calm
-
అలాంటి వారి హృదయాల్లో పరమేశ్వరుడు కొలువు తీరి ఉంటాడు!
నిర్మలమైన హృదయం కలిగి ఉండి, మత్సరభావం లేకుండా, ప్రశాంత చిత్తంతో ఎల్లవేళలా సృష్టిలోని సమస్త జీవుల పట్ల స్నేహభావం కలిగి ఉంటూ, ఇతరులతో సంభాషణల సమయంలో ప్రియంగా మాట్లాడేవారి హృదయాలలో పరమేశ్వరుడు కొలువు తీరి ఉంటాడని విజ్ఞులు చెబుతారు. ‘కావాలని మనస్సులోని ఆలోచనలను పాపకర్మలు చేయడం వైపుకు మరల నీయకుండా, చెడ్డ పనులను తలపెట్టక, ధర్మమార్గాన్ని ఎన్నడూ విడిచి పక్కదోవ పట్టకుండా చూసుకుంటూ, చెడ్డపేరు తెచ్చిపెట్టే పనుల జోలికి వెళ్ళకుండా, ఇరుగుపొరుగున అందరూ తమను మెచ్చుకునే పద్ధతిలో జీవనం సాగించే వ్యక్తులు దేవతలతో సమానమైనవారే అవుతారని, వారిలో ఇంకేమి తక్కువని అలా అనకుండా ఉండగలం?’ అని వెన్నెలకంటి సూరన రచనయైన ‘ఆంధ్ర శ్రీ విష్ణుపురాణము’ ప్రశ్నించి చెప్పింది. పుణ్యానికైనా, పాపానికైనా, సుఖానికైనా, దుఃఖానికైనా మనిషి చేసే అలోచనలే ముఖ్యం కాబట్టి, ప్రయత్న పూర్వకంగా మనసును చెడు ఆలోచనల వైపుకు మళ్ళకుండా చూసుకోవడం మనిషికి అవసరం అన్నది పై మాటల సారాంశంగా భావించవచ్చు. సరిగా ఈ ఆలోచననే నొక్కి చెప్పినట్లుగా, బుద్ధిలో సందేహము, నిర్మలత్వము లేకుండా ఆచరించబడే కర్మల నిష్ప్రయోజకత్వాన్ని ఎఱయకవి రచించిన ‘సకలనీతికథా నిదానము’ ప్రథమాశ్వాసములోని ఈ కింది తేటగీతి పద్యం తేలికైన మాటలలో చెప్పింది.చిత్తశుద్ధి లేక చేసిన జపమునుతపము హోమవిధియు దానములునుదేవతార్చనములు భావింప నిష్ఫలమట్లుగాన వలయు నాత్మ శుద్ధి. మనసు నిర్మలంగా ఉండడం, చేసే పనియందు లగ్నమై ఉండడం – కార్యాచరణలో ఈ రెండూ చాలా ముఖ్యమైనవని తెలుసుకోవాలి. ఏకాగ్రచిత్తంతో చేయని ఏ పని కూడా సరైన ఫలితాలను ఇవ్వదు. మనసులో నిర్మలత్వం లేని దానము, దేవతార్చన కూడా నిష్ఫలమే అవుతాయి. అందువలన మనసును – అంటే ఆత్మను, బుద్ధిని నిర్మలంగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం అని పై పద్యం సారాంశం. సువాసనలు వెదజల్లే పూవులను పూచే మొక్కలకు, రుచికరమైన పండ్లను ఫలించే చెట్లకు, మూలాలు భూమి పొరలలోని మట్టిలో నిక్షిప్తమై ఉన్నట్లుగా, ఇహపరాలలో మనిషికి ఆధ్యాత్మిక సౌఖ్యాలను అందించే పుణ్యానికి మూలాలు నిర్మలమైన చిత్తంతో ఈ భువిపై జీవనంలో ఆచరించే సత్కర్మలలోనే ఉంటాయన్నది కాదనలేని నిజం.– భట్టు వెంకటరావు -
ప్రశాంతంగా శబరిమల.. తక్కువగా రద్దీ
సన్నిధానం: కేరళ వ్యాప్తంగా బీజేపీ ఆదివారం ఆందోళనలు నిర్వహించినప్పటికీ శబరిమల ఆలయ పరిసరాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. భక్తులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో ట్రావెన్కోర్ దేవస్థాన మండలి తీవ్ర విమర్శల పాలవుతోంది. మండలి అధ్యక్షుడు పద్మకుమార్ మాట్లాడుతూ భక్తుల యాత్రకు అనవసర అడ్డంకులు కల్పించొద్దనీ, సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. కాగా, రుతుక్రమం వచ్చే వయసులో ఉన్న మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న తీర్పు అమలు కు మరికొంత సమయం కావాలని కోరుతూ సోమవారమే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని పద్మకుమార్ చెప్పారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేంద్రన్ అరెస్టుకు నిరసనగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. -
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుంది
-
'అందులో విదేశీ హస్తం ఉంది.. బయటపెడతాం'
న్యూఢిల్లీ: పంజాబ్లో గత కొన్ని రోజులుగా సిక్కు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆందోళనలు నిరసనల వెనుక విదేశీ హస్తం ఉందని కేంద్రమంత్రి అకాలీ దళ్ నేత హర్సిమ్రత్ కౌర్ బాదల్ అన్నారు. త్వరలోనే వారి వివరాలన్నీ ఆధారాలతో సహా బయటపెడతామని చెప్పారు. తమ ఇష్ట దైవాన్ని కించపరిచారని ఆరోపిస్తూ ఫరీద్ కోట్లో ఓ సిక్కు వర్గం నిరసన ర్యాలీకి బయలుదేరగా.. వారిని మరో వర్గం అడ్డగించింది. ఈ క్రమంలో పరస్పరం రాళ్లతోపాటు, పదునైన ఆయుధాలు, కర్రలతో దాడులు చేసుకున్నారు. వీరిని నిలువరించేందుకు పోలీసులు కూడా జోక్యం చేసుకోగా వారిని తీవ్రంగా గాయపరిచారు. దీని అనంతరం పంజాబ్లో పలు సున్నిత ప్రాంతాల్లో ఈ ఘర్షణలు వాయువేగంతో వ్యాపించి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఆస్తి నష్టం ప్రాణనష్టం కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం కూడా అక్కడ ఇంకా అలాంటి పరిస్దితులే ఉన్నాయి. దీనిపై ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ స్పందించిన తర్వాత కేంద్ర నుంచి తొలిసారి ఓ కేంద్రమంత్రి స్పందించి సంచలన వ్యాఖ్య చేశారు. ఈ ఘర్షణల వెనుక విదేశీ హస్తం ఉందన్నారు. అన్ని వర్గాలు దయచేసి శాంతి సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.