-
దక్షిణాఫ్రికా ‘ఎ’ 219/3
బెంగళూరు: భారత్ ‘ఎ’తో జరుగుతోన్న రెండో అనధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు దిశగా సాగుతున్న టీమిండియాను కట్టడి చేయడంతో పాటు బ్యాటింగ్లో అదరగొట్టింది. దీంతో శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 59.5 ఓవర్లలో 3 వికెట్లకు 219 పరుగులు చేసింది. జుబైర్ హమ్జా (93; 15 ఫోర్లు) త్రుటిలో సెంచరీని చేజార్చుకోగా... ఇర్వీ (58; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం డసెన్ (18 బ్యాటింగ్), రూడీ సెకండ్ (35 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో చహల్ 2, హైదరాబాదీ పేసర్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో ఇంకా 126 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 322/4తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 23 పరుగులు మాత్రమే జతచేసి మిగతా 6 వికెట్లు కోల్పోయి 345 పరుగులకు పరిమితమైంది. ఆంధ్ర రంజీ క్రికెటర్ హనుమ విహారి (148; 14 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు 10 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఆంధ్రకే చెందిన వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ 34 పరుగులు చేశాడు. -
హరారేలో హైరానా...
► చివరి బంతికి గెలిచిన భారత్ ► 3 పరుగులతో ఓడిన జింబాబ్వే ► 2-1తో టి20 సిరీస్ ధోనిసేన సొంతం ► రాణించిన జాదవ్, బౌలర్లు బ్యాట్స్మెన్ వైఫల్యంతో చేసింది 138 పరుగులే... అయితే దానిని కాపాడుకునేందుకు భారత జట్టు పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ను ఆఖరి బంతి దాకా తీసుకొచ్చిన జట్టు నానా హైరానా పడి చివరకు గట్టెక్కింది. సిరీస్ ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండగా, ఒక దశలో పరాజయం తప్పదనిపిస్తుండగా... ధోని సేన కోలుకొని జింబాబ్వే పర్యటనను విజయంతో ముగించింది. ఆఖరి ఓవర్లో చేయాల్సిన 21 పరుగుల కోసం తుది వరకు పోరాడినా... మ్యాచ్ గెలవడం జింబాబ్వే వల్ల కాలేదు. మొత్తానికి కుర్రాళ్లతో నిండిన భారత జట్టు ప్రయోగాల పర్యటన క్రతువు పూర్తి చేసుకుంది. హరారే: జింబాబ్వే విజయానికి చివరి బంతికి 4 పరుగులు కావాలి... తొలి మ్యాచ్లో ధోని అంతటివాడే కొట్టలేకపోయాడు. చిగుంబురా కొట్టగలడా అనే సందేహం. ఆ ఓవర్లో బరీందర్ ఐదు బంతుల్లో 17 పరుగులిచ్చేయడంతో జింబాబ్వే శిబిరంలో ధీమా. అయితే చివరి బంతిని భారీ షాట్ ఆడబోయిన చిగుంబురా, చహల్ చేతికి చిక్కాడు. భారత కుర్రాళ్లలో అమితానందం కనిపించగా... చక్కటి అవకాశం చేజార్చుకొని జింబాబ్వే నిరాశలో మునిగింది. బుధవారం ఇక్కడ జరిగిన మూడో టి20 మ్యాచ్లో భారత్ 3 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కేదార్ జాదవ్ (42 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో తొలి అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. సిబాందా (21 బంతుల్లో 26; 3 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలవగా... ధావల్, బరీందర్ చెరో 2 వికెట్లు తీశారు. ఫలితంగా మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను భారత్ 2-1తో గెలుచుకుంది. అంతకు ముందు వన్డే సిరీస్ను కూడా జట్టు 3-0తో సొంతం చేసుకుంది. 