breaking news
Champions Tennis League
-
అమృత్రాజ్కు చుక్కెదురు
సీటీఎల్ కాంట్రాక్ట్ రద్దు చేసిన ‘ఐటా’ న్యూఢిల్లీ: భారత మాజీ ఆటగాడు విజయ్ అమృత్రాజ్ ఆధ్వర్యంలోని చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)కు బ్రేక్ పడింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు సీటీఎల్ కాంట్రాక్ట్ను అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) రద్దు చేసింది. ఒప్పందం ప్రకారం విరామం లేకుండా వరుసగా తొమ్మిదేళ్ల పాటు సీటీఎల్ను నిర్వహించాల్సి ఉంది. పైగా కాంట్రాక్ట్ ఫీజు రూ. 30 లక్షలతో పాటు లాభాల్లో 10 శాతాన్ని కూడా ‘ఐటా’కు చెల్లించాలి. అయితే గత ఏడాది సీటీఎల్ను నిర్వహించలేకపోయిన అమృత్రాజ్ బృందం ఫీజును కూడా చెల్లించలేదు. -
సీటీఎల్ చాంప్ పంజాబ్ మార్షల్స్
- ఫైనల్లో హైదరాబాద్ ఏసెస్కు నిరాశ సాక్షి, హైదరాబాద్: చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్) రెండో సీజన్లో పంజాబ్ మార్షల్స్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడి ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పంజాబ్ 5-4, 5-4, 2-5, 5-4, 5-4 (22-21 గేమ్ల) తేడాతో హైదరాబాద్ ఏసెస్పై విజయం సాధించింది. ఈ ఏడాది పంజాబ్ అజేయంగా నిలువడం విశేషం. ముందుగా లెజెండ్స్ మ్యాచ్లో గ్రెగ్ రుసెద్స్కీ 5-4తో థామస్ జొహన్సన్ను ఓడించి పంజాబ్కు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత మహిళల సింగిల్స్లో ఎలీనా స్వితోలినా 5-4తో మార్టినా హింగిస్ను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్లో ఏసెస్ జోడి హింగిస్-కార్లోవిచ్ 5-2తో స్వితోలినా-బాగ్దాటిస్పై గెలిచి ఆధిక్యాన్ని 2-1కి తగ్గించారు. అయితే పురుషుల డబుల్స్లో మార్షల్స్ ద్వయం బాగ్దాటిస్-సాకేత్ మైనేని 5-4తో కార్లోవిచ్-జీవన్ జంటను చిత్తు చేశారు. అనంతరం టోర్నీ చివరి మ్యాచ్ పురుషుల సింగిల్స్లో బాగ్దాటిస్ 5-4తో కార్లోవిచ్ను ఓడించి పంజాబ్కు విజయం ఖాయం చేశాడు. హింగిస్కు మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్, సాకేత్కు బెస్ట్ ఇండియన్ ప్లేయర్ అవార్డు దక్కాయి. విజేత పంజాబ్ జట్టుకు రూ. కోటి, రన్నరప్ హైదరాబాద్ ఏసెస్కు రూ. 50 లక్షలు ప్రైజ్మనీగా లభించింది. -
ముంబై మాస్టర్స్ కు పెనెట్టా
నవంబరు-డిసెంబరులో చాంపియన్స్ టెన్నిస్ లీగ్-2 ముంబై : యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్ ఫ్లావియా పెనెట్టా భారత్కు రానుంది. ఈ ఏడాది చివర్లో ఆటకు వీడ్కోలు పలుకుతానని యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించిన అనంతరం వ్యాఖ్యానించిన ఈ ఇటలీ స్టార్... భారత్లో జరిగే చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో బరిలోకి దిగనుంది. భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్రాజ్ ఆధ్వర్యంలో జరిగే సీటీఎల్-2లో ప్రపంచ ఏడో ర్యాంకర్ ఫ్లావియా పెనెట్టా ముంబై మాస్టర్స్ జట్టు తరఫున పాల్గొంటుంది. సీటీఎల్-2కు సంబంధించిన వివరాలను బుధవారం జరిగిన మీడియా సమావేశంలో విజయ్ అమృత్రాజ్ వెల్లడించారు. ►ఈ ఏడాది సీటీఎల్-2 నవంబరు 23 నుంచి డిసెంబరు 6 వరకు జరుగుతుంది. భారత్లోని ఆరు నగరాల్లో ఈ లీగ్ను నిర్వహిస్తారు. ►ముంబై, హైదరాబాద్, చండీగఢ్, రాయ్పూర్, నాగ్పూర్ ఫ్రాంచైజీలు ఖరారు కాగా... పది రోజుల్లోపు ఆరో ఫ్రాంచైజీగా పుణే, చెన్నై, బెంగళూరులలో ఒకటిని ఎంపిక చేస్తారు. ►విజేత జట్టుకు రూ. కోటి... రన్నరప్ జట్టుకు రూ. 50 లక్షలు ప్రైజ్మనీ అందజేస్తారు. ►పురుషుల టెన్నిస్లో అత్యంత పొడగరి ఆటగాడు ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా-6 అడుగుల 11 అంగుళాలు) హైదరాబాద్ ఏసెస్ జట్టు తరఫున బరిలోకి దిగుతాడు. ఇటీవల యూఎస్ ఓపెన్లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండీ ముర్రే (బ్రిటన్)ను ఓడించిన దక్షిణాఫ్రికా ప్లేయర్ కెవిన్ అండర్సన్ రాయ్పూర్ జట్టుకు ఆడతాడు. ►స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్ హైదరాబాద్ ఏసెస్ జట్టులోనే కొనసాగనుంది. హింగిస్తోపాటు జెలెనా జంకోవిచ్ (సెర్బియా), అలీజా కార్నె (ఫ్రాన్స్), ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్), హీతెర్ వాట్సన్ (బ్రిటన్) కూడా సీటీఎల్-2లో ఆడనున్నారు. ►{పతి జట్టులో భారత సీనియర్ క్రీడాకారుడితోపాటు ఇద్దరు జూనియర్ ఆటగాళ్లు ఉంటారు. సీనియర్ ఆటగాళ్లు సాకేత్ మైనేని, జీవన్ నెదున్చెజియాన్, శ్రీరామ్ బాలాజీ, దివిజ్ శరణ్, రామ్కుమార్ రామనాథన్, విష్ణువర్ధన్ ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారు. ►{పతి పోటీలో ఐదు మ్యాచ్లు ఉంటాయి. లెజెండ్స్, ఏటీపీ ప్లేయర్, డబ్ల్యూటీఏ ప్లేయర్ సింగిల్స్ మ్యాచ్లు... పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో మ్యాచ్లను నిర్వహిస్తారు. క్రితంసారి ఒక్కో సెట్లో ఆరు గేమ్లు ఉండగా.. ఈసారి దానిని ఐదుకు కుదించారు. ఒకవేళ స్కోరు 4-4 వద్ద సమమైతే టైబ్రేక్ను నిర్వహిస్తారు. గతేడాది తొలి చాంపియన్స్ టెన్నిస్ లీగ్ టైటిల్ను పుణే మరాఠాస్ జట్టు సొంతం చేసుకోగా... ఢిల్లీ డ్రీమ్స్ జట్టు రన్నరప్గా నిలిచింది.