-
వామ్మో తెలుగు అనువాదం!
కోజికోడ్: తెలంగాణలో ఎన్నికల ప్రచార సభల్లో తన ప్రసంగాల అనువాదం సందర్భంగా చిత్రమైన సమస్యలు ఎదుర్కొన్నట్టు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ చెప్పుకొచ్చారు. తెలంగాణలో నెల రోజులకు పైగా హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెర పడటం తెలిసిందే. బుధవారం కేరళలోని కోజికోడ్లో రాహుల్ ఓ పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగాన్ని ప్రముఖ ఉపన్యాసకుడు, ఐయూఎంఎల్ ఎంపీ అబుస్సమద్ సమాధానీ మలయాళంలోకి అనువదించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తనకెదురైన అనుభవాలను రాహుల్ గుర్తు చేసుకున్నారు. ‘‘ఒక ప్రచార సభలో నా ప్రసంగాన్ని అనువదిస్తున్న వ్యక్తి ఎందుకోగానీ చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు. నేనొకటి చెబుతుంటే ఆయన మరొకటి చెప్పసాగాడు. ఇక అలా కాదని నేను మాట్లాడిన పదాలు లెక్కబెట్టడం మొదలు పెట్టా. నేను హిందీలో ఐదు పదాలు మాట్లాడినప్పుడు తెలుగులో ఏడెనిమిది పదాలతో ముగిస్తాడని చూశా. కానీ ఆయన ఏకంగా 20 నుంచి 30 పదాలు మాట్లాడాడు. పైగా నేను బోరు కొట్టే విషయాలు మాట్లాడినప్పుడేమో జనం పరమోత్సాహంతో గట్టిగా చప్పట్లు కొట్టారు. మాంచి ఉత్సాహపూరితమైన ముచ్చట్లు చెప్పినప్పుడేమో అందరూ పూర్తి నిశ్శబ్దంగా ఉన్నారు. అంతా అనువాద మహిమ!’’ అంటూ వాపోయారు. ‘‘అంతా అలా ఉల్టాపల్టాగా నడిచింది. అయినా సరే, నేను ఎవరిపైనా కోపగించుకోలేని పరిస్థితి! పైగా ప్రసంగం సాగినంతసేపూ నిండుగా నవ్వుతూనే ఉండాలి’’ అని చెప్పుకొచ్చారు. బహుశా తన ప్రసంగాలకు అనువాదకునిగా ఉండటం ప్రమాదకరమైన పనేనంటూ రాహుల్ చమత్కరించడంతో అంతా నవ్వుకున్నారు. చిరిగిన దుస్తుల మాటున సంపద దాస్తున్న నేతలు రాజకీయ నాయకుల నిరాడంబర వస్త్ర శైలిని బట్టి వారిని అంచనా వేయకూడదని రాహుల్ అభిప్రాయపడ్డారు. నేటి నాయకులు తాము చూపించదలచింది మాత్రమే ప్రజలకు చూపిస్తుంటారని అన్నారు. ‘‘నన్ను కలవడానికి ఎందరో నాయకులు వస్తుంటారు. సాదాసీదా బట్టలు, చిరిగిన బూట్లతో కనిపిస్తారు. కానీ వాళ్లింటికి వెళ్తే పోరి్టకోలో ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లుంటాయి. వాళ్ల పిల్లలు అతి ఖరీదైన జీవితం గడుపుతూ కన్పిస్తారు. కనుక ఒక రాజకీయ నాయకుని ఆర్థిక స్థితిని సరిగా అంచనా వేయాలంటే అతని పిల్లలను గమనిస్తే చాలు. 18 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను కనిపెట్టిన తిరుగులేని సూత్రమిది’’ అని చెప్పారు. -
ఒక్క నియోజకవర్గాన్నీ వదలకుండా..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో దూకుడుగా ముందుకెళ్తున్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రచార వ్యూహానికి మరింత పదును పెడుతోంది. వరుసగా పెద్ద సంఖ్యలో బహిరంగ సభలు, రోడ్షోలు, స్థానికంగా అభ్యర్థులు పాల్గొనే ప్రచార సభలతో.. ఏ నియోజకవర్గాన్ని, వాటి పరిధిలోని గ్రామాలను వదలకుండా ‘కార్పెట్ బాంబింగ్’ను తలపించేలా ‘కార్పెట్ కాన్వాసింగ్ (ప్రచారం)’ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేయాలని, ప్రతిపక్షాలను ఉక్కిరిబి క్కిరి చేసేలా వ్యూహాలను అమలు చేయాలని ఆలోచనకు వచ్చింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత, ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం ప్రగతిభవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి తన్నీరు హరీశ్రావులతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారం, జన సమీకరణ, ఇతర పార్టీల నుంచి చేరికలు, పార్టీ నేతల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. పార్టీ అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పలువురు కీలక అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన అంశంపైనా ఈ భేటీలో చర్చించినట్టు తెలిసింది. ఎక్కడా వదలకుండా.. సీఎం కేసీఆర్ ఈ నెల 15 నుంచి వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు 17 రోజుల్లో 41 బహిరంగ సభల్లో పాల్గొనేలా ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. 10న నామినేషన్ల గడువు ముగిసి, తుది అభ్యర్థులు ఖరారవుతారు. ఆ తర్వాత మరో 40 నుంచి 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పాల్గొనేలా సభల షెడ్యూల్ రూపకల్పన చేస్తున్నారు. ‘కార్పెట్ బాంబింగ్’ తరహాలో వరుసగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం సాగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సీఎం పాల్గొనే సభలన్నింటికీ భారీ జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. మరోవైపు కేటీఆర్, హరీశ్ సుమారు 60కిపైగా నియోజకవర్గాల్లో రోడ్షోలలో పాల్గొననున్నారు. గ్రేటర్ పరిధిలో కేటీఆర్, ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీశ్రావు స్థానిక ప్రచార ఇన్చార్జులుగా ఉంటూనే.. తాము పోటీచేసే నియోజకవర్గాల్లో, ఇతర చోట్ల సమన్వయ బాధ్యతలను చూడాల్సి ఉండనుంది. ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ తదితరులు పార్టీలో సమన్వయంతోపాటు ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా పనిచేయనున్నారు. ఇక పార్టీ అభ్యర్థులపై ఒత్తిడి తగ్గించడం, ఇతర కీలక నేతలతో సమన్వయం కోసం కేసీఆర్ నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్చార్జుల నియామకాన్ని చేపట్టారు. ప్రస్తుతానికి 54 మంది పేర్లు ఖరారు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ కీలక నేతలు ఈ ఇన్చార్జుల జాబితాలో ఉన్నారు. ఇక నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే బాధ్యతను హరీశ్రావుకు సీఎం కేసీఆర్ అప్పగించారు. ‘వార్ రూమ్’తో వ్యూహాల అమలు బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేసేందుకు ఇప్పటికే ప్రత్యేక వార్రూమ్ను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ, అభ్యర్థులతోపాటు విపక్షాల సమగ్ర సమాచారాన్ని క్షణాల్లో విశ్లేషించేలా సిద్ధం చేశారు. బూత్స్థాయి నుంచీ పార్టీల బలాలు, బలహీనతలు, స్థానికంగా ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు, సామాజికవర్గాల వారీగా ఓటర్ల వివరాలు వంటివన్నీ అందుబాటులో పెట్టారు. పార్టీ సోషల్ మీడియా వింగ్ బాధ్యులు జగన్మోహన్రావు, దినేశ్ చౌదరి, సతీశ్రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు వార్రూమ్ కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నారు. చేరికలపై మరింత ఫోకస్ బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు విపక్షాల్లోని బలమైన నేతలెవరు, వారిలో బీఆర్ఎస్లో చేరేందుకు ఉన్న అవకాశం, పార్టీలో చేర్చుకునేందుకు తీసుకోవాల్సిన చొరవపై ఓ ప్రైవేటు సర్వే సంస్థ ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పెద్దలకు సమాచారాన్ని చేరవేస్తోంది. దీని ఆధారంగా ఇతర పార్టీల నుంచి చేరికలను వేగవంతం చేయాలని నేతలు భావిస్తున్నారు. విపక్షాల్లో టికెట్ దక్కని అసంతృప్తులను బీఆర్ఎస్ గూటికి చేర్చే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్రెడ్డితోపాటు ఓ మాజీ మంత్రి త్వరలో బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. సాంస్కృతిక బృందానికి దిశానిర్దేశం కవి గాయకుడు ఏపూరి సోమన్న, మిట్టపల్లి సురేందర్ గురువారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్షోలతోపాటు ఎన్నికల ప్రచారంలో కీలకమైన సాంస్కృతిక, కళా బృందాలు ఏమేం చేయాలన్న దానిపై వారికి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని చాటడంతోపాటు తెలంగాణ ఉద్యమకాలం నాటి సెంటిమెంటును రగిల్చేలా ఆటపాటలు ఉండాలని సూచించారు. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా: నిక్కీ హేలీ
వాషింగ్టన్: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రముఖ భారతీయ అమెరికన్, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ(51) ప్రకటించారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానన్నారు. ఈ వారంలోనే ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ఆమె విడుదల చేసే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కరే ఇప్పటి వరకు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచారాన్ని రెండు నెలల క్రితమే ప్రారంభించారు. తాజా పరిణామంతో తన మాజీ బాస్ ట్రంప్కు ఆమె ఏకైక ప్రత్యర్థిగా నిలువనున్నారు. నిక్కీ హేలీ సౌత్ కరోలినాకు రెండు పర్యాయాలు గవర్నర్ గాను, ఐరాసలో అమెరికాలో రాయబారిగాను పనిచేశారు. ట్రంప్ మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేసిన పక్షంలో బరిలో ఉండబోనంటూ గతంలో ప్రకటించిన హేలీ మనసు మార్చుకున్నారు. నిక్కీ హేలీ అసలు పేరు నిమ్రత నిక్కీ రన్ధావా హేలీ. ఈమె తల్లిదండ్రులు అజిత్ సింగ్ రన్ధావా, రాజ్ కౌర్ రన్ధావా. పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసే అజిత్ సింగ్ కుటుంబంతో కలిసి 1960ల్లో కెనడాకు, అక్కడి నుంచి అమెరికాకు చేరారు. -
సచిన్ సోలో ప్రచార ర్యాలీ వ్యూహం..టెన్షన్లో కాంగ్రెస్
రాజస్తాన్ అంతటా మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ సోలోగా ర్యాలీలు చేయనున్నట్లు సమాచారం. దీంతో మళ్లీ రాజస్తాన్లో అంతర్గతంగా కాంగ్రెస్ నాయకుల మధ్య కోల్డ్వార్ ప్రారంభమైందని భావిస్తున్నాయి పార్టీ వర్గాలు. కేవల 10 నెలల వ్యవధిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సచిన్ ఇలా సోలోగా ప్రచార ర్యాలీలు నిర్వహించడంపై పార్టీలో రకరకాలు ఊహాగానాలు హల్చల్ చేయడం ప్రారంభించాయి. అదీగాక ఇటీవలే రాజస్తాన్లో భారత్ జోడో యాత్ర చాలా విజయవంతం జరిగింది