breaking news
CDF
-
పాక్ సంచలనం నిర్ణయం.. మునీర్కు కీలక బాధ్యతలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు ఆ దేశ ప్రభుత్వం ఉన్నత పదవిని కట్టబెట్టింది. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF)గా ఆసిమ్ మునీర్ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాక్ అధ్యక్ష కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో, ఆసిమ్ మునీర్కు మరిన్ని అధికారులు లభించే అవకాశం ఉంది.భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ఆర్మీని బలోపేతం చేసే దిశగా పాకిస్తాన్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే పాక్.. తమ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలను ఏకీకృతం చేసేందుకు సీడీఎఫ్ పదవిని సృష్టించింది. ఇందుకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణ చేసింది. మరోవైపు.. పాక్ ఆర్మీ చీఫ్గా పనిచేసిన మునీర్ పదవీ కాలం గత నెల 29తో ముగిసింది. దీంతో, సీడీఎఫ్ పదవిని ఆసిమ్ మునీర్కు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది.ఈ నేపథ్యంలో ఐదేళ్ల కాలానికి ఏక కాలంలో సైనిక దళాల చీఫ్గా వ్యవహరించేందుకు సీడీఎఫ్ పదవికి ఆసిమ్ మునీర్ను నియమించాలని పాక్ ప్రధాని సమర్పించిన సిఫార్సును అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆమోదించారు. ఈ మేరకు పాక్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఈ నియామకంతో పాక్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మునీర్ నిలవనున్నారు. న్యాయపరమైన విషయాల్లో అధ్యక్షుడితో సమానంగా రక్షణ పొందనున్నారు. ఆయన్ను ప్రాసిక్యూట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఐదేళ్ల పాటు ఈ పదవిలో మునీర్ కొనసాగనున్నారు. మునీర్కు స్పెషల్ హోదా..ఆర్మీ చీఫ్గా పనిచేసిన మునీర్ ఈ ఏడాదే అరుదైన ఫీల్డ్ మార్షల్ హోదాను పొందారు. ఇది అత్యున్నత సైనిక హోదా. పాక్ చరిత్రలో ఇంతకుముందు జనరల్ అయూబ్ ఖాన్కు మాత్రమే ఫీల్డ్ మార్షల్ హోదా లభించింది. తాజాగా ఇప్పుడు సీడీఎఫ్ అయ్యారు. దీంతో, పాకిస్తాన్ పలు కీలక పదవుల్లో ఉన్న వ్యక్తిగా మునీర్ రికార్డులోకి ఎక్కారు. అయితే, సీడీఎఫ్గా ఆసిమ్ మునీర్ను ప్రకటించడానికి ముందు పలు ఊహాగానాలు వచ్చాయి. ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ కావాలనే ఈ నియామకాన్ని ఆలస్యం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు పలు ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, ఎట్టకేలకు పాక్ ప్రభుత్వం సీడీఎఫ్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
నియోజకవర్గ అభివృద్ధి నిధులు 5 కోట్లకు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీఎఫ్)ను రూ. 5 కోట్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.3 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు పెంచుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో ఎంఎస్ నెం: 13 జారీ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ నియోజకవర్గాల వారీగా ఈ నిధులను వెచ్చించేందుకు గాను త్వరలోనే మార్గదర్శకత్వాలు విడుదల చేయనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి, ప్రస్తుత జిల్లాల వారీగా రాష్ట్ర మంత్రి వర్గంలోని 16 మంది పరిధిలోనికి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆయా జిల్లాల పరిధిలోనికి వచ్చే ఎమ్మెల్సీల వివరాలను ప్రత్యేకంగా ఆ జీవోలో పేర్కొన్నారు. చదవండి: షర్మిల పార్టీ వ్యూహకర్తగా ప్రియ -
పావలా కోడికి..
సాక్షి ప్రతినిధి, కర్నూలు : పావలా కోడికి రూపాయి మసాలా చందంగా ఉంది కర్నూలు జిల్లా కేంద్ర సహకార(కేడీసీసీ) బ్యాంకు వ్యవహారం. రూ.60 లక్షలతో నిర్మించిన బిల్డింగ్కు.. ఏకంగా కోటి రూపాయలతో మరమ్మతులు చేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం నిర్వహించిన పాలక మండలి(బోర్డు) సమావేశంలో కేడీసీసీబీ ఆమోదముద్ర కూడా వేసింది. బిల్డింగ్ మరమ్మతులకు సహకార అభివృద్ధి నిధుల(సీడీఎఫ్) నుంచి కోటి రూపాయలను ఉపయోగిం చుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆప్కాబ్కు కేడీసీసీబీ ఇప్పటికే లేఖ రాసింది. అనుమతి లభించిన వెంటనే మరమ్మతు పనులుకు టెండర్లు ఆహ్వానించేందుకు రంగం సిద్ధమయింది. 30 ఏళ్లు కాకుండానే.. కేడీసీసీబీని వాణిజ్య బ్యాంకుల తరహాలో అభివృద్ధి చేసేందుకు ఈ మరమ్మతులను చేపడుతున్నట్టు కేడీసీసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు వరకు బ్యాంకును విస్తరించేందుకు మరమ్మతులు చేపట్టనున్నట్లు చెబుతున్నారు. బ్యాంకు నిధులు ఒక్క రూ పాయి కూడా ఉపయోగించమని.. సీడీఎఫ్ కింద జిల్లాకు వచ్చిన కోటి 60 లక్షల రూపాయల్లో.. కోటి రూపాయలను వినియోగించనున్న ట్టు స్పష్టం చేశారు. అయితే, బిల్డింగ్ నిర్మించి 30 ఏళ్లు కూడా పూర్తికాకుండానే.. పూర్తిస్థాయిలో మరమ్మతులను చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బిల్డింగ్ నిర్మాణ వ్యయానికి మించి మరమ్మతులకు వెచ్చించాల్సిన అవసరం ఏముందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా టెండర్లు పిలవలేదు కేడీసీసీబీని వాణిజ్య బ్యాంకు తరహాలో అభివృద్ధి చేసేందుకు ఈ మరమ్మతు పనులను చేపట్టాలని భావిస్తున్నాం. ఇందుకోసం బ్యాంకు నిధులను ఒక్క పైసా వినియోగించం. సీడీఎఫ్ కింద రూ.1.60కోట్లు ఉన్నాయి. ఈ నిధులను ఉపయోగించుకోకపోతే వెనక్కు వెళ్లిపోతాయి. అయినా బిల్డింగ్ను పూర్తిగా పడగొట్టి కట్టడం లేదు. కేవలం మరమ్మతులు చేయించాలని నిర్ణయించాం. అనుమతి కోసం ఆప్కాబ్కు లేఖ రాశాం. మరమ్మతు పనులను ఓపెన్ టెండర్ల ద్వారా చేపడతాం. ఇందులో రహస్యమేమీ లేదు. - మల్లిఖార్జున రెడ్డి,కేడీసీసీబీ చైర్మన్


