breaking news
carruption
-
నాయకుడు ఆదేశిస్తాడు.. రాయుడు పాటిస్తాడు!
చట్టంతో ఆయనకు సంబంధం లేదు. టీడీపీ నేత చెప్పిందే శాసనం. తన పరిమితులు దాటి ఎవరినైనా బెదిరించడం ఆయన నైజం. ఇదేంటని గట్టిగా ప్రశ్నిస్తే అధికార బలాన్ని ఉపయోగిస్తాడు. భూములు ఆక్రమించుకున్నారని నోటీసులు జారీ చేస్తాడు. కొలతలు వేయించి పట్టాలు రద్దు చేస్తానంటూ బెదిరిస్తాడు. మహానంది మండలంలో ఓ రెవెన్యూ ఉన్నతాధికారి నియంత ధోరణి ఇది. ఈ అధికారి వేధింపులు తాళలేక బుక్కాపురం గ్రామానికి చెందిన రైతు రఘురామ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చావు బతుకుల నుంచి తప్పించుకున్నాడు. మహానంది: మహానంది తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నతాధికారి చెప్పిందే వేదం. అధికారపార్టీ నేతలు అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. ఏ అధికారి అయినా అధికారపార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష నేతలను సైతం గౌరవిస్తారు. కానీ ఈయన శైలి మాత్రం వేరు. కేవలం అధికారపార్టీ పక్షానే ఉంటూ వారి పనులకే పెద్దపీట వేస్తున్నాడు. ప్రతి గ్రామంలో ఉన్న అధికారపార్టీ నాయకులను ఓ కోటరీగా తయారు చేసుకుని వారి పనులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలే టార్గెట్.. శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆయన టార్గెట్. టీడీపీ నేతల ఆదేశాలతో వైఎస్సారీసీపీ కార్యకర్తలైన రైతులకు నోటీసులు జారీ చేయడం..సాగు చేసుకుంటున్న భూములు ప్రభుత్వానివని బెదిరించడం పరిపాటిగా మారింది. ఇప్పటికే ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న 60 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొన్ని పట్టా భూములు ఉన్నాయి. కలెక్టర్లు జారీ చేసిన డీ పట్టాలను రద్దు చేయడం, పాసు పుస్తకాల్లో భూములను తొలగించే అధికారం తహసీల్దార్లకు లేదు. దీంతో పలువురు బాధితులు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. లాయర్ల ద్వారా నోటీసులు జారీ చేశారు. ‘చుక్క’లు చూపిస్తూ... చుక్కల భూములను ఆన్లైన్లో చేర్చేందుకు వివిధ పత్రాలు కలిగి ఉండాలన్న నెపంతో రైతులకు సదరు అధికారులు చుక్కలు చూపిస్తున్నాడు. తిమ్మాపురం గ్రామానికి చెందిన ఓ రైతు భూమిని చేర్చేందుకు ఎకరాకు రూ. 10వేలు డిమాండ్ చేశాడు. ఆయనకు ఉన్న 4.56సెంట్ల భూమిని చేర్చాలంటే సుమారు రూ. 50వేలు డిమాండ్ చేయగా.. రూ. 25వేలకు బేరం కుదుర్చుకున్నా నేటికీ పని కాలేదని తెలుస్తోంది. సంబంధిత రైతు గత జన్మభూమిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కార్యాలయంలో ఏ విషయం బయటకు చెప్ప వద్దని సిబ్బందిని భయాందోళనలకు గురిచేస్తున్నాడు. ఓటరు జాబితా వివరాలు కావాలన్నా..సదరు అధికారిని అడగాల్సిందే! పట్టా ఉన్నా సరే వేధిస్తున్నాడు.. బుక్కాపురం గ్రామానికి చెందిన మారెడ్డి జయరాం, మారెడ్డి రఘురామ్లకు సర్వే నంబరు 89లో చెరో 50 సెంట్ల చొప్పున ఎకరా పొలం ఉంది. వీరిద్దరికి పాసుపుస్తకాల్లో పట్టా నంబర్లు 1002, 1003లలో చెరి 50సెంట్లు ఉంది. అప్పటి తహసీల్దార్ 2004లో డీ పట్టాలు జారీ చేశారు. సుమారు 45 ఏళ్ల నుంచి ఈ పొలాన్ని జయరాం వంశస్తులు సాగు చేసుకుంటున్నారు. ఈ పొలం ప్రభుత్వానికి చెందినదని తహసీల్దార్ ఇటీవల నోటీసులు జారీ చేశాడు. దీనికి కారణం జయరాం వైఎస్సార్సీపీకి చెందినవాడు కావడమే. వీరికే చెందిన మరో పొలం సర్వే నంబరు 93లో 1.25 సెంట్లు పొలం పూర్తిగా ప్రభుత్వానిదే అంటూ నోటీసులు ఇవ్వడం, అధికారపార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకుని రావడంతో మారెడ్డి రఘురామ్ ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. కానీ డీపట్టాలను రద్దు చేసే అధికారం తహసీల్దార్కు లేదని చట్టాలు తెలిసిన న్యాయవాదులు చెబుతున్నా.. ఈ అధికారి మాత్రం వినకపోవడం వెనుక అధికారపార్టీ నేతల ఒత్తిడి ఏ మేరకు ఉందో అర్థం అవుతూనే ఉందని చెప్పకనే చెప్పవచ్చు. సైనికురాలి సతీమణి పోరాటం.. బండిఆత్మకూరుకు చెందిన ఆదిలక్ష్మి భర్త నాగశేషఫణి భారత సైన్యంలో పనిచేశాడు. ఆయనకు 1992లో మహానంది మండలంలోని పూలకుంట చెరువులో 816 సర్వే నంబరులో 5.08 ఎకరాల భూమిని ఇచ్చారు. అయితే ఇదే పొలానికి రెవెన్యూ అధికారులు మహానంది మండలానికి చెందిన ఓ ముఖ్య అధికారపార్టీ నేతకు పట్టా ఇచ్చారు. దీంతో ఆదిలక్ష్మి కార్యాలయం చుట్టూ తిరుతున్నా, రెవెన్యూ సదస్సులు, జన్మభూమి సభలకు హాజరై తన పరిస్థితి చెప్పుకుని కన్నీటి పర్యంతమవుతున్నా అధికారికి కనికరం లేకుండా పోయింది. తహసీల్దార్ను అడిగితే భూములు గుర్తించాక ఇస్తామంటున్నారని బాధితురాలు వాపోతున్నారు. అధికారి అవినీతిపై కరపత్రాలు.. మహానంది మండలంలో అవినీతికి పాల్పడుతున్న రెవెన్యూ ఉన్నతాధికారిపై సీపీఐ(ఎంఎల్) రెడ్స్టార్పార్టీ, సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదలయ్యాయి. పుట్టుపల్లెలో ఒకే రేషన్ కార్డుపై భార్యకు, భర్తకు వేర్వేరుగా ఇళ్లపట్టాలు ఇచ్చారని కరపత్రాల్లో పేర్కొన్నారు. రెవెన్యూ భూములు కాకపోయినా ఆర్అండ్బీ, పంచాయతీరాజ్..తదితర భూముల్లో ఉన్నవారికి సైతం నోటీసులు ఇచ్చి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కొంత మంది మృతి చెందిన వారిపేరు మీద ఆన్లైన్లో భూములు చేర్చినట్లు తెలిపారు. -
అక్రమాల ‘బండారం’
శ్రీమఠం..శ్రీరాఘవేంద్రస్వామి కొలువైన పవిత్ర ప్రదేశం. స్వామి దర్శనార్థం దేశ నలుమూలల నుంచి ప్రతి రోజూ భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకొని కొందరు వ్యాపారులు..శ్రీమఠంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు ఏర్పాటు చేసుకొని భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా వారిపై చర్యలు లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. మంత్రాలయం (కర్నూలు): దేవదాయ శాఖ 2015 జూన్ 24వ తేదీన జారీ చేసిన జీవో 222 ప్రకారం.. మఠం, ఆలయ ప్రాకారాల్లో ఎలాంటి వ్యాపార సముదాయాలు ఉండరాదు. అలాగే ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేయరాదు. అయితే శ్రీమఠం ప్రాకారంలో నిబంధనలకు విరుద్ధంగా బండారు దుకాణం కొనసాగుతోంది. నెలకు రూ.5 లక్షల ప్రకారం దీనిని బాడుగకు తీసుకున్నారు. రోజూ దుకాణంలో ఎంత లేదన్నా రూ.50 వేల ప్రకారం వ్యాపారం జరుగుతోంది. ఉత్సవాల సమయంలో రూ.3 లక్షల వరకు ఉంటోంది. మఠం ప్రాంగణంలో బండార్ ఉండటంతో భక్తులు గుడ్డిగా మోసపోతున్నారు. సదరు దుకాణం శ్రీమఠానిదేనని కొనుగోళ్లు జరుపుతున్నారు. నిర్వాహకులు ఎవరంటే.. కర్ణాటక రాష్ట్రం ఉడిపి ప్రాంతానికి చెందిన ఉడిపి రంగ, పరమేష్లు 25 ఏళ్ల క్రితం మంత్రాలయం వచ్చారు. ఒకరు మఠం ఎదుట టెంకాయల వ్యాపారం పెట్టుకోగా..ఇంకొకరు గుడి పూజారి వ్యాసరాజాచార్ షాపింగ్ కాంప్లెక్స్లో కూలిగా చేరారు. మూడేళ్ల తర్వాత శాంతినికేతన్ షాపింగ్ కాంప్లెక్స్లో చిన్న రీల్ క్యాసెట్ సెంటర్ పెట్టుకున్నారు. రెండేళ్లకు మరో రెండు క్యాసెట్ సెంటర్లు చేసుకున్నారు. లాభాలు పొంది 2005లో రూ.50 లక్షలు వెచ్చించి ఉడిపి హోటల్, లాడ్జీని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి శ్రీమఠంలో పీఠాధిపతుల సన్నిహితులతో పరిచయాలు పెంచుకున్నారు. 2009లో వరద తర్వాత అప్పటి పీఠాధిపతి పూర్వాశ్రమ కుమారుడు సుయమీంద్రాచార్తో ఉన్న పరిచయాలతో శ్రీమఠం ప్రాకారంలో పూజా బండార్ ఏర్పాటు చేశారు.ఎనిమిదేళ్లుగా పూజా బండార్ కొనసాగుతోంది. బయట మార్కెట్లో రూ.10 విలువజేసే వస్తువును ఇక్కడ రూ.60కు విక్రయించడం పరిపాటిగా మారింది. తిలాపాపం తలా పిడికెడు.. జీవో 222 పకడ్బందీగా అమలు చేయాల్సిన దేవదాయ శాఖ అధికారులకు శ్రీమఠంలోని బండార్ దుకాణం కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. దుకాణ నిర్వాహకులు అధికారులకు నెలనెలా మామూళ్లు ఇస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు..భక్తుల దోపిడీలో అధికారులకు వాటాలు వెళ్లడం విస్మయాన్ని కల్గిస్తోంది. మఠంలో ఏ చిన్న పని కావాలన్నా ఎండోమెంట్ అధికారులు నుంచి అనుమతులు తెచ్చుకోవాలంటూ మఠం పెద్దలు సూచిస్తారు. మరి ఇంతగా భక్తులను దోస్తున్న దుకాణానికి అనుమతులు ఎలా వచ్చాయో అంతుబట్టడం లేదు. ప్రతేడాది దుకాణానికి కచ్చితంగా బహిరంగ వేలం నిర్వహించాలి. అయితే ఆమ్యామ్యాలతో గుట్టుగా టెండర్ ముగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
మిర్చి విత్తనాల అవినీతిలో మంత్రికి వాటా
వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట టౌన్: వ్యవసాయ శాఖ మంత్రికి వాటా ఉండడంతోనే అధిక ధరలకు మిర్చి విత్తనాల విక్రయాలు కొనసాగాయని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆరోపించారు. బుధవారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎన్నెస్పీ కెనాల్స్ కార్యాలయం వద్ద కుడి కాల్వకు సాగర్ జలాల విడుదల కోరుతూ ధర్నా నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేటలో సైతం మిర్చి విత్తనాలు కిలో లక్ష రూపాయలకు విక్రయాలు జరిగాయన్నారు. విత్తన కంపెనీల నుంచి అందిన వాటాల కారణంగానే అధిక ధరలను, కల్తీలను నియంత్రించలేక పోయారని ఆరోపించారు. దీంతో కల్తీ విత్తనాలు మార్కెట్లోకి ప్రవేశించి పంటలు పండక రైతులు దారుణంగా నష్టపోయారని చెప్పారు. విత్తన చట్టంలోని లోపాల కారణంగా చర్యలు తీసుకోలేకపోతున్నామని మంత్రి ప్రకటించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రెండున్నర సంవత్సరాల తరువాత ఈ మాటలు ఎవరిని మోసం చేసేందుకు చెబుతున్నారో తెలపాలని ప్రశ్నించారు. వ్యవసాయ అధికారులు ప్రతి ఏడాది తనిఖీలు నిర్వహించి «ధవీకరించాకే మార్కెట్లోకి విత్తనాలు వస్తాయన్న విషయం అందరికీ తెలుసన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయాక నకిలీలు విక్రయిస్తే పీడీ యాక్టు ప్రయోగిస్తామని చెప్పడం రైతులను మభ్యపెట్టడానికేనని విమర్శించారు.