breaking news
Challo Secretariat
-
ఛలో సెక్రటేరియెట్కు కాంగ్రెస్ పిలుపు
-
కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ బిల్లు పంపును నిరసిస్తూ కాంగ్రెస్ నేడు చలో సెక్రటేరియేట్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ సచివాయం వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందు పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తుగా కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, భట్టి విక్రమార్క, మల్రెడ్డి రంగారెడ్డి లను గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలపై కరెంట్ బిల్లుల భారం వేయడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. స్లాబులు పేరుతో అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. (కరోనా: జూలై నెలాఖరుకు పరిస్థితి తీవ్రం) కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన సాగిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. అడ్డగోలు విద్యుత్ బిల్లులు, నియంతృత్వ వ్యవసాయ విధానం, కరోనాపై ముఖ్యమంత్రితో కలిసి చర్చించేందుకు అపాయిమెంట్ మాత్రమే అడిగామని, సచివాలయం ముట్టడికి పిలుపు ఇవ్వలేదన్నారు. కనీస సమాచారం కూడా లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంత అనాలోచిత పాలన ఎక్కడా లేదని దుయ్యబట్టారు. తాము ప్రజల పక్షాన మాట్లాడుతుంటే.. పాలన నిర్బంధం కొనసాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. నిర్బంధం ఇలాగే కొనసాగితే ప్రజలు తిరగబడతారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. (స్వయం ప్రకటిత లాక్డౌన్లో ఐటీ) -
4న న్యాయవాదుల చలో సెక్రటేరియట్
సాక్షి, హైదరాబాద్: హైకోర్టును వెంటనే విభజించాలని, అప్పటి వరకు జేసీజే నియామకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4న చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్రెడ్డి తెలిపారు. శనివారం సిటీ సివిల్ కోర్టు ఆవరణలో హైకోర్టు సాధన కమిటీ అధ్యక్షుడు ఎం.సహోదర్రెడ్డి ఆధ్వర్యంలో బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నేతలతోపాటు అన్ని జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజేందర్రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8వరకు తెలంగాణ వ్యాప్తంగా కోర్టు విధులను బహిష్కరించనున్నట్టు తెలిపారు. కాగా, హైకోర్టు విభజనతోపాటు ఉద్యోగుల సంక్షేమం కోసం శెట్టి కమిషన్ చేసిన సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలని కోరుతూ న్యాయశాఖ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం హైకోర్టుకు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి బి.లక్ష్మారెడ్డి శనివారం ప్రకటించారు.