-
జీడిపై చీడ రాతలు! ఎందుకో రామోజీ గుండెలు బాదుకుంటున్నాడు!!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జీడి తోటల విస్తీర్ణాన్ని చూసినా.. దిగుబడులైనా.. ఎగుమతులైనా గత సర్కారు హయాంతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపయ్యాయి. సాగు విస్తీర్ణాన్ని పెంచడంతోపాటు ఏకంగా 17 వేల ఎకరాలకుపైగా జీడి తోటలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పునరుద్ధరించింది. ఇక తితిలీ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర రైతుల నోట్లో మట్టిగొట్టిన చంద్రబాబు నిర్వాకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఆ అన్నదాతలను ఆదుకుంటూ గత సర్కారు ఎగ్గొట్టిన రూ.87.29 కోట్ల పరిహారాన్ని చెల్లించిందీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే. ప్రపంచాన్ని ముంచెత్తుతున్న వియత్నాం జీడి గింజల దిగుమతులను అరికట్టడం సాధ్యం కాకున్నా ప్రాసెసింగ్లో 50 శాతం మాత్రమే వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో 80 శాతం దిగుమతి చేసుకున్న గింజలను వినియోగిస్తే కిమ్మనని ఈనాడు రామోజీ ఇప్పుడు మాత్రం అన్యాయం జరిగిపోతోంది..! బాబోయ్ దిగుమతులు పెరిగాయ్..! ప్రాసెసింగ్ యూనిట్లు మూతబడ్డాయని గుండెలు బాదుకుంటూ తప్పుడు కథనాలకు తెగబడ్డారు!! ‘ఈనాడు’ ఆరోపణ: దిగుబడులు లేక నష్టాల బారిన రైతులు.. వాస్తవం: 2018 –19లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో 3 లక్షల ఎకరాల్లో జీడితోటలు ఉండగా ఈ విస్తీర్ణం ప్రస్తుతం 3.35 లక్షల ఎకరాలకు పెరిగింది. నాలుగేళ్లలో 35 వేల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. టీడీపీ హయాంలో రూ.6.92 కోట్లతో 8,648 ఎకరాల్లో తోటలను పునరుద్ధరిస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.13.64 కోట్లతో 17,125 ఎకరాల్లో పాత తోటలను పునరుద్ధరించడమే కాకుండా రూ.8.30 కోట్లతో 35 వేల ఎకరాల్లో కొత్త తోటలను విస్తరించింది. ఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న తోటబడుల వల్ల ఉత్పత్తి సగటున 800 కిలోల నుంచి 1,150 కిలోలకు పెరిగింది. ఫలితంగా దిగుబడులు 1.23 లక్షల టన్నుల నుంచి 1.67 లక్షల టన్నులకు పెరిగాయి. చంద్రబాబు జమానాలో రూ.701.69 కోట్ల విలువైన 12,356 టన్నుల జీడిపప్పు ఎగుమతి కాగా ఇప్పుడు నాలుగేళ్లలో రూ.1,718.85 కోట్ల విలువైన 29,399 టన్నులు ఎగుమతి అయ్యాయి. నాలుగేళ్లలో ఎగుమతులు ఏకంగా 17 వేల టన్నులకు పైగా పెరిగాయి. సాధారణంగా జీడి పిక్కల కోత మే నెల కల్లా పూర్తయిపోతుంది. ప్రస్తుతం రైతుల వద్ద పది శాతం కూడా పంట లేదు. అలాంటప్పుడు రైతుకు నష్టం ఏ విధంగా జరుగుతుందో రామోజీకే తెలియాలి. ఆరోపణ: జీడి రైతుల సంక్షేమాన్ని విస్మరించారు వాస్తవం: 2018–19లో తితిలీ తుపాన్ కారణంగా జీడి తోటలు పెద్ద ఎత్తున దెబ్బతింటే చంద్రబాబు కేవలం 70 వేల మంది రైతులకు రూ.68.18 కోట్ల పరిహారం విదిల్చారు. 1,38,458 మంది రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.87.29 కోట్ల పరిహారాన్ని సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక అందజేసి రైతులను ఆదుకున్నారు. తుపాన్తో నష్టపోయిన ప్రాంతాల్లో 21,250 ఎకరాల్లో తోటల పునరుద్ధరణ, విస్తరణ కార్యక్రమాలు చేపట్టారు. ఆరోపణ: జీడిపప్పు ధరల పతనంతో నష్టాలు వాస్తవం: రాష్ట్రంలో ఉత్పతయ్యే జీడిపప్పు మొదటి రకంæ కిలో రూ.800, రెండో రకం కిలో రూ.600 ఉంటుంది. అయితే మన జీడిపప్పు ధర వెనుక అసలు కారణాలకు ‘ఈనాడు’ ముసుగేసింది. ప్రపంచంలో అత్యధికంగా జీడిపప్పు ఉత్పత్తి చేసే వియత్నాం నుంచి యూరప్, అమెరికా దేశాలకు ఎగుమతులు జరుగుతాయి. అయితే ఆ దేశాల్లో నిల్వలు ఎక్కువ కావడంతో వియత్నాం నుంచి దిగుమతులను నిలిపివేశాయి. దీంతో ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా భారీగా దిగుమతి అవుతున్న వియత్నాం జీడిపప్పు స్థానిక మార్కెట్లో మొదటి రకం కిలో రూ.600, రెండో రకం రూ.450లకే లభిస్తోంది. గత పదేళ్లుగా ముడి గింజలు కిలో రూ.80 నుంచి రూ.120 మ«ధ్య ఉండగా ఈనాడు మాత్రం రూ.140 – రూ.150 మధ్య ఉండేవంటూ మరో అబద్ధాన్ని అచ్చేసింది. ఆరోపణ: జీడి పరిశ్రమకు చేయూత ఏదీ? వాస్తవం: జీడిమామిడి రైతుల సంక్షేమం, నాణ్యమైన జీడి ఉత్పత్తి కోసం నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రధానంగా నాణ్యమైన మొక్కలతో జీడి విస్తీర్ణ పథకం, జీడి తోటలకు బిందు సేద్యం, పాత జీడితోటల పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టారు. సాగు మెళకువలను నేర్పించడం ద్వారా జీడి పంట నాణ్యత పెంచేలా తోటబడి కార్యక్రమం ద్వారా 418 ప్రదర్శన క్షేత్రాలు నిర్వహించారు. పలాసను జీడిపప్పు ప్రాసెసింగ్ క్లస్టర్గా అభివృద్ధి చేశారు. బొబ్బిలి, అనకాపల్లిలోని ప్రభుత్వ ఉద్యానవన క్షేత్రాలతో పాటు బాపట్లలోని జీడిపప్పు పరిశోధనా కేంద్రంలో 4.5 లక్షలకు పైగా అంటుకట్టిన జీడి మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తున్నారు. ఆరోపణ: కొత్త యూనిట్లకు ప్రోత్సాహమేది? వాస్తవం: ప్రాసెసింగ్ యూనిట్ల సామర్థ్యాన్ని పెంచేలా ఆధునికీకరణకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 50 శాతం సబ్సిడీపై రూ.4 లక్షల అంచనాతో ప్యాక్ హౌస్లు, కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రూ.25 లక్షల వరకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. ఇందులో రూ.10 లక్షలు సబ్సిడీగా అందిస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.6 లక్షల సబ్సిడీతో రూ.15 లక్షల వరకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. తొలిసారిగా జీడిపిక్కల నిల్వ కోసం రూ.1.69 కోట్లు వెచ్చించి 15 కలెక్షన్ సెంటర్లను నెలకొల్పారు. రూ.2.79 కోట్లతో రైతులకు బిందు సేద్యం పరికరాలను సమకూర్చారు. జీడిపప్పు కెర్నల్ ఆయిల్ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. మెరుగైన విలువ జోడింపు, అధిక ఆదాయం కోసం శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలలో పీపీపీ ప్రాజెక్టుల కింద జీడిపప్పులో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆరోపణ: నష్టాలు భరించలేక 500 పరిశ్రమలు మూసివేత వాస్తవం: ఇంతకంటే పచ్చి అబద్ధం మరొకటి ఉండదు. రాష్ట్రంలో 402 ప్రాసెసింగ్ యూనిట్లున్నాయి. ఇవి సంవత్సరానికి 79,140 టన్నుల సామర్థ్యంతో 1.50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఏటా ఆషాఢ మాసంలో మెజార్టీ యూనిట్లు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలుపుదల చేస్తాయి. కొన్ని యూనిట్లు ఉత్పత్తిని తగ్గిస్తాయి. అంతేకానీ రాష్ట్రంలో శాశ్వతంగా మూతపడిన పరిశ్రమ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. పైగా రాష్ట్రంలో ఉన్నవే 402 పరిశ్రమలైతే 500 పరిశ్రమలు ఎలా మూతపడ్డాయో ఈనాడుకే తెలియాలి. -
Cashew: ‘పశ్చిమ’ జీడిపప్పుకు విశేష ఆదరణ
జిల్లాలో జీడిపప్పు పరిశ్రమ విస్తరిస్తోంది. ఇసుక నేలలు, మెట్ట భూముల్లో సాగవుతున్న జీడితోటల నుంచి వచ్చే పంట నాణ్యంగా ఉండటంతో ఇక్కడి జీడిపప్పు రుచిగా ఉంటోంది. జిల్లాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు జీడి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో ‘పశ్చిమ’ జీడిపప్పుకు మంచి గిరాకీ ఉంది. దేవరపల్లి: జీడిపప్పు తయారీలో పశ్చిమగోదావరి జిల్లా గుర్తింపు పొందింది. మెట్ట ప్రాంతంలో జీడిపప్పు తయారీ ఎక్కువగా ఉంది. దేవరపల్లి, దూబచర్ల, తాడిమళ్ల ప్రాంతాల్లో జీడిపప్పు పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. దాదాపు 15 ఏళ్లుగా ఈ ప్రాంతం నుంచి జీడిపప్పు ఎగుమతులు జరుగుతున్నాయి. రోజుకు 40 టన్నుల వరకు జీడిపప్పు ఎగుమతి అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో జీడిపప్పు తయారీ కుటీర పరిశ్రమగా ఉంది. పరిశ్రమల ద్వారా ఎందరో కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఎక్కువగా మహిళలకు ఉపాధి లభిస్తోంది. ఇళ్ల వద్ద మహిళలు జీడిపప్పు తయారు చేసి ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమలో తయారు చేసిన జీడిపప్పును మహిళలు ఇళ్లకు తెచ్చుకుని పప్పుపై ఉన్న పొట్టును తొలగించి, శుభ్రం చేసి తిరిగి పరిశ్రమకు అప్పగిస్తారు. ఇలా రోజుకు ఒక్కో మహిళ 20 నుంచి 25 కిలోల పప్పును శుభ్రం చేస్తారు. దీని ద్వారా రూ.250 వరకు సంపాదిస్తున్నారు. జిల్లాలోని జీడి పరిశ్రమల్లో సుమారు 3 వేల మంది వరకు పనిచేస్తున్నారు. ఒక్కో పరిశ్రమలో స్థాయిని బట్టి 70 మంది వరకు పనిచేస్తున్నారు. 100 వరకు పరిశ్రమలు ► జిల్లాలో జీడిపప్పు పరిశ్రమలు 100 వరకు ఉన్నాయి. ► వీటిలో 50 పరిశ్రమలు పెద్దవి కాగా మిగిలినవి చిన్నవి. ► దేవరపల్లిలో 10, దూబచర్లలో 8, తాడిమళ్లలో 25 వరకు పరిశ్రమలు ఉన్నాయి. ► జీడిగింజ నుంచి ఐదు రకాల పప్పును ఉత్పత్తి చేస్తున్నారు. ► గుండు, బద్దతో పాటు మూడు రకాల ముక్కను తీస్తున్నారు. ► గుండు, బద్ద ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ► కె.ముక్క (బద్దలో సగం)కు ఎక్కువ డిమాండ్ ఉంది. ► పప్పుతో పాటు పొట్టు, తొక్కలకు కూడా గిరాకీ ఉంది. ► జిల్లాలోని మెట్ట ప్రాంతంలో సుమారు 25 వేల ఎకరాల్లో జీడిమామిడి పంట సాగు ఉంది. ముక్కకు డిమాండ్ గుండు, బద్ద కంటే ముక్కకు డిమాండ్ బాగా ఉంది. కోవిడ్ నిబంధనలు సడలింపులతో ముక్క గిరాకీ పెరిగింది. హోటల్స్లో ముక్క ఎక్కువగా వినియోగిస్తారు. బస్తా గింజలకు సుమారు 3 కిలోల ముక్క వస్తుంది. రెండేళ్లుగా కోవిడ్తో పరిశ్రమల ఒడుదుడుకులతో సాగుతోంది. జిల్లాలో పండుతున్న జీడిమామిడికి నాణ్యత ఎక్కువ. దీంతో పప్పు రుచిగా, నాణ్యంగా ఉండటంతో మార్కెట్లో ఆదరణ బాగుంది. –పెంజర్ల గణేష్కుమార్, కార్యదర్శి, కాజూనట్ మర్చంట్స్ అసోసియేషన్, దేవరపల్లి తయారీ ఇలా.. చెట్టు నుంచి జీడి గింజలను సేకరించిన రైతులు వ్యాపారులకు విక్రయిస్తారు. వ్యాపారులు గింజలను పరిశ్రమలకు తరలిస్తారు. అక్కడ గింజలను బాయిలర్లో కాల్చి యంత్రాల ద్వారా బద్దలు చేసి గుండును తీస్తారు. గుండుపై ఉన్న పొర (పొట్టు)ను కూలీల ద్వారా తొలగించి బద్ద, గుండు, ముక్క తయారు చేస్తారు. ఐదు రకాలుగా పప్పును తయారు చేసి కిలో చొప్పున ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తారు. బస్తా (80 కిలోలు) గింజల నుంచి 22 నుంచి 24 కిలోల వరకు పప్పు వస్తుంది. బస్తా జీడిగింజల ధర రూ.10,400 ఉంది. -
రూ.10 కోట్లకు టోకరా
సాక్షి, రాజానగరం: జీడిపిక్కల వ్యాపారం కోసం అప్పు ఇచ్చిన బ్యాంకు అధికారులు కొన్ని రోజుల తరువాత తనిఖీ కోసం గోడౌన్కు వెళ్తే జీడిపిక్కల నిల్వలు లేకుండా ఖాళీ గోడౌన్ దర్శనమిచ్చింది. దీంతో నివ్వెరపోయిన ఆ బ్యాంకు అధికారులు తరువాత తేరుకొని సంబంధిత వ్యాపారులతోపాటు తొమ్మిది మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై శివనాగబాబు తెలిపిన వివరాలిలావున్నాయి. అనపర్తి మండలం, పేరారామచంద్రపురానికి చెందిన నలుగురు వ్యాపారులు గోడౌన్లో నిల్వ ఉంచిన జీడిపిక్కలను చూపించి, వాటిపై రాజమహేంద్రవరంలోని ఇండియన్ బ్యాంకు నుంచి రూ.10 కోట్లు అప్పు తీసుకున్నారు. ఆ తరువాత కొంత కాలానికి వారి నుంచి చెల్లించాల్సిన వాయిదాలు సక్రమంగా జమ కాకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు తనిఖీకి గోడౌన్కి రావడంతో జీడిపిక్కల బస్తాలు లేవు. ఖాళీ గోడౌన్ కనపడింది. దీంతో అప్పు తీసుకున్న నలుగురు వ్యాపారులు నల్లమిల్లి అరుణ, వరలక్ష్మి, రాధ, కర్రి వెంకటబులిరెడ్డితోపాటు వారికి అప్పు ఇప్పించిన ఏజెన్సీకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు కేతల భద్రావతి, కేతల సూర్రెడ్డి, ఎస్వీ వెంకట్రావు, గోడౌన్ యజమానులకు సంబంధించి ఇద్దరిపై బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
పేలిన బాయిలర్
కాశీబుగ్గ: దివాన్ జీడి పరిశ్రమలో బాయిలర్ పేలి ప్రమాదం చోటుచేసుకుంది. ఆపరేటర్కు తీవ్రగాయాలయ్యాయి. పలాస–కాశీబుగ్గ మున్సిపాల్టీ అనంతపురం రెవెన్యూ పరిధిలోని పారిశ్రామిక వాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. పరిశ్రమ యజమాని తాళాసు శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఉదయం ఆరు గంటల సమయంలో ఆపరేటర్ పల్లెటి ఢిల్లేశ్వరరావు బాయిలర్ను ఆన్ చేశారు. నాలుగు బస్తాల (320 కేజీల) జీడి పిక్కలను బాయిలర్లో వేశారు. వెంటనే పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆపరేటర్ చిక్కుకున్నాడు. కళ్లల్లోకి కెమికల్తో కూడిన ఉష్ణం తగలడంతో చూపుపోయే పరిస్థితి నెలకొంది. చెతులు కాలిపోయాయి. కాలుకు తీవ్రగాయమైంది. ఢిల్లేశ్వరరావు కేకలు వేయడం స్థానికంగా ఉన్న మహిళలు బయటకు తీసుకువచ్చారు. వెంటనే పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కళ్లు, ఎముకల డాక్టర్లు వైద్యం అందించారు. పదిహేను రోజులు దాటితే కాని పరిస్థితి చెప్పలేమన్నారు. ఘటనా స్థలాన్ని కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు, జిల్లా పరిశ్రమల తనిఖీ అధికారి చిన్నారావు పరిశీలించారు. ప్రమాద తీరును స్థానికులకు అడిగి తెలుసుకున్నారు. 100 మీటర్ల దూరంలో ఎగిరిపడిన పైపు.. బాయిలర్ పేలుడు ధాటికి గొడలతోపాటు యంత్రం విడిభాగాలు పగిలిపోయాయి. పరిశ్రమ కాలుష్యాన్ని బయటకు పంపే పైపు సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న మరో జీడి పరిశ్రమ రక్షణ గొడపై పడింది. ప్రతి రోజు 30 మందికి పైగా కూలీలు పనిచేయనున్నారు. ఉదయం సమయంలో ప్రమాద జరగడంతో పెను ప్రమాదం తప్పింది. బాధితుడికి ఎమ్మెల్యే పరామర్శ.. సంఘటన జరిగిన విషయం తెలుసుకున్న పలాస ఎమ్మెల్యే అప్పలరాజు, వైఎస్సార్సీపీ నాయకులు పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బాధితుడు ఢిల్లీశ్వరరావును కలిసి పరామర్శించారు. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, ఇండస్ట్రీయల్ ప్రాంతం అధ్యక్షుడు మల్లా రామేశ్వరం తదితరులున్నారు. పేద కుటుంబానికి పెద్ద కష్టం.. దివాన్ కాష్యూ ఇండస్ట్రీలో 13 ఏళ్లుగా ఢిల్లేశ్వరరావు కుటుంబం పనిచేస్తుంది. స్వగ్రామం మొగిలిపాడు నుంచి పొట్టకూటి కోసం వచ్చారు. పరిశ్రమలోని చిన్న గదిలో ఉంటున్నారు. ఇద్దరు కుమారులలో చిన్న కుమారుడు క్యాన్సర్ బారినపడి ఐదేల్ల కిత్రం మృతి చెందాడు. పెద్ద కుమారుడు అనీల్కుమార్ ఇంటర్ చదువుతున్నాడు. భార్య పార్వతీ ఇదే పరిశ్రమలో పిక్కలు వలిచే పని చేస్తోంది. పరిశ్రమకు నైట్ వాచ్మేన్, గేట్మేన్గా కూడా ఈ కుటుంబ సభ్యులే ఉంటున్నారు. -
సిండి‘కేటుగాళ్లు’
సాక్షి, పలాస(శ్రీకాకుళం) : జీడి పప్పు ఉత్పత్తిలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న పలాస జీడి పరిశ్రమలు ప్రస్తుతం దళారుల కనుసన్నల్లో నడుస్తున్నాయి. ఇక్కడ దళారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా ధరలు ఉంటున్నాయి. జీడి పిక్కలు, జీడి పప్పు ధరలను వారు నిర్ణయించే స్థితికి నేడు దిగజారాయి. పలాస ప్రాంతం నుంచి గతంలో పరిశ్రమదారులు నేరుగా దేశంలోని కోల్కతా, ముంబయి, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, గుజరాత్ వంటి వివిధ ప్రాంతాలకు జీడి పప్పును డిమాండ్ ఉన్న మేరకు స్వేచ్ఛగా విక్రయించుకునే వారు. జీడి పప్పు ధర ఆధారంగా పిక్కల ధరలు కూడా నిర్ణయించేవారు. కాలక్రమేణా జీడి పప్పు ఎగుమతి కొద్ది మంది దళారుల చేతిల్లోకి వెళ్లిపోయింది. గతేడాది ఈ సీజన్లో జీడి పిక్కలు కొనుగోళ్లు ఉద్దానంలో ముమ్మరంగా చేపట్టారు. అప్పట్లో ఒక్కో బస్తా(80కిలోలు) జీడి పిక్కల ధర రూ.13వేలు ఉండేది. ఈ ఏడాది ప్రస్తుతం ఉద్దానం ప్రాంతంలో వ్యాపారులు ఒక బస్తాను రూ. 9వేలకు కొంటున్నారు. కొన్ని గ్రామాల్లో జీడి పప్పు దిగుబడులు బాగా లేవనే నెపంతో రూ.8,600లకు కొంటున్నారు. తప్పని పరిస్థితిలో విక్రయించాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. \ ఇబ్బడి ముబ్బడిగా విదేశీ పిక్కలు గతేడాది అక్టోబర్లో వచ్చిన తిత్లీ తుపానుకు జీడి తోటలు సర్వనాశనం అయ్యాయి. అక్కడక్కడ మిగిలిన చెట్లుకు చిగుర్లు వచ్చి జీడి పిక్కలు కాపునకు వచ్చాయంటే ప్రస్తుతం గిట్టుబాటు ధర లభించడం లేదు. ఉద్దానంలో పరిస్థితి ఇలా ఉంటే పలాస జీడి పరిశ్రమలకు విదేశాల నుంచి పిక్కలు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఘనా, టాంజినియా, బిసావో తదితర దేశాల నుంచి పలాస పట్టణానికి చెందిన కొద్ది మంది దళారులు జీడి పిక్కలను దిగుమితి చేస్తున్నారు. వారు విశాఖపట్నం పోర్టు నుంచి ఈ పిక్కలను తీసుకొచ్చి గొడౌన్లలో నిల్వ చేస్తున్నారు. అవసరం కొద్ది కృత్రిమ డిమాండ్ను సృష్టించి పిక్కలను స్థానిక వ్యాపారులకు విక్రయిస్తున్నారు. గత నెలలో ఈ జీడి పిక్కల బస్తా ధర రూ.6వేలు ఉండగా నేడు వాటిని పప్పు దిగుబడి పేరుతో రూ.6వేల నుంచి రూ.8వేలకు విక్రయిస్తున్నారు. జీడి పప్పు, పిక్కల ధర మొదటిలో డిమాండ్ను బట్టి ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, దళారుల చేతిలోకి వెళ్లి పోయిందని స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీటీలపై ఆర్థిక లావాదేవీలు.. దళారులు, స్థానిక వ్యాపారులకు మధ్య జరిగే ఆర్థిక లావాదేవీలు కూడా అకౌంట్ ఫర్ కాకుండా జాగ్రత్తపడుతున్నారు. చిన్న చీటీలపై ఆర్థిక లావాదేవీలు నడుస్తున్నాయి. దీంతో ఎవరు ఎప్పుడు ఏ ధర ఇచ్చి కొంటున్నారు. అమ్ముతున్నారు అనే దానికి ఆధారాలు ఉండవు. ఈ విధంగా దళారుల చేతిలో పడి జీడి వ్యాపారులు నలిగిపోతుండగా జీడి రైతులు కూడా గిట్టు బాటు ధరలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలాస నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నప్పటికీ ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ఇప్పటికైనా మార్కెట్ కమిటీ అధికారులు ఎప్పటికప్పుడు జీడి పిక్కల ధరలు ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘ నాయకులు కోరుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా
బీజేపీలో చేరిన రాధికా ఖేరా.. ఎవరీమె?
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
బీజేపీపై డింపుల్ యాదవ్ కీలక వ్యాఖ్యలు: పదేళ్లలో..
ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!
డీప్ఫేక్ టెక్నాలజీకోసం ఇంటెల్తో జతకట్టనున్న ప్రముఖ కంపెనీ
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement