-
యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిలైతే.. రూ.100 నష్టపరిహారం
ప్రస్తుతం దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. అయితే, కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగు పెట్టిన రోజు(ఏప్రిల్ 1) ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మూసివేయబడ్డాయి. బ్యాంకుల మూసివేత కారణంగా చాలా మంది వినియోగదారులు డిజిటల్ పేమెంట్స్ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. ఈ సమయంలో ఎన్ఈఎఫ్టీ, ఐఎంపీఎస్, యూపీఐ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంతో చాలా మంది వినియోగదారుల డిజిటల్ ట్రాన్సక్షన్స్ ఫెయిలయ్యాయి. కొన్ని సందర్భాలలో కస్టమర్ అకౌంట్లలో కట్ అయిన డబ్బులు బెనిఫిషియరీ ఖాతాలో జమ కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రాన్సక్షన్ ఫెయిల్ అయితే సదురు ఖాతాలో తిరిగి అమౌంట్ రీ ఫండ్ అవ్వాలి. ఒకవేళ అమౌంట్ రీఫండ్ కాకపోతే బ్యాంకులు కస్టమర్లకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1న చాలా మంది కట్ అయిన డబ్బులు తిరిగి జమ కాలేదు అని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఎన్పీసీఐ వివరణ ఇస్తూ ట్వీట్ చేసింది. “మార్చి 31వ తేదీ ఆర్థిక సంవత్సరం చివరి రోజు, ఏప్రిల్1వ తేదీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే రోజు.. కాబట్టి ఈ రెండు రోజులు బ్యాంకుల సర్వర్లు డౌన్ అయినట్లు పేర్కొంది. తర్వాత సేవలను పునరుద్దరించినట్లు" పేర్కొంది. సెప్టెంబర్20, 2019న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. నిర్ణీత కాలపరిమితిలో లావాదేవీల పరిష్కారం, డబ్బులు ఖాతాలో జమ కాకపోవడం వంటివి జరిగితే బ్యాంకు ఆ వినియోగదారుడికి పరిహారం చెల్లించాలి. యూపీఐ కస్టమర్ కేర్కు ఫిర్యాదు చేస్తే.. డబ్బులు చెల్లించేవరకు ప్రతిరోజు రూ.100 పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం.. యూపీఐ ట్రాన్సక్షన్ విఫలమై.. కస్టమర్ అకౌంట్ నుంచి డబ్బులు డిడక్ట్ అయితే టీ+1 రోజుల్లో డబ్బులు తిరిగి ఖాతాలో జమచేయాలి. చదవండి: ఈ స్కోడా కారుపై రూ.8 లక్షల వరకు డిస్కౌంట్! -
'ఆధార్' ఏటీఎంలు వచ్చేస్తున్నాయ్..
హైదరాబాద్ : ఎటువంటి కార్డు అవసరం లేకుండానే ఏటీఎం లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటును ప్రైవేటు రంగ డీసీబీ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఆధార్ నంబరు ఉంటే చాలు కార్డ్లెస్ ఏటీఎం సేవలను ఉపయోగించుకోవచ్చు. ఈ మెషీన్లు బయోమెట్రిక్ విధానంలో పనిచేస్తాయి. ఆధార్ కార్డులో ఉన్న వేలి ముద్రలను ఈ ఏటీఎం మెషీన్లకు అనుసంధానం చేస్తారు. దీనితో ఆధార్ కార్డు నంబర్, వేలి ముద్ర ఇవ్వగానే ఏటీఎం మిషన్ల నుంచి నగదు తీసుకోవచ్చు. ప్రస్తుతం ముంబైలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ విధానం త్వరలో దేశంలోని 400 ఏటీఎం మెషీన్లకు విస్తరింప చేయనున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement