breaking news
CH Mohan rao
-
అందుబాటులోకి సరికొత్త పరిజ్ఞానం
♦ 15 నిముషాల్లోనే జన్యు రుగ్మతలు గుర్తించే వీలు ♦ సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ మోహన్రావు వెల్లడి ♦ జన్యు సమస్యలపై జాతీయ సదస్సు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: జన్యుపరమైన వ్యాధులను గుర్తించేందుకు సరికొత్త పరిజ్ఞానం అందుబాటులోకి రానుందని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డెరైక్టర్ సీహెచ్ మోహన్రావు వెల్లడించారు. అందుకోసం ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ సదస్సు ప్రారంభమైంది. రెండురోజులపాటు జరిగే ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మోహన్రావు మాట్లాడుతూ జన్యుపరమైన వ్యాధులను గుర్తించడం చాలా కీలకమైన అంశమన్నారు. ప్రస్తుతం పాలిమర్ చైన్ రియాక్షన్, జీన్ సీక్వెన్సింగ్ ప్రకారం జన్యుపరమైన వ్యాధులను గుర్తిస్తున్నామన్నారు. కొత్తగా నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ కొత్త పరిజ్ఞానం ద్వారా మానవుల జన్యువులను క్షణ్ణంగా పరిశీలించవచ్చన్నారు. మానవుడి శరీరంలో ఎక్కడ లోపం ఉందో గుర్తించడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపారు. ఇదిగాక నెక్ట్స్ టూ నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ టెక్నాలజీ ప్రాథమిక స్థాయిలో పరిశోధనలో ఉందన్నారు. దానిద్వారా 15 నిముషాల వ్యవధిలోనే మనిషిలోని జన్యువులు, అందులో ఉండే లోపాలను గుర్తించవచ్చన్నారు. సదస్సు నిర్వాహక కమిటీ కన్వీనర్ డాక్టర్ బి.శ్రీనాధ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 17 లక్షల మంది పిల్లలు పుట్టుకతోనే లోపాలతో పుడుతున్నారన్నారు. తెలంగాణలో ఇలా ఏటా 50 వేల మంది లోపాలతో పుడుతున్నారని పేర్కొన్నారు. జన్యుపరమైన రుగ్మతల కారణంగానే ఇలా జరుగుతోందని చెప్పారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) చేపట్టిందన్నారు. ఇందుకోసం తెలంగాణలో వైద్య సిబ్బంది నియామకం కూడా పూర్తయిందన్నారు. ప్రతీ ఏడాది కొత్త రుగ్మతలు పుట్టుకొస్తున్నాయన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ యూజీసీ విభాగం డీన్, ప్రొఫెసర్ ఎ.రవీంద్రనాథ్, డెరైక్టర్ ప్రొఫెసర్ ఎ.జ్యోతి, ప్రొఫెసర్ ఉమ, ప్రొఫెసర్ కైసర్ జమీల్, ప్రొఫెసర్ పి.పి.రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రతీ ఏడూ కొత్తగా వస్తున్న జన్యుపరమైన రుగ్మతలను శాస్త్రవేత్తలు కనుగొంటూనే ఉన్నారన్నారు. జన్యుపరమైన వ్యాధులను నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం పరిశోధనా కేంద్రాలు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాకర్ల సుబ్బారావు, ప్రొఫెసర్ దీపిక తదితరులు పాల్గొన్నారు. -
రేపట్నుంచి ‘ఏపీ అకాడమీ ఆఫ్ సెన్సైస్’ స్వర్ణోత్సవాలు
ముఖ్యఅతిథిగా గవర్నర్ నరసింహన్ ఐఐసీటీ, సీసీఎంబీల్లో 3 రోజులపాటు వేడుకలు సాక్షి, హైదరాబాద్: ఏపీ సైన్స్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ స్వర్ణోత్సవాలను గురువారం నుంచి మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నట్లు అకాడమీ అధ్యక్షుడు, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డెరైక్టర్ డాక్టర్ సీహెచ్ మోహన్రావు తెలిపారు. గవర్నర్ నరసింహన్ ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. 1963లో ఏర్పాటైన అకాడమీ సైన్స్ ప్రచారం కోసం పలు కార్యక్రమాలు చేపట్టిందని మంగళవారం ఆయన హైదరాబాద్లో విలేకరులకు తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సీసీఎంబీల్లో నిర్వహించే ఉత్సవాల సందర్భంగా సంస్థ వ్యవస్థాపక సభ్యులను సత్కరించనున్నారు. దేశం గర్వించదగ్గ 8 మంది శాస్త్రవేత్తలకు జీవిత కాల సాఫల్య పురస్కారాలు అందజేస్తామని చెప్పారు. విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 200 మంది విద్యార్థులు స్వయంగా కొన్ని పరిశోధనలు చేయడంతోపాటు శాస్త్రవేత్తలతో ముచ్చటించేలా ఈ కార్యక్రమాన్ని రూపొదించామన్నారు. 50 ఏళ్లలో ఏపీలో జరిగిన శాస్త్రాభివృద్ధిని సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు వివరిస్తారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సైన్స్ అకాడ మీ వేర్వేరుగా ఏర్పాటు కానుందని తెలి పారు. కార్యక్రమంలో ఐఐసీటీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.బి.ఎన్.ప్రసాద్, జాతీయ పౌష్టికాహార సంస్థ(ఎన్ఐఎన్) మాజీ డెరైక్టర్ డాక్టర్ శశికిరణ్, ఐఐసీటీ శాస్త్రవేత్త మధుసూదనరావు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.