breaking news
chairperson elections
-
మైదుకూరు ఛైర్మన్ పీఠం వైఎస్సార్సీపీదే
మైదుకూరు: వైఎస్సార్ జిల్లాలోని మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మైదుకూరు మున్సిపాలిటీలో 24 వార్డులుండగా, టీడీపీ 12 వార్డుల్లో, వైసీపీ 11 వార్డుల్లో , జనసేన ఒక చోట గెలుపొందాయి. దీంతో ఏ పార్టీకి కూడా మెజార్టీ దక్కని పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకుంటే వైసీపీ బలం 13కి పెరిగింది. టీడీపీ, జనసేన కలిస్తే సంఖ్యా బలం 13గా ఉంది. కాగా, టీడీపీ ఆరో వార్డు సభ్యురాలు మహబూబ్బీతో పాటు జనసేన సభ్యుడు బాబు గైర్హాజరు కావడంతో టీడీపీ బలం 11కి పడిపోయింది. మరోవైపు అధికార పార్టీ వైఎస్సార్సీపీ తమకున్న రెండు ఎక్స్ అఫీషియా ఓట్లతో బలాన్ని 13కి పెంచుకుని చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకుంది. మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్గా మాచనూరి చంద్ర, వైస్ ఛైర్మన్గా మహబూబ్ షరీఫ్ ఎన్నికయ్యారు. చదవండి: దేశ చరిత్రలోనే ఇది ఓ అరుదైన ఘట్టం: సజ్జల అక్రమాల పుట్ట ‘అమరావతి’ -
ఆంధ్ర ప్రదేశ్ : కొనసాగుతున్న మేయర్, ఛైర్మన్ల ఎన్నిక
-
బడుగుబలహీన వర్గాలకే అగ్రాసనం..
సాక్షి, అమరావతి: సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరికొత్త చరిత్రను లిఖించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు అధికారాన్ని అప్పగించడం ద్వారా వారి అభ్యున్నతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకున్నారు. ఈ సారి పురపాలక అధ్యక్ష పదవుల్లో 60.46 శాతం మహిళలకే దక్కటం ఒక రికార్డేనని చెప్పాలి. అంతేకాదు!! చరిత్రలో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 78 శాతం పదవులు లభించాయి. దీంతోపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్లుగా బీసీ వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు ఎన్నిక కావడం ఊహలకు కూడా అందని పరిణామం. మహిళాభ్యున్నతిని చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి జగన్... పార్టీ సాధించిన 11 కార్పొరేషన్లలో ఏకంగా ఏడింటి పగ్గాలు మహిళలకే అప్పగించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన గృహిణులను పలువురిని ఈ పదవులు వరించటం ఒక మంచి మార్పుకు నాందిగానే పేర్కొనాలి. ఆయా వర్గాల రాజకీయ సాధికారతను చేతల్లో చూపించటం ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అసలైన ప్రజాస్వామ్యానికి నిర్వచనం చెప్పింది. తన మంత్రివర్గంలో 60 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి... నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం కేటాయించేలా... అందులోనూ సగం మహిళలకే ఇవ్వాలని చట్టం చేశారు. తద్వారా సామాజిక న్యాయ సాధన దిశగా కొత్త ఒరవడి సృష్టించారు. ఇప్పుడు మేయర్లు, మునిసిపల్ చైర్ పర్సన్ల ఎంపికలోనూ అదే విధానాన్ని అనుసరించి తన నిబద్ధతను రుజువు చేసుకున్నారు. చెప్పిన దానికి మించి... 11 మేయర్, 75 మునిసిపల్ చైర్పర్సన్ పదవులతో కలిపి మొత్తం 86కిగానూ చట్ట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 45 కేటాయించాల్సి ఉంది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా 67 పదవులను వారికి కేటాయించింది. బీసీ ‘ఇ’ కేటగిరీ కిందకు వచ్చే ముస్లిం మైనార్టీలతో సహా బీసీలకు కేటాయించాల్సిన వాటికంటే అత్యధికంగా ముఖ్యమంత్రి జగన్ పదవులు ఇవ్వటంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద 86 పదవుల్లో మైనార్టీలతో సహా బీసీలకు 30 పదవులు కేటాయించాల్సి ఉండగా 52 ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో బీసీలకు కేటాయించాల్సిన పదవులకన్నా ఏకంగా 70.3 శాతం పదవులను అదనంగా ఇచ్చినట్లయింది. మహిళలకే అగ్రస్థానం ఇక మహిళలకు సంబంధించి తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని... చేతల్లోనే చూపిస్తామని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించారు. పదవుల్లో మహిళలకు అగ్రాసనం వేశారు. మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు కలిపి మొత్తం మీద 86 పదవుల్లో మహిళలకు 50 శాతం కేటాయించాలి. ఆ ప్రకారం 44 పదవులు కేటాయించాల్సి ఉండగా ముఖ్యమంత్రి ఏకంగా 52 మంది మహిళలకు పదవులు ఇచ్చారు. మహిళలకు 60.46 శాతం పదవులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. జనరల్, బీసీ జనరల్, ఎస్సీ జనరల్గా రిజర్వ్ అయిన స్థానాల్లో కూడా చాలా చోట్ల మహిళలకే అవకాశం కల్పించారు. 75 మున్సిపాలిటీల్లో 45 చోట్ల చైర్పర్సన్లుగా మహిళలకే పగ్గాలు అప్పగించారు. అధికార పార్టీకే అన్నీ.. రాష్ట్రంలో ఇటీవల 12 కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరగ్గా వాటిలో తాడిపత్రి మినహా 74 మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. కోర్టు ఉత్తర్వుల కారణంగా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడించకపోగా... ఫలితాలు వెల్లడించిన 11 కార్పొరేషన్లలోనూ వైఎస్సార్ సీపీ జయకేతనం ఎగురవేసింది. వాటిలో పాలక వర్గాలు గురువారం కొలువుదీరాయి. కార్పొరేషన్లలో ఎన్నికైన కార్పొరేటర్లు, ముసిసిపాలిటీల్లో ఎన్నికైన కౌన్సిలర్లు తొలుత పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అనంతరం కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మునిసిపాలిటీల్లో చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్ల పదవులకు ఎన్నికలు నిర్వహించి గెలిచిన వారిచేత ప్రమాణం చేయించారు. అన్ని చోట్లా స్పష్టమైన మెజార్టీ ఉండటంలో మొత్తం 11 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. మున్సిపాలిటీలలో చైర్పర్సన్లు, వైస్ చైర్ పర్సన్ పదవులు కూడా అధికార పార్టీకే దక్కాయి. వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉండటంతో నల్లేరుపై నడకలా విజయం సాధించింది. కాస్త ఆసక్తి రేపిన మైదుకూరు మున్సిపాలిటీని కూడా వైఎస్సార్సీపీయే గెలుచుకుంది. మైదుకూరులో వైఎస్సార్సీపీ 11 వార్డుల్లో, టీడీపీ 12 వార్డుల్లో గెలవగా జనసేన ఒక వార్డు దక్కించుకుంది. కాగా జనసేన నుంచి గెలిచిన ఏకైక కౌన్సిలర్తోపాటు టీడీపీ కౌన్సిలర్ ఒకరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో పాల్గొనలేదు. ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు ఉండటంతో వైఎస్సార్సీపీ స్పష్టమైన మెజార్టీ సాధించి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులను గెలుచుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రం టీడీపీ దక్కించుకుంది. ఇక్కడ వైఎస్సార్సీపీ 16 వార్డులను గెలవగా టీడీపీ 18 వార్డుల్లో గెలిచింది. సీపీఐ ఒక వార్డులోనూ, స్వతంత్ర సభ్యుడు ఒక వార్డులోనూ విజయం సాధించారు. ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లతో వైఎస్సార్సీపీ బలం 18కి చేరింది. టీడీపీకి సీపీఐ కౌన్సిలర్తో పాటు ఇండిపెండెంట్ కౌన్సిలర్ కూడా మద్దతు ప్రకటించడంతో తాడిపత్రి మున్సిపాలిటీని ఆ పార్టీ గెలుచుకుంది. సూళ్లూరుపేట, బొబ్బిలి, ఉయ్యూరులో నేడు.. సూళ్లూరుపేట మునిసిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికను గురువారం నిర్వహించలేదు. విజయనగరం జిల్లా బొబ్బిలి, కృష్ణా జిల్లా ఉయ్యూరు మునిసిపల్ వైస్ చైర్మన్ల ఎన్నికలు కోరం లేకపోవడంతో జరగలేదు. ఆ పదవులకు శుక్రవారం ఎన్నికలు నిర్వహిస్తారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు.. ►ఒంగోలు మేయర్గా గంగాడి సుజాత ►ఒంగోలు డిప్యూటీ మేయర్గా వేమూరి సూర్యనారాయణ ►కడప మేయర్గా సురేష్బాబు ►కడప డిప్యూటీ మేయర్గా షేక్ ముంతాజ్ బేగం ►అనంతపురం మేయర్గా వసీమ్ సలీమ్ ►అనంతపురం డిప్యూటీ మేయర్గా వాసంతి సాహిత్య ►విజయనగరం మేయర్గా విజయలక్ష్మి ►విజయనగరం డిప్యూటీ మేయర్గా ముచ్చు నాగలక్ష్మి ►మచిలీపట్నం మేయర్గా మోకా వెంకటేశ్వరమ్మ ►తిరుపతి మేయర్గా డా.శిరీషా ఏకగ్రీవ ఎన్నిక ►విశాఖ మేయర్గా గొలగాని హరి వెంకటకుమారి ►విశాఖ డిప్యూటీ మేయర్గా జియ్యాని శ్రీధర్ ►చిత్తూరు మేయర్గా అముద ►చిత్తూరు డిప్యూటీ మేయర్గా చంద్రశేఖర్ ►గుంటూరు మేయర్గా కావటి మనోహర్నాయుడు ►గుంటూరు డిప్యూటీ మేయర్గా వనమా బాలవజ్ర బాబు ►విజయవాడ మేయర్గా భాగ్యలక్ష్మీ ►విజయవాడ డిప్యూటీ మేయర్గా బెల్లం దుర్గ ►కర్నూలు మేయర్గా బీవై రామయ్య మున్సిపల్ ఛైర్పర్సన్లు... అనంతపురం: ధర్మవరం ఛైర్పర్సన్గా నిర్మల గుత్తి ఛైర్పర్సన్గా వన్నూరుబీ గుంతకల్లు ఛైర్పర్సన్గా ఎన్.భవానీ హిందూపురం ఛైర్పర్సన్గా ఇంద్రజ కదిరి ఛైర్పర్సన్గా నజి మున్నీసా కల్యాణదుర్గం ఛైర్మన్గా రాజకుమార్ మడకశిర ఛైర్పర్సన్గా లక్షీనరసమ్మ పుట్టపర్తి ఛైర్మన్గా ఓబులపతి రాయదుర్గం ఛైర్పర్సన్గా శిల్ప తాడిపత్రి ఛైర్మన్గా జేసీ ప్రభాకర్రెడ్డి కర్నూలు: ఆదోని ఛైర్పర్సన్గా శాంత ♦ఆళ్లగడ్డ ఛైర్మన్గా రామలింగారెడ్డి ♦ఆత్మకూరు ఛైర్మన్గా ఆసియా ♦డోన్ ఛైర్మన్గా గంటా రాజేష్ ♦గూడూరు ఛైర్మన్గా వెంకటేశ్వర్లు ♦నందికొట్కూరు ఛైర్మన్గా సుధాకర్రెడ్డి ♦నంద్యాల ఛైర్పర్సన్గా షేక్ మబున్ని ♦ఎమ్మిగనూరు ఛైర్మన్గా శివన్న రఘు వైఎస్సార్ జిల్లా: బద్వేల్ ఛైర్మన్గా రాజగోపాల్రెడ్డి ♦జమ్మలమడుగు ఛైర్పర్సన్గా శివమ్మ ♦మైదుకూరు ఛైర్మన్గా చంద్ర ♦ప్రొద్దుటూరు ఛైర్పర్సన్గా లక్ష్మీదేవి ♦పులివెందుల ఛైర్మన్గా వరప్రసాద్ ♦రాయచోటి ఛైర్మన్గా షేక్ బాషా ♦ఎర్రగుంట్లపాలెం ఛైర్మన్గా హర్షవర్ధన్రెడ్డి ప్రకాశం జిల్లా: ఒంగోలు డిప్యూటీ మేయర్గా వేమూరి సూర్యనారాయణ ♦అద్దంకి ఛైర్పర్సన్గా ఎస్తేరమ్మ ♦చీమకుర్తి ఛైర్పర్సన్గా చల్లా అంకులు ♦చీరాల ఛైర్మన్గా జి.శ్రీనివాసరావు ♦గిద్దలూరు ఛైర్మన్గా వెంకటసుబ్బయ్య ♦కనిగిరి ఛైర్మన్గా అబ్దుల్ గఫార్ ♦మార్కాపురం ఛైర్మన్గా మురళీకృష్ణారావు నెల్లూరు: ఆత్మకూరు ఛైర్పర్సన్గా వెంకట రమణమ్మ ♦నాయుడుపేట ఛైర్పర్సన్గా దీపిక ♦సూళ్లూరుపేట ఛైర్మన్గా శ్రీమంత్రెడ్డి ♦వెంకటగిరి ఛైర్పర్సన్గా నక్కా భానుప్రియ చిత్తూరు: మదనపల్లె ఛైర్పర్సన్గా మనుజ ♦నగరి ఛైర్పర్సన్గా నీలమంగళం ♦పలమనేరు ఛైర్పర్సన్గా పవిత్ర ♦పుంగనూరు ఛైర్మన్గా ఆలీమ్ బాషా ♦పుత్తూరు ఛైర్మన్గా హరి కృష్ణా జిల్లా: నూజివీడు ఛైర్పర్సన్గా త్రివేణి దుర్గా ♦పెడన ఛైర్పర్సన్గా బి.జ్ఞానలింగజ్యోతి ♦ఉయ్యూరు ఛైర్మన్గా వల్లభనేని సత్యనారాయణ ♦నందిగామ ఛైర్పర్సన్గా మండవ వరలక్ష్మి ♦తిరువూరు ఛైర్పర్సన్గా కస్తూరిభాయి గుంటూరు జిల్లా: తెనాలి ఛైర్పర్సన్గా ఖలీదా ♦చిలకలూరిపేట ఛైర్పర్సన్గా షేక్ రఫాని ♦రేపల్లె ఛైర్పర్సన్గా కట్టా మంగమ్మ ♦సత్తెనపల్లి ఛైర్పర్సన్గా లక్ష్మీతులసి ♦వినుకొండ ఛైర్మన్గా దస్తగిరి ♦మాచర్ల ఛైర్మన్గా తురక కిశోర్ ♦పిడుగురాళ్ల ఛైర్మన్గా చిన్న సుబ్బారావు తూర్పుగోదావరి: అమలాపురం మున్సిపల్ ఛైర్పర్సన్గా సత్యనాగేంద్రమణి ♦గొల్లప్రోలు నగర పంచాయతీ ఛైర్పర్సన్గా మంగతాయారు ♦మండపేట మున్సిపల్ ఛైర్పర్సన్గా దుర్గారాణి ♦ముమ్మిడివరం నగర పంచాయతీ ఛైర్మన్గా ప్రవీణ్కుమార్ ♦పెద్దాపురం మున్సిపల్ ఛైర్పర్సన్గా బొడ్డు తులసి ♦పిఠాపురం మున్సిపల్ ఛైర్పర్సన్గా గండేపల్లి సుర్యావతి ♦రామచంద్రపురం మున్సిపల్ ఛైర్పర్సన్గా శ్రీదేవి ♦సామర్లకోట మున్సిపల్ ఛైర్పర్సన్గా గంగిరెడ్డి దేవి ♦తుని మున్సిపల్ ఛైర్పర్సన్గా ఏలూరి సుధారాణి ♦ఏలేశ్వరం నగర పంచాయతీ మున్సిపల్ ఛైర్పర్సన్గా అలమంద సత్యవతి పశ్చిమగోదావరి: కొవ్వూరు మున్సిపల్ ఛైర్పర్సన్గా రత్నకుమారి ♦జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్పర్సన్గా బత్తిన లక్ష్మీ ♦నరసాపురం మున్సిపల్ ఛైర్మన్గా బర్రె శ్రీవెంకటరమణ ♦నరసాపురం మున్సిపల్ వైస్ఛైర్మన్గా కొత్తపల్లి భుజంగరావు ♦నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్గా ఆదినారాయణ ♦కొవ్వూరు మున్సిపల్ ఛైర్పర్సన్గా రత్నకుమారి ♦కొవ్వూరు మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్గా మన్నె పద్మ ♦జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్పర్సన్గా బత్తిన లక్ష్మీ ♦జంగారెడ్డిగూడెం మున్సిపల్ వైస్ఛైర్పర్సన్గా కంచర్ల వాసవీ ►విజయనగరం: బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్గా వెంకట మురళీకృష్ణారావు ►విజయనగరం: పార్వతీపురం మున్సిపల్ ఛైర్పర్సన్గా బోను గౌరీశ్వరి ►విజయనగరం: సాలూరు మున్సిపల్ ఛైర్పర్సన్గా ఈశ్వరమ్మ ►విశాఖ: నర్సీపట్నం మున్సిపల్ ఛైర్పర్సన్గా ఆదిలక్ష్మి ►విశాఖ: యలమంచిలి మున్సిపల్ ఛైర్పర్సన్గా పీలా రామాకుమారి ►శ్రీకాకుళం: ఇచ్ఛాపురం మున్సిపల్ ఛైర్పర్సన్గా పిలక రాజ్యలక్ష్మి ►శ్రీకాకుళం: పాలకొండ నగర పంచాయతీ ఛైర్పర్సన్గా రాధాకుమారి ►శ్రీకాకుళం: పలాస మున్సిపల్ ఛైర్పర్సన్గా గిరిబాబు ►పార్వతీపురం మున్సిపల్ ఛైర్పర్సన్గా బోను గౌరీశ్వరి ►పార్వతీపురం మున్సిపల్ వైస్చైర్పర్సన్గా కొండపల్లి రుక్మిణి ►సాలూరు మున్సిపల్ ఛైర్పర్సన్గా ఈశ్వరమ్మ ►సాలూరు మున్సిపల్ వైస్ఛైర్మన్గా జరజాపు దీప్తి ►విజయనగరం: నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్పర్సన్గా సరోజిని ►విజయనగరం: నెల్లిమర్ల నగర పంచాయతీ వైస్ ఛైర్మన్గా సముద్రపు రామారావు ►గుంటూరు: సత్తెనపల్లి మున్సిపల్ ఛైర్మన్గా లక్ష్మీతులసి ►సత్తెనపల్లి మున్సిపల్ వైస్ఛైర్పర్సన్గా షేక్ నాగుల్మీరాన్ ►విశాఖ: యలమంచిలి మున్సిపాలిటీ ఛైర్పర్సన్గా పిల్లా రామకుమారి ►యలమంచిలి మున్సిపాలిటీ వైస్ఛైర్మన్గా వెంకట గోవిందరాజు ►అనంతపురం: హిందూపురం మున్సిపాలిటీ ఛైర్పర్సన్గా ఇంద్రజ ►హిందూపురం మున్సిపాలిటీ వైస్ఛైర్మన్గా పీఎన్ జాబివుల్లా ►విజయనగరం: పార్వతీపురం మున్సిపాలిటీ ఛైర్పర్సన్గా గోను గౌరీశ్వరి ►పార్వతీపురం మున్సిపాలిటీ వైస్ ఛైర్పర్సన్గా కొండపల్లి రుక్మిణి ►తూ.గో: ఏలేశ్వరం మున్సిపాలిటీ ఛైర్పర్సన్గా అలమండ సత్యవతి ►ఏలేశ్వరం మున్సిపాలిటీ వైస్ఛైర్పర్సన్గా శిడగం త్రివేణి ►చిత్తూరు: పలమనేరు మున్సిపల్ ఛైర్మన్గా మురళీకృష్ణ ►పలమనేరు మున్సిపల్ వైస్ఛైర్మన్గా చన్మ ►వైఎస్ఆర్ జిల్లా: మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్గా మచ్చునూరి చంద్ర ►మైదుకూరు మున్సిపల్ వైస్ఛైర్మన్గా షేక్ మహబూబ్ షరీఫ్ -
మేయర్, చైర్పర్సన్ల ఎన్నిక నేడే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 11 నగరపాలక సంస్థలు, 75 మునిసిపాలిటీల్లో కొత్త పాలక మండళ్లు గురువారం కొలువుదీరనున్నాయి. కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మునిసిపాలిటీలకు చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 10న 12 మునిసిపల్ కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు చేపట్టలేదు. ఫలితాలు ప్రకటించిన 11 కార్పొరేషన్లలో ఎన్నికైన కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. అదేవిధంగా 75 మునిసిపాలిటీలకు ఎన్నికైన కౌన్సిలర్లు చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకుంటారు. అందుకోసం పురపాలక శాఖ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఎన్నిక ప్రక్రియ ఇలా.. ముందుగా నగరపాలక సంస్థల కార్పొరేటర్లు, మునిసిపల్ కౌన్సిలర్లతో ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉదయం 11 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, మునిసిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు. ఫలితాలను వెంటనే ప్రకటిస్తారు. మేయర్, చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించేందుకు కనీసం 50 శాతం సభ్యుల హాజరును కోరంగా పరిగణిస్తారు. కోరం లేకపోతే ఎన్నికను వాయిదా వేస్తారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ప్రిసైడింగ్ అధికారులను ప్రభుత్వం నియమించింది. వారి ఆధ్వర్యంలో ఆయా సంస్థల సమావేశ మందిరాల్లో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పురపాలక శాఖ కమిషనర్ ఎంఎం నాయక్, జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లను సమీక్షించారు. ఆయా కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కొక్క పోస్టుకే నేడు ఎన్నికలు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు వీలుగా నగరపాలక సంస్థల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, మునిసిపాలిటీల్లో ఇద్దరు వైస్ చైర్పర్సన్లను ఎన్నుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆర్డినెన్స్ రూపొందించి గవర్నర్ ఆమోదానికి పంపించింది. ఈ లోగా ఒక్కొక్క మేయర్, ఒక్కొక్క వైస్ చైర్పర్సన్ నియామకానికి గురువారం ఎన్నిక నిర్వహిస్తారు. ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం లభించింన తరువాత మరో డిప్యూటీ మేయర్, మరో వైస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అనంతరమే ఆ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. -
మాచర్ల టీడీపీలో బయటపడ్డ వర్గపోరు
మాచర్ల: స్థానిక పురపాలక సంఘం చైర్ పర్సన్గా 27వ వార్డుకు చెందిన షేక్ షాకీరూన్ ఎంపికయ్యారు. గత రెండు నెలల కిందట అప్పటి పురపాలక సంఘ చైర్పర్సన్గా నెల్లూరు మంగమ్మ ఒప్పందం ప్రకారం తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తాత్కాలిక చైర్ పర్సన్గా షాకీరూన్ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారి గురజాల ఆర్డీఓ పురపాలక సంఘ కార్యాలయంలోని మీటింగ్ హాలులో ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీకి చెందిన 13 మంది, ప్రతిపక్షానికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు హాజరై కోరమయ్యే విధంగా చూశారు. ఎన్నికల అధికారి పుల్లయ్య చైర్పర్సన్ ఎంపికకు సంబంధించి ప్రకటన విడుదల చేయగానే 10వ వార్డుకు చెందిన అధికార పార్టీ కౌన్సిలర్ వేముల వెంకట కల్యాణి, 27వ వార్డుకు చెందిన షేక్ షాకీరూన్ పేరును ప్రతిపాదించారు. 18వ వార్డుకు చెందిన మాచర్ల రాజ్యలక్ష్మి, 6వ వార్డుకు చెందిన కొమ్ము సంతోష్కుమార్లు బలపరిచారు. రెండు వర్గాలుగా చీలిక మొత్తం 29 మంది వార్డు కౌన్సిలర్లు ఉండగా 15 మంది హాజరై షాకీరూన్ను ఎంపిక చేసుకున్నట్లు ధ్రువీకరిస్తూ ఎన్నికల అధికారి ఆర్డీఓ పుల్లయ్య చైర్పర్సన్కు పత్రాలను అందజేశారు. నూతనంగా ఎంపికైన చైర్పర్సన్ షేక్ షాకీరూన్ మాట్లాడుతూ తన ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీకి 20 మంది వార్డు కౌన్సిలర్లు ఉండగా, వారి మద్దతుతో ఒక సీపీఐ కౌన్సిలర్ గెలవగా మొత్తం 21 మంది బలం ఉంది. అయితే కౌన్సిలర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. గత నాలుగు రోజులుగా రెండు వర్గాలు పోటా పోటీగా మంతనాలు జరిపాయి. కౌన్సిలర్లను ఆకట్టుకోగా దాదాపుగా చైర్పర్సన్ ఎంపికకు కోరం ఉండదని ప్రచారం జరిగింది. అయినా ఏడుగురు టీడీపీ కౌన్సిలర్లు ఎంపికకు దూరంగా ఉన్నారు. అధికార పార్టీకి సంబంధించి 13 మంది కౌన్సిలర్లు మాత్రమే మద్దతు పలుకుతుండటంతో 4, 13వ వార్డుకు చెందిన ప్రతి పక్ష కౌన్సిలర్ల మద్దతుతో గట్టెక్కి ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం నుంచే పురపాలక సంఘ కార్యాలయాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో రెండు రోజులుగా అధికార పార్టీకి చెందిన నాయకులు అందుబాటులో ఉన్న నాయకులను సాగర్కు తరలించి క్యాంపు నిర్వహించారు. బుధవారం ఉదయం భారీ బందోబస్తు మధ్య కౌన్సిలర్లను ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి ఎన్నికలు జరిగే వరకు పర్యవేక్షిస్తారని టెన్షన్ పడ్డారు. -
జూలైలో చైర్పర్సన్ల ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల చైర్పర్సన్ల ఎన్నికలను జూలై మొదటి వారంలో పూర్తి చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయాత్తమవుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రత్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడై నెలన్నర రోజులు గడుస్తున్నా.. పరోక్ష పద్ధతిలో జరిగే చైర్పర్సన్ల ఎన్నికలు ఇంకా జరగలేదు. రాష్ర్ట విభజన చట్టంలో ఎన్నికల సంఘం ప్రస్తావన లేదు. దీంతో ఇంతకాలం సందిగ్ధంలో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం.. సోమవారం అంతర్గతంగా నిర్వహించనున్న సమావేశంలో చైర్పర్సన్ల ఎన్నికల తేదీపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం నుంచి దీనిపై స్పష్టత వచ్చినా రాకపోయినా.. ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. విభజన చట్టంలో ఎన్నికల సంఘాన్ని ఏ షెడ్యూల్లోనూ చేర్చకపోతే.. సహజంగానే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతుందన్న వాదన కూడా ఉంది. అలాంటి స్థితిలో సదరు సంఘం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే ఎన్నికల నోటిఫికేషన్ చెల్లుతుందా.. లేదా.. అన్న మీమాంస కారణంగా నోటిఫికేషన్ జారీ అంశం జాప్యమవుతోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు మార్చి 30వ తేదీన, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలను రెండు దశలుగా ఏప్రిల్ 6, 11వ తేదీల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. ఇరు రాష్ట్రాల్లోనూ మొత్తం 145 మున్సిపాలిటీలు, పది కార్పొరేషన్లు (ఇందులో తెలంగాణలో మూడు కార్పొరేషన్లు. 53 మున్సిపాలిటీలు), 1096 మండలాలకు గాను సీమాంధ్రలో 663 మండలాలకు, తెలంగాణలో443 మండలాలకుగాను 441 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు జరిగాయి. (ఖమ్మం జిల్లాలో పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రకు కేటాయించడాన్ని నిరసిస్తూ రెండు మండలాల్లో నామినేషన్లు ఎవరూ వేయకపోవడంతో ఎన్నికలు జరుగలేదు). మున్సిపల్ ఫలితాలు మే 12న, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మే 13న వెల్లడయ్యాయి. కొత్తగా ఎన్నికైన రెండు రాష్ట్రాల అసెం బ్లీల సభ్యులు, పార్లమెంట్లో ఎంపీలు ప్రమాణం చేసి, వారి నియోజకవర్గంలో ఉండే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఓటు వేయడానికి ఆప్షన్ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో కూడా చైర్పర్సన్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వలేదు. మండల, జెడ్పీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కేవలం సభ్యులుగా వ్యవహరిస్తారు. పరోక్ష పద్ధతిలో ఎన్నిక జరిగే సమయంలో ఓటు వేయడానికి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్రెడ్డి సోమవారం నిర్వహించనున్న సమావేశంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నిర్వహణలపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలను జూలై మొదటి వారంలో జరిపించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. క్యాంపులను పట్టించుకోని ఎన్నికల సంఘం.. మండల, జిల్లా, మున్సిపల్, కార్పొరేషన్లలో స్పష్టమైన మెజారిటీ లేక తక్కువ స్థానాలున్న చోట ఇతర పార్టీల వారిని తమ వైపు తిప్పుకోవడానికి చేస్తున్న క్యాంపు రాజకీయాలపై ఎన్నికల సంఘం తప్ప మరే సంస్థ..చర్య తీసుకునే అవకాశం లేదు. కాని బాహాటంగా క్యాంపు కార్యక్రమాలు కొనసాగుతున్నా.. ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదు. ఎన్నికైన సభ్యులతో.. దేశంలోని ఇతర ప్రాంతాలు, విదేశాలకు సైతం వెళ్తున్నారు. జాప్యం కారణంగా కొన్ని చోట్ల క్యాంపులకు విరామమిచ్చి, ఇప్పుడు తాజాగా అధ్యక్షుల ఎన్నికల ప్రకటన వస్తే తిరిగి క్యాంపులు నిర్వహించే యోచనతో ఉన్నారు. పారదర్శకంగా జరగాల్సిన ఈ ఎన్నికలు.. డబ్బు, సభ్యులను లోబర్చుకోవడం వంటి చర్యలతో గాడితప్పుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. దీనిపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.