కూడా. అనూహ్యంగా మళ్లీ సచిన్ ఇలా నిర్ణయం తీసుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఐతే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీని సంబంధిత వాటిల్లో మరింత బోపేతం చేస్తూ కార్యచరణలో ఉంచడమే లక్ష్యంగా సచిన్ ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వచ్చేవారం నుంచే సచిన్ పైలల్ రైతులు, యువతను ఉద్దేశించి వరుస బహిరంగ సభల్లో ప్రసగించనున్నట్లు తెలిపాయి. ఐతే ఒకపక్క రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార అట్టడుగు స్థాయి సంస్థ పనుల్లో బిజీగా ఉండటం, మరోవైపు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా తన చివరి బడ్జెట్తో స్వయంగా వెళుతున్నందున, సచిన్ ఇలా సోలోగా ర్యాలీలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారని కొందరూ విశ్లేషకులు భావిస్తున్నారు. అదీగాక 2003 లేదా 2013ల మాదిరిగా పార్టీ తుడిచిపెట్టుకుపోకుండా చూసేందుకు మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ జాట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. ఐతే పైలట్ ప్రచారానికి రాహుల్ గాంధీ ఆమోదం ఉందని చెబుతున్నప్పటికీ, ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి అనుమతి తీసుకులేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక రాష్ట్ర నాయకుడిగా సచిన్కి ఇదంతా అవసరమా అని పార్టీలో కొందరూ నాయకులు మండిపడుతున్నట్లు సమాచారం. (చదవండి: నిర్జన ప్రదేశంలో.. ఏకంగా రూ. 10 లక్షల నోట్ల కట్టలు) -
Andhra Pradesh: కాటేసిన కానుక!
డ్రోన్ ఫొటోల కోసం.. చంద్రన్న కానుకలున్న లారీల వైపు అక్క చెల్లెమ్మలు ఆశగా పరుగులు తీస్తుంటే డ్రోన్ ఫొటోలు బాగా వస్తాయని టీడీపీ నేతలు, నిర్వాహకులు మౌనంగా చూస్తూ ఉండిపోయారు. ఈ క్రమంలో మహిళలు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఊపిరి ఆడక వారు చేసిన ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి పంపిణీని నిలిపివేసి బాధితులను ఆస్పత్రికి తరలించారు. సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, గుంటూరు: పత్రికల్లో ఫొటోలు, టీవీల్లో వీడియోలు, డ్రోన్ కెమెరా షాట్లు లక్ష్యంగా టీడీపీ ఆదివారం గుంటూరులో నిర్వహించిన చంద్రన్న కానుకల పంపిణీ ముగ్గురు పేద మహిళల ప్రాణాలను బలి తీసుకుంది. అధికారంలో ఉండగా 2015లో గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని బలిగొన్న చంద్రబాబు ప్రచారార్భాటం... గతవారం కందుకూరు ఇరుకు సందుల్లో నిర్వహించిన కార్యక్రమం 8 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ దారుణాన్ని మరచిపోకముందే నూతన సంవత్సరం తొలిరోజే మరో విషాదం చోటు చేసుకుంది. ఈసారి ముగ్గురు పేద మహిళలు బాబు వికృత రాజకీయ క్రీడకు బలయ్యారు. మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. తన రాజకీయ ప్రచార పదఘట్టనల కింద సామాన్యులు నలిగిపోతూ ప్రాణాలు అనంతవాయువుల్లో కలసిపోతున్నా చంద్రబాబు తీరు మారడం లేదు. ఏమాత్రం పశ్చాత్తాపం కానరావడం లేదు. మంచినీళ్లూ ఇవ్వలేదు.. సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ నేతలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పేద మహిళలను వికాస్ కాలేజీ మైదానానికి తరలించారు. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగానికి చెందిన ఉయ్యూరు ఫౌండేషన్ ఎండీ ఉయ్యూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు వేదిక వద్దకు చేరుకుని స్వయంగా పేదలకు సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తారని షెడ్యూల్లో పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచే పేదలను తరలించగా చంద్రబాబు సాయంత్రం 5.30 గంటలకు వేదిక వద్దకు రావడం గమనార్హం. అప్పటికే దాదాపు ఐదు గంటలకుపైగా నిరీక్షించాల్సి రావడం, కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేకపోవడంతో మహిళలు అల్లాడారు. అంత ఆలస్యంగా వచ్చినా చీరల పంపిణీని ప్రారంభించలేదు. చీరల పంపిణీ మొదలుపెడితే చంద్రబాబు ప్రసంగం వినేందుకు ఎవరూ ఉండరనే భయంతో టీడీపీ నేతలు వాటిని మహిళలకు అందించలేదు. సాయంత్రం 5.35 గంటలకు చంద్రబాబు ప్రసంగం ప్రారంభించి 6.15 గంటలకు ముగించారు. కొంత మందికి మాత్రం చంద్రబాబు సంక్రాంతి కానుకలు అందచేయగా మిగతావారికి టీడీపీ నేతలు ఇస్తారంటూ వెళ్లిపోయారు. కానుక పంపిణీ కోసం సన్నగా ఏర్పాటు చేసిన క్యూలైన్లు ఐదు నిమిషాల్లోనే... అప్పటివరకు కానుకల పంపిణీ గురించి గొప్పగా చెప్పిన నిర్వాహకులు చంద్రబాబు నిష్క్రమించగానే మాట మార్చారు. నామమాత్రంగా కొందరికి అందించి చేతులు దులిపేసుకోవాలని భావించారు. మిగిలిన వారందరికీ డివిజన్లలోకి వచ్చి పంపిణీ చేస్తామని చెప్పడంతో మహిళలు నిర్ఘాంతపోయారు. టీడీపీ నేతలు, ఆ పార్టీ వలంటీర్లు కూడా బాబు ప్రసంగం ముగియగానే జారుకోవడంతో పేదల్లో ఆందోళన నెలకొంది. చీరలు పంపిణీ చేస్తామని మభ్యపుచ్చి బలవంతంగా తీసుకొచ్చి గంటల తరబడి పడిగాపులు కాశాక తీరా మొహం చాటేయడంతో వారిలో ఆక్రోశం నెలకొంది. కానుకల కోసం తోసుకుంటూ తూతూమంత్రంగా ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను నెట్టుకుంటూ ముందుకు కదిలారు. తోపులాటలో ఒకరిపై ఒకరు పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో గుంటూరు కన్నావారితోటకు చెందిన సయ్యద్ ఆసియా (48), ఏటీ అగ్రహారానికి చెందిన గోపిదేశి రమాదేవి (50), మారుతీనగర్ నాయీబ్రాహ్మణ కాలనీకి చెందిన షేక్ బీబీ (55) తొక్కిసలాటలో ఊపిరి ఆడక మృతి చెందారు. వీరిలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 30 కౌంటర్లంటూ.. 12 లారీల్లో చంద్రన్న సంక్రాంతి కానుకలను 30 కౌంటర్లు ఏర్పాటు చేసి పంపిణీ చేస్తామని టీడీపీ నేతలు పోలీసులకు సమాచారమిచ్చారు. కానీ కేవలం 12 మాత్రమే ఏర్పాటు చేశారు. అది కూడా కానుకలతో కూడిన లారీలను నేరుగా మైదానంలోకి తరలించి వాటి నుంచే పంపిణీ చేశారు. వాహనాలను దూరంగా కాకుండా దగ్గరగా ఇరుకుగా నిలబెట్టారు. చంద్రబాబు వెళ్లిపోయిన 5 నిముషాల్లోనే కానుకల పంపిణీని నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో లారీలు కదలడానికి సిద్ధమవుతున్నాయని పసిగట్టిన పేదలు కానుకల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఫలితంగా తొక్కిసలాటకు దారితీసి అమాయక మహిళలు మృత్యువాత పడ్డారు. ఇదేం మానవత్వం! గుంటూరు: చంద్రబాబు సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో మృతి చెందిన సయ్యద్ ఆసియా (48)ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చిన తీరు ప్రతి ఒక్కరినీ కలచివేసింది. టీడీపీ నేతలు, ఉయ్యూరు ఫౌండేషన్ వారు ఆసియా మృతదేహాన్ని వాహనంలోని సీటులో కాకుండా, డిక్కీలో పడేసి తీసుకు రావడం బాధితులను, చూపరులను ఎంతో బాధకు గురి చేసింది. కొంచెమైనా కనికరం లేకుండా, కనీసం మానవత్వం చూపకుండా ఇలా వ్యవహరించడం దారుణం అని పలువురు విమర్శించారు. ఆసియాను కారు డిక్కీలో హాస్పిటల్కు పంపిస్తున్న టీడీపీ నాయకులు పోలీసులు ముందే హెచ్చరించినా.. ప్రమాదం జరిగిన వెంటనే కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, జేసీ రాజకుమారి తదితరులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సభాప్రాంగణం 8 వేల మందికి మాత్రమే సరిపోతుందని పోలీసులు ముందుగానే హెచ్చరించినా నిర్వాహకులు స్పందించకపోవడం వల్ల ఘటన చోటు చేసుకుంది. బ్యారికేడ్లు పటిష్టంగా లేవని కూడా ముందుగానే హెచ్చరించామని, వారి నిర్లక్ష్యమే ఘటనకు దారి తీసిందని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. జీజీహెచ్ వద్ద ఆర్తనాదాలు.. షేక్ రజియా, ప్రసాదం సీతామహాలక్ష్మి, మస్తాన్బీ, తెల్లమేకల మంగమ్మ, పెందుర్తి ప్రియాంక, కమాదుల సరోజని, ఎస్.భూలక్ష్మి, హిమంది ఉమాదేవి, తెల్లమేకల రంగమ్మ, హుస్సేన్బీ, గుంటముక్కల సౌందర్య, జానా దుర్గ, పఠాన్ ఆస్మా, నిర్మల తదితరులు తీవ్రంగా గాయపడి అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, గుంటూరు నగరానికి చెందిన పల్లపుకుమారి, సాయికృష్ణనగర్కు చెందిన ఇరుగు కోటేశ్వరమ్మ, కె.ఇవలమ్మ, సీతమ్మకాలనీకి చెందిన సొప్పర కీర్తన, స్వర్ణాంధ్రనగర్కు చెందిన చిట్టాల శివపార్వతి, చైత్యపురి సుగాలీకాలనీకి చెందిన ధనావత్ అలివేలు తోపులాటలో గాయపడి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, వారి బంధువులు జీజీహెచ్కు చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలు మిన్నంటాయి. కొత్త ఏడాది తొలిరోజే తమ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొందని విలపించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్నాయుడు, మార్కెట్యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం తదితరులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. చనిపోయిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు మంత్రి రజిని ప్రకటించారు. నాసిరకం కిట్లతో హంగామా గుంటూరు రూరల్: చంద్రన్న కానుకలంటూ సభా ప్రాంగణం వద్ద పంపిణీ చేసిన కిట్లో అరకిలో కందిపప్పు, ప్యాకెట్ పామాయిల్, అరకిలో చింతపండు, అరకిలో గోధుమపిండి, కిలో ఉల్లిపాయలు, అరకిలో బెల్లం, చీర ఉన్నాయి. కిట్లో మొత్తం సరుకుల విలువ రూ.300కి మించి ఉండదని వాటిని తీసుకున్న మహిళలు చెబుతున్నారు. పది వేల మందికి మాత్రమే చీరలు కొనుగోలు చేసి గుంటూరులోని నగరం, పరిసర ప్రాంతాల్లో 30 వేల మందికి టోకెన్లు పంపిణీ చేశారు. టోకెన్ల కోసం మహిళల ఆధార్ జిరాక్స్లను నిర్వాహకులు తీసుకున్నారు. వారి పేర్లతో టీడీపీ సభ్యత్వాలు నమోదు చేసేందుకే ఆధార్ సేకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement