.. బలహీనవర్గాల గృహాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
ఎస్టీ కమిషన్ చైర్మన్తో చెల్లప్ప భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని బోయ, ఖైతీ లంబాడ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే విషయమై అధ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెల్లప్ప కమిటీ సోమవారం జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ రామేశ్వర్ ఓరమ్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి తరుణ్ ఝాతో భేటీ అయింది. అనంతరం తెలంగాణ భవన్లో ఎస్టీ విచారణ కమిషన్ సభ్యులు నాగు, జగన్నాథరావు, కమిషన్ కార్యదర్శి వీరమల్లుతో కలసి చెల్లప్ప విలేకరులతో మాట్లాడారు. బోయ, ఖైతీ లంబాడ కులాలను ఎస్టీ జాబితాలో కలిపే విషయంలో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాస్త్రీయంగా, సాంకేతికంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, మేధావులు, నిపుణులతో చర్చించి సిఫార్సులు చేయాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ రామేశ్వర్ ఓరమ్ సూచించారన్నారు. బోయ, ఖైతీ లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంలో క్షేత్రస్థాయిలో గిరిజనుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. రెండు కులాల జీవన స్థితిగతులు, ప్రజాభిప్రాయసేకరణ, ఇతర వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందచేస్తామని, రాష్ట్రం కేంద్రానికి అందజేస్తుందన్నారు. కేంద్ర హోంశాఖ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. -
అధ్యయనం తర్వాతే ఎస్టీ జాబితాపై సర్కారుకు నివేదిక
ప్రగతినగర్(నిజామాబాద్): సుదీర్ఘ అద్యయనం తర్వాతే కాయతీ లంబాడీలు, వాల్మీకీ బోయలను షెడ్యూల్డ్ కులాల (ఎస్టీ) జాబితాలో చేర్చే విషయమై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ చెల్లప్ప తెలిపారు. బుధవారం ఆయన నిజామాబాద్లోని ప్రగతి భవన్లో కాయతీ లంబాడీ,వాల్మీకీ బోయ, బంజారా సేవా సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించారు. తాము నివేదిక ఇచ్చిన అనంతరం ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 33 తెగలకు ఆరు శాతం రిజర్వేషన్ మాత్రమే ఉండేదని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర విభజన అనంతరం జనాభా ప్రాతిపదికన ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని అనుకుంటున్నారని చెప్పారు. ఈ మేరకే ఎస్టీ కమిషన్ తెలంగాణ ప్రాంతంలో విచారణ జరుపుతోందన్నారు. ఇందుకోసం ఆరు నెలల గడువు ఇచ్చిందని, గడుపు లోపు తెలంగాణలోని అన్ని జిల్లాలో ఉన్న కాయతీ లంబాడీ, వాల్మీకి బోయలకు సంబంధించి ఆర్థిక స్థితిగతులు, ఆచార సాంప్రదాయాలు తదితర విషయాలపై సమగ్ర అధ్యయనం చేస్తామని చెప్పారు. కాయతీ లంబాడీలు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement