breaking news
cash withdrawal limits
-
మార్చి 13 నుంచి ఫుల్ క్యాష్
- నగదు విత్డ్రా పరిమితులు ఎత్తివేస్తామన్న రిజర్వు బ్యాంకు - 20 నుంచి సేవింగ్స్ ఖాతాల్లో విత్డ్రా పరిమితి 50 వేలకు పెంపు - ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు ఆర్.గాంధీ, ముంద్రా వెల్లడి ముంబై: పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు విత్డ్రాయల్స్పై విధించిన ఆంక్షలను క్రమంగా సడలిస్తున్న రిజర్వు బ్యాంకు... మార్చి 13వ తేదీ నుంచి పరిమితులను పూర్తిగా ఎత్తివేయనుంది. ఆలోగా ప్రస్తుతం వారానికి రూ. 24,000గా ఉన్న పొదుపు (సేవింగ్స్) ఖాతాల విత్డ్రాయల్స్ పరిమితిని ఫిబ్రవరి 20 నుంచి రూ. 50,000కు పెంచనుంది. బుధవారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ ఈ విషయాలు వెల్లడించా రు. వ్యవస్థలోకి కొత్త రూ.500, రూ.2,000 నోట్ల సరఫరాను బట్టి కరెంటు ఖాతాలు, క్యాష్ క్రెడిట్ ఖాతాలు మొదలైన వాటి నుంచి విత్డ్రాయల్ ఆంక్షలను తొలగించినప్పటికీ.. పొదుపు ఖాతాలపై మాత్రం పరిమితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు రూ. 2,000 నోట్లకు నకిలీలు వస్తున్నాయన్న వార్తలపై ఆర్.గాంధీ స్పందిస్తూ... అవన్నీ కలర్ జిరాక్స్లేనని, సామాన్యులు కూడా సులువుగా గుర్తుపట్టొచ్చని చెప్పారు. నకిలీ కరెన్సీకి ఆస్కారం లేకుండా కొత్త నోట్లలో పటిష్టమైన సెక్యురిటీ ఫీచర్లు ఉన్నాయన్నారు. రూ. 2,000 నోట్లకు సంబంధించి బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీలు దొరికిన దాఖలాలేమీ ఇప్పటిదాకా తమ దృష్టికి రాలేదని తెలిపారు. జూన్ తర్వాతే ‘నోట్ల రద్దు’డేటా.. డీమోనిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) తర్వాత తిరిగొచ్చిన పాత రూ.500, రూ.1,000 నోట్లకు సంబంధించిన పూర్తి గణాంకాలు జూన్ తర్వాతే వెల్లడించడం సాధ్యపడుతుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా తెలిపారు. డీమోనిటైజేషన్ సమయంలో విదేశాల్లో ఉన్న వారు తిరిగొచ్చి డిపాజిట్ చేసేందుకు మార్చి 31 దాకా, ప్రవాస భారతీయులకు జూన్ 30 దాకా గడువుందని ఆయన గుర్తు చేశారు. అలాగే సహకార బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తాలను, భారత కరెన్సీ చెల్లుబాటయ్యే నేపాల్, భూటాన్ దేశాల నుంచి వచ్చే నగదును కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. జూన్ 30 నాటికి ఎన్నారైల డిపాజిట్లకు గడువు ముగిసిపోతుంది కనుక.. ఆ తర్వాతే సమగ్ర వివరాలు అందుబాటులోకి రాగలవని స్పష్టం చేశారు. డీమోనిటైజేషన్కు ముందు మొత్తంగా దాదాపు రూ.15.45 లక్షల కోట్ల నగదు చలామణీలో ఉన్నట్లు అంచనా. అందులో 86 శాతం వాటా పాత రూ. 500, రూ. 1,000 నోట్లదే. అయితే పెద్ద నోట్ల రద్దు అనంతరం రిజర్వు బ్యాంకు రూ.9.92 లక్షల కోట్లు విలువ చేసే కొత్త కరెన్సీ నోట్లను అందుబాటులోకి తెచ్చినట్లు గాంధీ చెప్పారు. -
ఏటీఎంల్లో క్యాష్ విత్డ్రా పరిమితులు ఎత్తివేత
-
ఏటీఎంల్లో క్యాష్ విత్డ్రా పరిమితులు ఎత్తివేత
న్యూఢిల్లీ : ఏటీఎంల్లో నగదు విత్డ్రాయల్స్పై ఆర్బీఐ గుడ్న్యూస్ చెప్పింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏటీఎంల్లో విధించిన క్యాష్ విత్డ్రా నిబంధనలను కరెంట్ ఖాతాదారులకు, క్యాష్ క్రెడిట్ ఖతాదారులకు, ఓవర్డ్రాఫ్ట్ ఖాతాదారులకు ఎత్తివేస్తున్నట్టు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2017 ఫిబ్రవరి 1నుంచి అమల్లోకి రానున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. అయితే సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు ప్రస్తుతమున్న పరిమితులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. భవిష్యత్తుల్లో వీరికి కూడా నిబంధనలు ఎత్తివేయడాన్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ప్రస్తుతం వారానికి రూ.24 డ్రా చేసుకునే అవకాశమే ఉంది. 2017-18కి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టే తేదీనే కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు ఈ నిబంధనలు ఎత్తివేయడం విశేషం. కాగ జనవరి 16న కరెంటు ఖాతా నుంచి నగదు ఉపసంహరణ పరిమితి వారానికి రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనలను ప్రస్తుతం పూర్తిగా ఎత్తివేశారు. (చదవండి: ఏటీఎంలలో విత్డ్రా పరిమితి పెంపు)