breaking news
Capital city formation
-
భూములు కొనుగోలుపై సీబీఐ విచారణకు సిద్ధమా: అంబటి
హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజధాని పరిసర ప్రాంతాల్లో ఎవరెవరు ఎన్ని భూములు కొన్నారో సీబీఐ విచారణకు సిద్ధమా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. ఆయన శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాబు తాబేదార్లు కొన్న భూములపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అంబటి స్పష్టం చేశారు. అయితే రాజధాని నిర్మాణానికి భూములివ్వడానికి రైతులు సుముఖంగా లేరన్నారు. భూముల సమీకరణపై రైతాంగం తీవ్ర ఒత్తిడి, భయాందోళనలకు లోనవుతోందన్నారు. రైతులకున్న అనుమానాలు తీర్చటంలో ప్రభుత్వం విఫలమైందని అంబటి అన్నారు. టీడీపీ, బీజేపీ ప్రజా ప్రతినిధులు వందల ఎకరాలు భూములు కొన్నట్లు అక్కడి ప్రజలు పేర్లతో సహా చెబుతున్నారని....ఇది వాస్తవం కాదా? అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. చంద్రబాబు ఇతరులపై నిందలు వేయటం సరికాదని, వాస్తవ దృక్పధంతో ఆలోచించాలని సూచించారు. రైతుల్లో నమ్మకం కలిగిస్తే వారే స్వచ్ఛందంగా భూములిస్తారని, పంట భూముల్లో కాకుండా నిరూపయోగంగా ఉన్నభూముల్లో రాజధాని నిర్మాణం జరగాలని అంబటి అన్నారు. -
రాజధాని ఎంపికపై చంద్రబాబుతో కమిటీ భేటి
హైదరాబాద్: రాజధాని ఎంపిక అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో శివరామకృష్ణన్ కమిటీ శనివారం భేటి కానుంది. రాష్ట్ర విభజన అనంతరం రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై చంద్రబాబుతో కమిటీ చర్చలు జరుపనుంది. రాజధాని ఎక్కడ అనే అంశం చర్చించకుండానే యూపీఏ ప్రభుత్వ హయంలో ఆంధ్రప్రదేశ్ ను విభజన చేసింది. తాజా ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పాటైన ప్రభుత్వం రాజధానిపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధాని ఎంపికపై ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో శివరామన కమిటీ పర్యటించింది. రాజధాని ఎంపిక తమ పనికాదని, తమది టెక్నికల్ నివేదిక మాత్రమేనని శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు రతన్ రాయ్ గతంలో చెప్పారు. సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వనరులకు సంబంధించిన సాంకేతికపరమైన వివరాల సేకరణ కోసమే తాము రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ ఇన్చార్జి చైర్మన్ డాక్టర్ రతన్రాయ్ పర్యటన సందర్భంగా మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.