breaking news
Central Planning Department
-
ఆ తర్వాతే కేంద్ర ప్రణాళిక శాఖకు కొత్త జిల్లాలు: విజయ్కుమార్
సాక్షి, విజయవాడ: ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త జిల్లాలను ప్రారంభించస్తారని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. 26 జిల్లాల ఏర్పాటుకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాం. ప్రజల నుండి 17,500కి పైగా సూచనలు, అభ్యంతరాలు వచ్చాయి. మొత్తం 284 అంశాలపై ప్రజలు వినతులు వచ్చాయి. 90 శాతం అంశాలకు సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా పరిష్కరించారు. కొన్ని మండలాలను ప్రజల డిమాండ్ మేరకు జిల్లాలు మార్చాం. పూర్తి శాస్త్రీయంగా ప్రజల సౌకర్యార్థం పునర్విభజన చేశాం. ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. అదనంగా రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశాం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన సాధించేలా జిల్లాల పునర్విభజన జరిగింది. ఏప్రిల్ 4 తర్వాత కేంద్ర ప్రణాళిక శాఖకు కొత్త జిల్లాలను పంపుతామని ప్రణాళిక కార్యదర్శి విజయ్కుమార్ అన్నారు. చదవండి: (ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి: సీఎం జగన్) -
‘న్యాక్’కు సీఐడీసీ అవార్డు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అకాడమీ ఫర్ కన్ స్ట్రక్షన్ (న్యాక్)కు కేంద్ర ప్రణాళిక శాఖ అధీనంలోని ప్రతిష్టాత్మక ‘కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ (సీఐ డీసీ)’ అవార్డు ప్రకటించింది. నిర్మాణ రంగంలో నైపుణ్యాభివృద్ధి అంశంలో ‘న్యాక్’ విస్తృత కృషికి గాను ఈ అవార్డు ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా నిర్మాణ రం గంలో విశేష కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులు, శిక్షణ సంస్థలకు ఏటా ఈ కౌన్సి ల్ అవార్డులు ప్రకటించి ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది తెలంగాణ ‘న్యాక్’ను అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 7న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ‘న్యాక్’ డెరైక్టర్ జనరల్ బిక్షపతి, డెరైక్టర్ శాంతిశ్రీ ఈ అవార్డును అందుకోనున్నారు. ‘న్యాక్’ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్మాణ రంగానికి సంబంధించి వివిధ అంశాల్లో 3.2 లక్షల మందికి శిక్షణ ఇచ్చింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 26 వేల మందికి శిక్షణ ఇవ్వటం విశేషం. ఇందు లో నిరుద్యోగ యువత 3 వేల మంది వరకు ఉన్నారు. న్యాక్లో శిక్షణ పొందిన వారికి అందజేస్తున్న సర్టిఫికెట్కు మంచి గుర్తిం పు ఉంది. ఆ సర్టిఫికెట్ ఉన్న వారికి పెద్ద సంస్థల్లో కూడా ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. ఈ మొత్తం పనితీరును గమనించిన సీఐడీసీ ప్రతినిధులు ఇటీవల రాష్ట్రానికి వచ్చి స్వయంగా దాని సేవలను పరిశీలించి అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డు రావటం ఎంతో ఆనందంగా ఉందని, సంస్థ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ఇది దోహదం చేస్తుందని సంస్థ డీజీ బిక్షపతి వ్యాఖ్యానించారు.