breaking news
carbon search
-
చైల్డ్ పోర్నోగ్రఫీ కేసు.. 59 చోట్ల సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: ఆపరేషన్ ‘మేఘ చక్ర’లో భాగంగా సీబీఐ శనివారం దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 59 చోట్ల సోదాలు జరిపింది. చిన్నారులపై లైంగిక వేధింపుల మెటీరియల్ (సీఎస్ఏఎం)పై నమోదైన రెండు కేసుల దర్యాప్తు భాగంగా ఈ దాడులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ ‘కార్బన్’ ద్వారా సేకరించిన సమాచారం, సింగపూర్లోని ఇంటర్పోల్ కార్యాలయం అందించిన వివరాల మేరకు సీఎస్ఏఎం పంపిణీ దారుల క్లౌడ్ స్టోరేజీ కేంద్రాల్లో సోదాలు చేపట్టింది. ఈ పంపిణీదారులు బాలలపై అసభ్యకరంగా చిత్రీకరించిన వీడియోలను ఆన్లైన్లో ఉంచి డబ్బు సంపాదిస్తున్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న అశ్లీల వీడియోలున్న ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వివరాలు తెలుసుకుని బాధితులు, బాధ్యులను గుర్తిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. -
పాతబస్తీలో 25 మంది రౌడీ షీటర్లు అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని పశ్చిమ మండలం పరిధిలోని పాతబస్తీలో శనివారం అర్థరాత్రి నుంచి పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా 25 మంది రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అడిషనల్ డీసీపీ లింబారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. పట్టుబడిన రౌడీ షీటర్లలో కైజర్ ముఠా సభ్యుడు తబ్రేజ్తోపాటు పలువురు రౌడీ షీటర్లు ఉన్నారు. సోమవారం రిపబ్లిక్ డే దినోత్సవం సందర్బంగా పాతబస్తీలోని అణువణువు పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ తనిఖీలు ఆదివారం ఉదయం వరకు కొనసాగాయి.