CDK
-
ఘనంగా సీడీకే 'కన్వర్జెన్స్ 2026' వేడుకలు
హైదరాబాద్: ప్రముఖ ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్వేర్ సంస్థ 'సీడీకే' (CDK), తన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల కోసం హైదరాబాద్, పుణె నగరాల్లో 'కన్వర్జెన్స్ 2026' వేడుకలను ఘనంగా నిర్వహించింది. సంస్థ సాధించిన విజయాలను వేడుకగా జరుపుకోవడంతో పాటు, భారతీయ సంస్కృతి కుటుంబ విలువలకు అద్దం పట్టేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ఏడాది "మన భారతీయ మూలాల్లోకి వెళ్దాం" అనే థీమ్తో వేడుకలు నిర్వహించారు.ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసే సీడీకే సంస్థ, 2019 నుండి వరుసగా 'గ్రేట్ ప్లేస్ టు వర్క్' (GPTW) గుర్తింపును పొందుతోంది. అంతేకాకుండా, 2025 సంవత్సరానికి గాను భారతదేశంలోని టాప్ 100 ఐటీ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ విజయాల వెనుక ఉద్యోగుల శ్రమతో పాటు వారి కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ఉందని ఈ వేడుక చాటిచెప్పింది.కన్వర్జెన్స్ 2026 వేడుకల్లో ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా అలంకరించిన వేదికపై సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు థీమ్ ఆధారిత ఫ్యాషన్ వాక్ వంటి కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించిన జోన్ ఆకట్టుకుంది. ఇదే వేదికపై సంస్థ అభివృద్ధికి కృషి చేసిన ప్రతిభావంతులైన ఉద్యోగులకు 'రివార్డ్స్ అండ్ రికగ్నిషన్' విభాగంలో అవార్డులను అందజేసి గౌరవించారు. -
హైదరాబాద్లో వ్యాపార విస్తరణ.. కొత్త కేంద్రం ప్రారంభం
ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామి సంస్థ అయిన సీడీకే, హైదరాబాద్లోని తమ కార్యాలయానికి అదనంగా 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ విస్తరణ ఉత్తర అమెరికాలో తమ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి అవసరమైన నైపుణ్యం, సాంకేతికతపై పెట్టుబడి పెట్టడానికి సంస్థకు ఉన్న నిబద్ధతను నొక్కి చెబుతోంది.మాదాపూర్లోని రహేజా మైండ్స్పేస్లో ఉన్న ఈ కేంద్రం, ఉత్పత్తిని వేగవంతం చేయడంతో పాటు వినియోగదారులకు మరింత సేవలను అందించనుంది. ఇది ఉత్తర అమెరికాలోని R&D, ఇన్నోవేషన్ బృందాలతో కలిసి పనిచేస్తూ.. సమగ్ర విధానాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ అత్యాధునిక కార్యాలయం ఉద్యోగుల మధ్య సహకారం, సృజనాత్మకత, శ్రేయస్సును పెంపొందించే విధంగా రూపొందించారు. ఇందులో ఓపెన్ వర్క్స్పేస్లు, అత్యాధునిక సమావేశ గదులు, వినోద ప్రాంతాలు ఉన్నాయి. తద్వారా భారత్ అపారమైన ప్రతిభకు, నిరంతర ఆవిష్కరణలకు ఒక శక్తి కేంద్రమని సీడీకే మరోసారి స్పష్టం చేసింది. -
నవంబర్ 4న సీబీఎల్ షురూ
సాక్షి, హైదరాబాద్: సీడీకే గ్లోబల్ కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్ (సీబీఎల్) నవంబర్ 4నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్పష్టం చేశారు. హైదరాబాద్కు చెందిన సీడీకే గ్లోబల్ కంపెనీ, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీజీబీఏ) సంయుక్తంగా ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నాయి. పీజీబీఏలో మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో దాదాపు 200 కార్పొరేట్ కంపెనీలకు చెందిన 500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.


