breaking news
Cheergirls
-
‘గోల’ను మిస్సవుతున్నాం
ఐపీఎల్ సందడిపై ఆటగాళ్ల పెదవి విరుపు అబుదాబి: చీర్ లీడర్స్ వయ్యారాలు వలకబోస్తున్నా... అభిమానుల్లో ఊపు లేదు. స్టేడియాలు నిండుతున్నా... హోరెత్తించే అరుపులు, కేరింతలు లేవు. అభిమానుల సందడి కనబడుతున్నా... ఆకట్టుకునే వేషాలుగానీ, హుషారెత్తించే అభినయాలుగానీ కనడబడటం లేదు. మ్యాచ్ మధ్యలో చెవులు దద్దరిల్లే మ్యూజిక్ సౌండ్స్, సూపర్హిట్ పాటల హోరు అసలే లేదు. ఓవరాల్గా యూఏఈలో ఐపీఎల్ మ్యాచ్లు చప్పగా సాగిపోతుండటంపై కొంత మంది ఆటగాళ్లు పెదవి విరుస్తున్నారు. భారత్తో పోలిస్తే ఇక్కడ వాతావరణ చాలా భిన్నంగా ఉందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ అన్నాడు. ప్రేక్షకుల ఉత్సాహం, ఆ సందడి, ఊపు ఇక్కడ మచ్చుకైన కనబడటం లేదని వాపోతున్నాడు. అయితే టోర్నీ ముందుకు సాగేకొద్దీ కొద్దిగానైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నాడు. షాన్ మార్ష్ కూడా మిల్లర్ వ్యాఖ్యలతో ఏకీభవించినా... దుబాయ్లోని దగ్గరి ప్రాంతాల్లో తిరగడం కొత్త అనుభూతినిస్తోందన్నాడు. యూఏఈలో వేడి అధికంగా ఉన్నా... ప్రస్తుతం బాగానే ఉందన్నాడు. ఇది ఇలాగే కొనసాగితే బాగుంటుందని కోరుకుంటున్నాడు. మళ్లీ భారత్లో మ్యాచ్లు మొదలైతే సందడి ఉంటుందని ఆటగాళ్లు ఆశిస్తున్నారు. -
చీర్ లీడర్స్ని తీసేస్తారా?:బీసీసీఐపై స్టువర్ట్ లా ఫైర్
న్యూఢిల్లీ: చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో చీర్ లీడర్స్ను నిషేధించిన బీసీసీఐపై ఆస్ట్రేలియా దేశవాళీ జట్టు బ్రిస్బేన్ హీట్ కోచ్ స్టువర్ట్ లా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చీర్ లీడర్స్ లేకపోవడంతో ఈ టోర్నీ సూపర్ బౌల్ టోర్నీని పోలి ఉందని విమర్శించారు. ‘ఈ వ్యవహారం నాకు అర్థం కావడం లేదు. చీర్ లీడర్స్ లేకపోతే టోర్నీలో మజా ఉండదు. సూపర్ బౌల్ టోర్నీలా ఉంది. నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించాలి. చీర్ లీడర్స్ను అభిమానులు విపరీతంగా అభిమానిస్తారు. ఇక మిగతా దేశాల్లో కూడా ఇలాగే చేస్తారేమో’ అని లా పేర్కొన్నారు. మ్యాచ్ల తర్వాత జరిగే పార్టీలు క్రైమ్కు దారితీస్తున్నాయని అందిన నివేదికలతో పాటు ఫిక్సింగ్ను నిరోధించే చర్యల్లో భాగంగా బీసీసీఐ చీర్ లీడర్స్పై నిషేధం విధించింది.