breaking news
Chandika Hathurusinghe
-
టీమిండియా చేతిలో ఘోర ఓటమి.. బంగ్లాదేశ్ హెడ్ కోచ్పై వేటు
టీమిండియా చేతిలో ఘోర ఓటముల నేపథ్యంలో బంగ్లాదేశ్ హెడ్ కోచ్ చందిక హతురుసింఘేపై వేటు పడింది. హతురుసింఘే తక్షణమే హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలగాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆదేశించింది. హతురుసింఘే స్థానంలో విండీస్ మాజీ ఆల్రౌండర్ ఫిల్ సిమన్స్ తాత్కాలిక హెడ్ కోచ్గా బాధ్యతలు చేపడతాడు. సిమన్స్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ఈ పదవిలో కొనసాగుతాడు. శ్రీలంక మాజీ ఆల్రౌండర్ అయిన హతురుసింఘే రెండు సార్లు బంగ్లాదేశ్ హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2014-17 మధ్యలో తొలిసారి.. 2023 జనవరి-2024 అక్టోబర్ మధ్యలో రెండోసారి బంగ్లాదేశ్ హెడ్ కోచ్గా పని చేశాడు. కొత్త కోచ్ సిమన్స్ త్వరలో జరుగబోయే సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ నుంచి బాధ్యతలు చేపడతాడు.కాగా, బంగ్లాదేశ్ తాజాగా భారత్తో ఆడిన టెస్ట్, టీ20 సిరీస్లలో ఘోర పరాజయాలు ఎదుర్కొంది. ఈ రెండు సిరీస్లలో బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ అయ్యింది. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 0-2 తేడాతో ఓడిన బంగ్లా జట్టు.. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 0-3 తేడాతో పరాజయం పాలైంది. దీనికి ముందు బంగ్లాదేశ్ పాకిస్తాన్పై టెస్ట్ సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. బంగ్లా టైగర్స్ పాక్ను వారి సొంతగడ్డపై రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 2-0 తేడాతో మట్టికరిపించారు. పాక్పై విజయంతో భారీ అంచనాలతో భారత్లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ రెండు సిరీస్ల్లో తేలిపోయింది. ఈ నెల 21 నుంచి సౌతాఫ్రికా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్ అక్టోబర్ 21న ఢాకా వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ చట్టోగ్రామ్ వేదికగా అక్టోబర్ 29న ప్రారంభంకానుంది. చదవండి: సంపన్న క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లిని అధిగమించిన అజయ్ జడేజా -
కోచింగ్ చాలు... లంకకు బయల్దేరండి!
కొలంబో: దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రస్తుతం జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్లో శ్రీలంక 0–4తో క్లీన్స్వీప్కు దగ్గరైంది. దీంతో లంక బోర్డు (ఎస్ఎల్సీ) హెడ్ కోచ్ చండిక హతురసింఘేకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. బయటికి మాత్రం ప్రపంచకప్ ప్రణాళికలపై చర్చించేందుకు స్వదేశం రావాల్సిందిగా చెబుతున్నప్పటికీ... దాదాపు వేటు పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా ఈ పర్యటనలో ఆఖరి వన్డేతో పాటు, మూడు టి20ల సిరీస్ జరగాల్సివుంది. ఈ పరిస్థితిలో సిరీస్ మధ్యలో అర్ధాంతరంగా లంక పయనం కావాలంటూ చండికకు ఎస్ఎల్సీ అధ్యక్షుడు షమ్మి సిల్వా ఆదేశించారు. ఐదో వన్డే ముగియగానే స్వదేశం చేరాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత ఫీల్డింగ్ కోచ్ రిక్సన్కు జట్టు కోచింగ్ బాధ్యతల్ని అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ లంక జట్టు టెస్టుల్లో ఘన చరిత్రకెక్కింది. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా ఘనత వహించింది.