challa
-
సక్సెస్ అంటే...‘సాఫ్ట్వేర్’ ఒక్కటే కాదు బాస్!
తెనాలి: చల్లా లక్ష్మీనారాయణ– ‘ ఏదో ఒక రోజు పెద్ద చెఫ్ని అవుతాను’ అంటూ చిన్నప్పుడు అన్నప్పుడు, అందరూ నవ్వుకున్నారు. అయితే, అమ్మను తొలి గురువుగా తీసుకున్న ఆయన, పాకశాస్త్రంలో అపూర్వ శిఖరాలను అధిరోహించారు. ఆధునిక నలభీమునిగా, ప్రత్యేకమైన రెసిపీల సృష్టిలో తన ప్రతిభను చాటారు. ఆయన వంటల ప్రయాణం.. ‘శ్రమ’కు ‘రుచి’ని మేళవించి, ఆహారప్రియులను ‘ఔరా..’ అనిపించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు ఆయన ప్రస్థానం, నిజంగా ఈ రంగంలో యువతకు ప్రేరణ. ప్రస్తుతం వీసా రెన్యువల్ కోసం భారత్కు వచ్చిన ఆయన స్ఫూర్తిదాయక జీవన ప్రయాణం మీ కోసం.. అదృష్టానికి తొలి మెట్లు.. లక్ష్మీనారాయణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలానికి చెందిన అంగలకుదురు. తెనాలిలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, హైదరాబాద్లోని ఐఐహెచ్ఎంలో హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా పొందారు. ఒక హోటల్లో ఉద్యోగంతోపాటు హోటల్ మేనేజ్మెంట్, టూరిజంలో పీజీ డిప్లొమా కూడా పూర్తి చేశారు. ఆపై సింగపూర్లో ఫుడ్ హైజీన్ కోర్సు అభ్యసించి, ముంబయిలోని బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ద్వారా హోటల్ మేనేజ్మెంట్, కేటరింగ్ టెక్నాలజీలో దూరవిద్య ద్వారా కోర్సు పూర్తి చేశారు. 1997లో ఆయన వృత్తి జీవితం ప్రారంభమైంది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రముఖ హోటళ్లలో చెఫ్గా సేవలందించారు. 2007–09 కాలంలో సింగపూర్లోని నయూమి హోటల్స్లో చెఫ్గా పనిచేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. అనంతరం మైసూరు, కూర్గ్ ప్రాంతాల్లోని రిసార్ట్స్, తిరుపతిలోని ఐసీటీ హోటల్లో సేవలందించారు. 2014 నుంచి 2019 వరకు కాకినాడ, చెన్నై నగరాల్లోని ప్రముఖ హోటళ్లలో పనిచేశారు. శ్రమతోపాటు ప్రతిభకు గుర్తింపుగా అదృష్టం తలుపు తట్టినట్లు 2023లో అమెరికా నుంచి ఆహ్వానం లభించింది. అక్కడి కాలిఫోర్నియాలో ప్రసిద్ధ హోటల్లో చెఫ్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదీ చదవండి: ఎండినా... నిమ్మ అమ్మే! వరించిన అవార్డులు సింగపూర్లోని వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ చెఫ్స్ సొసైటీ, సౌత్ ఇండియన్ చెఫ్స్ అసోసియేషన్ (ఎస్ఐసీఏ), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ కలినరీ అసోసియేషన్ (ఐఎఫ్సీఏ), అమెరికన్ కలినరీ ఫెడరేషన్ (ఏసీఎఫ్) సభ్యత్వాలు లక్ష్మీనారాయణకు లభించాయి. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ తిరుపతి, విశాఖపట్నం వేదికగా నిర్వహించిన వంటకాల పోటీలతో పాటు అనేక సోలో, గ్రూపు విభాగాల్లో పాల్గొని పలు ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన గెలుచుకున్నారు. ఎన్నో దేశాల వంటకాల్లో మేటిగా.. పలు దేశాల వంటకాలలో ఆయన ప్రావీణ్యం సంపాదించారు. దక్షిణ భారతీయ వంటకాలకే పరిమితం కాకుండా థాయ్, ఇటాలియన్, మెక్సికన్ వంటి అంతర్జాతీయ వంటకాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. నీటిపై పెరిగే మొక్కల నుంచి తయారు చేసే ప్రత్యేకమైన ‘హనీ చిల్లీ చెస్ట్ నట్స్’ రెసిపీలో లక్ష్మీనారాయణ సిద్ధహస్తులు. ఆయన తయారు చేసే మరో ప్రసిద్ధ వంటకం ‘చిల్లీ తోఫు’ కూడా ఎంతో ఆదరణ పొందింది. నాన్వెజిటేరియన్ వంటకాల విషయంలో, మటన్ కర్రీతో దోసెలా స్ట్రీమ్ చేసి వడ్డించే ప్రత్యేకమైన ‘మటన్ మొప్పాస్’, మంగళూరు శైలిలో ‘ఘీ రోస్ట్ ప్రాన్స్’, ఆంధ్ర ప్రత్యేకత అయిన ‘నాటుకోడి–రాగిముద్ద’, అరుదైన ‘జాక్ఫ్రూట్ బిర్యానీ’, మసాలా రుచులతో నిండిన ‘గుంటూరు మటన్ ఫ్రై బిట్ బిర్యానీ’లు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి.‘సాఫ్ట్వేర్’ ఒక్కటే మార్గం కాదునేటి యువతకు ‘సాఫ్ట్వేర్ ఉద్యోగం’ ఒక్కటే మార్గం కాదు. హోటల్, టూరిజం వంటి రంగాలలోనూ అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. నా వృత్తి విషయానికి వస్తే, ప్రతి దేశం నాకు ఒక కొత్త పాఠం, ప్రతి వంటకం ఒక కొత్త సవాలు. ఇన్నేళ్ల ప్రయాణంలో అనుభవించిన అవమానాలు, ఒంటరితనం, సుదీర్ఘమైన పనిగంటలు– ఇవన్నీ నా ఎదుగుదలకు బలమైన మూల స్తంభాలయ్యాయి. వంటకాలు తయారు చేయడం మాత్రమే కాదు, వాటిలో మనసు కలపాలి. పదార్థాలకు భావాలను మేళవించినప్పుడే వంటకానికి ప్రాణం వస్తుంది. – చల్లా లక్ష్మీనారాయణ -
తెలుగు అధికారికి ఎస్బీఐ పగ్గాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నూతన చైర్మన్గా సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టిని ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) శనివారం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆయన ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్, టెక్నాలజీ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్న దినేష్ కుమార్ ఖరా స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీనివాసులు తెలుగువారు కావడం విశేషం. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు ఆయన స్వస్థలం. ఎస్బీఐలో ప్రొబేషనరీ అధికారిగా 1988లో కెరీర్ ప్రారంభించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్లను ఎంపిక చేసే ఎఫ్ఎస్ఐబీ.. ఎస్బీఐ కొత్త చైర్మన్ కోసం జూన్ 29న ముగ్గురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి శ్రీనివాసులు పేరును ఖరారు చేసింది. ఎఫ్ఎస్ఐబీ సిఫార్సుపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. -
చల్లా భగీరథరెడ్డి పార్థీవదేహానికి సీఎం జగన్ నివాళులు (ఫొటోలు)
-
ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి పార్థీవదేహానికి నివాళులర్పించిన సీఎం జగన్
-
చల్లా భగీరథరెడ్డి పార్థీవదేహానికి సీఎం జగన్ నివాళులు
సాక్షి, నంద్యాల: ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి పార్థీవదేహానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ఈరోజు(గురువారం)నంద్యాల జిల్లా అవుకుకు చేరుకున్న సీఎం జగన్.. చల్లా భగీరథరెడ్డి పార్థీవ దేహంపై పుష్పగుచ్చం ఉంచి ముందుగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చల్లా భగీరథరెడ్డి కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు. నంద్యాల జిల్లా అవుకుకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ్రెడ్డి(46) గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈ మధ్యనే అయ్యప్పమాల ధరించిన ఆయన.. శబరిమల వెళ్లొచ్చిన అనంతరం అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయన కుటుంబ సభ్యులు.. భగీరథ రెడ్డిని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు. -
ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం జగన్
-
ఆదిరెడ్డికి చల్లాగా దెబ్బ
ఎమ్మెల్సీ ఆదిరెడ్డికి చెక్ పెట్టేందుకు గోరంట్ల వ్యూహం చేరిన పక్షం రోజులకే చల్లా శంకరరావు చేరిక సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు ఆ పార్టీలో వీలైనంతగా ప్రాధాన్యం తగ్గించేందుకు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీలోని ఆదిరెడ్డి సామాజిక వర్గ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారా?.. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరైన ఆదిరెడ్డిని ఆదే గ్రూపు రాజకీయాలతో దెబ్బకొట్టాలని ప్రయత్నించారా? అంటే అవునంటున్నారు.. పాలక పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు. పక్షం రోజుల కిందట ఆదిరెడ్డి అప్పారావు తన అనుచరులతో కలసి విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆదిరెడ్డి పార్టీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నాకే అతని తోడళ్లుడు, కాంగ్రెస్ పార్టీ నేత, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకరావుని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబులు ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి పార్టీలో చేరేందుకు అనుమతి తీసుకున్నారు. అందులో భాగంగానే గురువారం రాజమహేంద్రవరం వచ్చిన సీఎం చంద్రబాబు సమక్షంలో చల్లా శంకరరావు టీడీపీలో చేరారు. పార్టీలో ఆదిరెడ్డి చేరికను మొదటి నుంచి గోరంట్లతోపాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్ని కృష్ణ, ఆదిరెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాసిరెడ్డి రాంబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. తాను టీడీపీలో చేరుతున్నానని ఆదిరెడ్డి ప్రకటించిన వెంటనే పలు దఫాలుగా రోజుల తరబడి గోరంట్ల తన నివాసంలో అనుచరులు, పార్టీ నేతలతో చర్చలు సాగించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుకు ఆదిరెడ్డి వియ్యంకుడు కావడంతో ఆయన చేరికను వీరు బహిరంగంగా వ్యతిరేకించలేకపోయారు. మొదట నుంచి ఆదిరెడ్డి గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరని, ఆయన వస్తే టీడీపీలోని తన సామాజిక వర్గ నేతలతో మరో కుంపటి పెడతాడని గోరంట్లతోపాటు పార్టీ నేతలు భావించారు. అందుకే గోరంట్లతో ఎప్పడూ ఉప్పు నిప్పులా ఉండే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్ని కృష్ణ కూడా ఆయన నివాసంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. టీడీపీలో చేరినప్పుడు ఆదిరెడ్డి తన సామాజికవర్గానికి చెందిన డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబుకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. నగరంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ముఖ్యనేతలందరి చిత్రాలు ఉన్నా ఎక్కడా వాసిరెడ్డి చిత్రం పెట్టలేదు. ఇదే సమయంలో చల్లా శంకరరావు మాత్రం వాసిరెడ్డి రాంబాబు చిత్రాన్ని తాను ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఉంచారు. సౌమ్యుడిగా పేరొందిన చల్లాకు తన సామాజిక వర్గం(వెలమ)లో మంచి పట్టుంది. ఆయన్ను టీడీపీలోకి తీసుకురావడం ఆదిరెడ్డికి చెక్ చెప్పవచ్చని ఆదే సమయంలో గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా చేయాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.