6 వికెట్లు తీసిన బరీందర్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. కీలక భాగస్వామ్యం భారత్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రాహుల్ (20 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు. వరుసగా 4, 6, 4 బాదడంతో మొత్తం 16 పరుగులు వచ్చాయి. అయితే మన్దీప్ (4)ను తిరిపానో అవుట్ చేయగా, మరుసటి ఓవర్లో వరుస బంతుల్లో రాహుల్, పాండే (0)లు వెనుదిరిగారు. దాంతో జట్టు 27 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రాయడు (20), జాదవ్ కలిసి ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 49 బంతుల్లో 49 పరుగులు జోడించారు. అయితే పిచ్ మరీ నెమ్మదిగా ఉండడం, జింబాబ్వే చక్కటి బౌలింగ్లో 10-17 మధ్య 8 ఓవర్లలో భారత్ 46 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధోని (9) ప్రభావం చూపలేకపోయినా... జాదవ్ దూకుడుగా ఆడటంతో ఆఖరి మూడు ఓవర్లలో జట్టు 43 పరుగులు చేసింది. పోరాడినా... ఛేదనలో జింబాబ్వే త్వరగానే చిబాబా (5) వికెట్ కోల్పోయింది. అయితే మసకద్జ (15), సిబాందా రెండో వికెట్కు 37 బంతుల్లో 40 పరుగులు జత చేసి జట్టును నడిపించారు. తర్వాత వచ్చిన మూర్ (21 బంతుల్లో 26; 3 సిక్సర్లు) కూడా ఆధిపత్యం ప్రదర్శించాడు. చహల్ బౌలింగ్లో అతను మూడు భారీ సిక్సర్లు కొట్టడంతో జింబాబ్వే గెలుపుపై ఆశలు పెట్టుకుంది. అయితే మూర్ను అవుట్ చేసి చహల్ బదులు తీర్చుకోగా, వాలర్ (10) విఫలమయ్యాడు. చేయాల్సిన రన్రేట్ బాగా పెరిగిపోవడంతో జింబాబ్వే ఒత్తిడికి లోనైంది. ఆఖర్లో మరుమా (23 నాటౌట్), చిగుంబురా (16) పోరాడినా ఫలితం లేకపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) మద్జివ 22; మన్దీప్ (సి) మరుమా (బి) తిరిపానో 4; రాయుడు (సి) చిగుంబురా (బి) క్రీమర్ 20; పాండే రనౌట్ 0; జాదవ్ (సి) చిగుంబురా (బి) తిరిపానో 58; ధోని (బి) తిరిపానో 9; అక్షర్ నాటౌట్ 20; ధావల్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 138. వికెట్ల పతనం: 1-20; 2-27; 3-27; 4-76; 5-93; 6-122. బౌలింగ్: చటారా 4-1-34-0; తిరిపానో 4-0-20-3; మద్జివ 4-0-32-1; చిబాబా 4-0-19-0; క్రీమర్ 4-0-32-1. జింబాబ్వే ఇన్నింగ్స్: చిబాబా (సి) చహల్ (బి) బరీందర్ 5; మసకద్జా (ఎల్బీ) (బి) అక్షర్ 15; సిబాందా (ఎల్బీ) (బి) ధావల్ 28; మూర్ (సి) మన్దీప్ (బి) చహల్ 26; వాలర్ (సి) బుమ్రా (బి) ధావల్ 10; చిగుంబురా (సి) చహల్ (బి) బరీందర్ 16; మరుమా (నాటౌట్) 23; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1-17; 2-57; 3-60; 4-86; 5-104; 6-135. బౌలింగ్: బరీందర్ 4-1-31-2; ధావల్ 4-0-23-2; బుమ్రా4-0-23-0; అక్షర్4-0-18-1; చహల్4-0-32-1. ► 324 మూడు ఫార్మాట్లలోకలిపి ధోని కెప్టెన్గా వ్యవహరించిన అంతర్జాతీయ మ్యాచ్ల సంఖ్య. నంబర్వన్ స్థానంలో ఉన్న రికీ పాంటింగ్ (324) రికార్డును ధోని సమం చేశాడు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement