breaking news
BTC
-
అసోం బోడోల్యాండ్ కౌన్సిల్ చీఫ్గా మొహిలరీ
కొక్రాఝర్: అసోం రాష్ట్రంలోని బోడో ల్యాండ్ టెర్రిటోరియల్ కౌన్సిల్ (బీటీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్(సీఈఎం)గా హగ్రమ మొహిలరీ ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఈఎంగా మాజీ మంత్రి రిహొన్ డైమరీ కూడా ప్రమాణం చేశారు. కొక్రాఝర్లోని బోడోల్యాండ్ సెక్రటేరియట్ ఫీల్డ్లో జరిగిన ఈ కార్యక్రమంలో వీరితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవి కోటా ప్రమాణం చేయించారు. గవర్నర్ ఎల్పీ ఆచార్య, సీఎం హిమంత బిశ్వ శర్మ, పలువురు మంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, మొహిలరీ ఈ పదవీ బాధ్యతలను చేపట్టడం ఇది నాలుగోసారి. సెప్టెంబర్ 22వ తేదీన జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్) 40 సీట్లకుగాను 28 సీట్లను సొంతం చేసుకుంది. యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్(యూపీపీఎల్) బీజేపీలు కలిసి ఏడింటిని, ఇతరులు ఐదు సీట్లను గెలుచుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు కొత్తగా ఎన్నికైన బీపీఎఫ్ సభ్యులు డోట్మాలోని బోడో నేత బొడొఫా ఉపేందన్రాథ్ బ్రహ్మ విగ్రహం వద్ద నివాళులర్పించారు. 2020 జనవరి 27వ తేదీన ఢిల్లీలో జరిగిన తాజా బోడో ఒప్పందం అనంతరం జరిగిన రెండో ఎన్నికలివి. మొదటి దఫా ఎన్నికల్లో బీపీఎఫ్ 17 సీట్లు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే, గణ సురక్ష పరిషత్, బీజేపీ, యూపీపీఎల్ కలిసి బోడో కౌన్సిల్ ఏర్పాటు చేశాయి. కాగా, అసోం బోడోల్యాండ్ టెర్రిటోరియల్ కౌన్సిల్ చీఫ్గా ప్రమాణం చేసిన హగ్రమ మొహిలరీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్రం, అసోం ప్రభుత్వం బీటీసీ కౌన్సిల్కు పూర్తి మద్దతు కొనసాగిస్తాయని ఆయన హామీ ఇచ్చారు. బీటీసీ ఏం చేస్తుందంటే..కొక్రాఝర్, చిరంగ్, బక్సా, ఉదల్గిరి, తముల్పూర్ జిల్లాలను కలిపి ఏర్పాటైందే బీటీసీ. సుమారు 9 వేల చదరపు కిలోమీటర్ల భూభాగంలో విస్తరించిన ఉన్న బోడోలు మెజారిటీగా కలిగిన ఈ ప్రాంతంపై శాసన, కార్యనిర్వాహక అధికారాలను బీటీసీ కలిగి ఉంటుంది. 1993లో జరిగిన ఒప్పందం ప్రకారం, బోడోలాండ్ భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం ఏర్పాటైన స్వయంప్రతిపత్తి కలిగిన పరిపాలనా విభాగం. -
రూ. 1.3 కోట్ల అప్పు వివాదంలో ముఖ్యమంత్రి!
బెంగళూరు: గత కొద్దిరోజులుగా తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఇబ్బందుల పాలవుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. బెంగళూరు టర్ఫ్ క్లబ్(బీటీసీ) కు స్టివార్డ్గా ఓ వ్యాపారవేత్తను ఆయన నామినేట్ చేయడం వివాదంగా మారింది. అతనితో సిద్దరామయ్యకు గతంలో లావాదేవీలు ఉన్నాయని, అందుకు ప్రతిఫలంగానే పదవిని కట్టబెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సామాజిక కార్యకర్త ఎస్ భాస్కరన్ కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా ను కోరారు. నామినేషన్ వేసిన ఎల్ వివేకానందతో సీఎం సిద్దరామయ్యకు రూ.1.3 కోట్ల రుణ లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. ఎల్ వివేకానందను బీటీసీ కమిటీ స్టివార్డ్గా ప్రభుత్వం తరఫు నుంచి నామినేట్ కావడాన్ని తాను ఒక పౌరుడిగా ప్రశ్నిస్తున్నానని భాస్కరన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇది జరిగిన కొద్ది నెలలకే వివేకానంద నుంచి సీఎం సిద్దరామయ్య రూ.1.3 కోట్ల రుణం తీసుకున్నారని, అందుకు సంబంధించిన పత్రాలను పిటిషన్కు జతచేస్తూ ఆయన గవర్నర్ కు పంపారు. ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు లేదా ఏదేనీ ఇతర లావాదేవీల కోసం తన అధికారాన్ని దర్వినియోగం చేయకూడదని నిబంధనల్లో ఉందనీ.. కానీ, సీఎం వాటిని ఉల్లఘించినట్లు ప్రస్తావించారు. మే 2013 నుంచి టర్ఫ్ క్లబ్ కమిటీ విషయాలను ఆర్టీఐ ద్వారా స్వీకరించినట్లు తెలిపారు. ఈ ఆరోపణలపై స్పందించిన వివేకానంద తాను టర్ఫ్ క్లబ్ లో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నానని చెప్పారు. సీఎంతో ఆర్ధిక లావాదేవీలు పెట్టుకున్నాననే వార్తలు అవాస్తవమని ఆయన అన్నారు. గత ఏడాది తన స్నేహితుడు (సీఎం) చెక్ తీసుకున్నారని, త్వరలోనే వాటిని తిరిగి ఇచ్చేస్తారని వివరించారు. గతంలో తాను రెండేళ్ల పాటు మైసూర్ రేస్ క్లబ్ కు చైర్మన్ గా వ్యవహరించానని, బీటీసీలో మెంబర్ గా ఉన్నానని తెలిపారు. తనను బీటీసీ స్టివార్డ్గా నామినేట్ చేయడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు.


