breaking news
BSNL bills
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఒకసారి రీఛార్జ్ చేస్తే 12 నెలల పాటు సర్వీసులు పొందేలా కొత్త ప్లాన్ను విడుదల చేసింది. తరచూ రీఛార్జ్లు, ఇతర టెలికాం ప్రొవైడర్ల నుంచి పెరుగుతున్న ఖర్చుల భారంతో సతమతమవుతున్న వినియోగదారులకు ఊరటనిచ్చేందకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.సూపర్ రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ లేటెస్ట్ ఆఫర్ కేవలం రూ.1,999కే ప్రీపెయిడ్ ప్లాన్ను అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 12 నెలలు. నెలవారీ రీఛార్జ్ల ఇబ్బంది లేకుండా వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని కీలక ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.అన్ లిమిటెడ్ కాలింగ్: యూజర్లు అన్ని లోకల్, ఎస్టీడీ నెట్వర్క్లపై అపరిమిత ఉచిత కాలింగ్ను వినియోగించుకోవచ్చు.600 జీబీ డేటా: ఈ ప్లాన్లో రోజువారీ వినియోగ పరిమితులు లేకుండా మొత్తం 600 జీబీ డేటా లభిస్తుంది. యూజర్లు ఏడాది పొడవునా తమ సౌలభ్యం మేరకు ఈ డేటాను ఉపయోగించుకోవచ్చు.రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు: నిరంతరాయంగా కమ్యూనికేషన్ కోసం రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను కూడా ఈ ప్లాన్ అందిస్తుంది.బీఎస్ఎన్ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్లు, దీర్ఘకాలిక వాలిడిటీ ఆఫర్లను అందిస్తుంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు ఇటీవల ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు చౌక రీఛార్జ్ ధరల కోసం బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్త సూపర్ రీఛార్జ్ ప్లాన్ మరింత మంది యూజర్లను ఆకర్షిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: రైల్వే అంతటా ‘కవచ్’ అమలుఇతర ప్రొవైడర్లు ఇలా..ఇతర టెలికాం ప్రొవైడర్లతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఉదాహరణకు, జియో పైన తెలిపిన సర్వీసులతో వార్షిక ప్లాన్ను రూ.3,599కు అందిస్తుంది. ఇందులో 2.5 జీబీ రోజువారీ పరిమితితో 912.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ ఉన్నాయి. ఎక్కువ డేటాను అందిస్తుండడంతో జియో ప్లాన్ బీఎస్ఎన్ఎల్ కంటే ఖరీదుగా ఉంది. అయితే అందుకోసం కొన్ని సర్వీసులు అదనంగా ఇస్తుంది. యూజర్లు నిజంగా ఈ సర్వీసులను పూర్తి స్థాయిలో ఉపయోగిస్తేనే ఆ ప్లాన్ మేలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలోనూ ఇలా బీఎస్ఎన్ఎల్తో పోలిస్తే అదనంగానే వసూలు చేస్తున్నాయి. -
పంచాయతీల్లో ఆన్లైన్కు ఆదిలోనే హంసపాదు
పంచాయతీల్లో ఏప్రిల్ నుంచి నిలిచిన లెక్కలు జిల్లాలో 347 పంచాయతీలకు ఆపరేటర్లు లేరు పని జరగకున్నా నెలనెలా బీఎస్ఎన్ఎల్ బిల్లులు మచిలీపట్నం : పంచాయతీల నిధుల ఖర్చులో పారదర్శకత పాటించేందుకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పర్యవేక్షణలో ఏర్పాటైన ఆన్లైన్ పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నూతనంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా పంచాయతీకి సంబంధించిన భౌగోళిక స్వరూపం, స్థిరాస్తులు, చరాస్తులు, రోడ్లు తదితర వివరాల్ని కంప్యూటరీకరిస్తారు. ఈ సమాచారంతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తారు. వాటి వినియోగం, చెల్లింపులు తదితర అంశాల్ని తెలుసుకునేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. పంచాయతీలకు కంప్యూటర్లు అందజేయటం, ఆపరేటర్ల నియామకం బాధ్యతను అవుట్సోర్సింగ్ పద్ధతిలో కార్వీ సంస్థకు అప్పగించారు. జిల్లాలో తొలివిడతలో 347 పంచాయతీలను ఎంపిక చేసి ఈ ఏడాది ఏప్రిల్లో కంప్యూటర్లను అందజేశారు. వీటితో పాటు మరో 52 పంచాయతీలకు అదనంగా బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సర్వీసులనూ అందుబాటులోకి తెచ్చారు. కంప్యూటర్ ఆపరేటర్లను నియమించి పంచాయతీరాజ్ ఉద్యోగులతో రెండు నెలల కిందట శిక్షణ కూడా నిర్వహించారు. అయితే ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ల నియామక ప్రక్రియను కార్వీ సంస్థ నిలిపేసింది. కంప్యూటర్లనూ సిబ్బంది వాడటం లేదు. ఇప్పటి వరకు పంచాయతీ జమా లెక్కల్ని జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు చూసేవారు. ఆన్లైన్ పథకం రావడంతో వారు పట్టించుకోవటం లేదు. దీంతో మూడు నెలలుగా పంచాయతీల్లో ఆర్థిక పరమైన అంశాలకు బ్రేక్ పడింది. బిల్లులు పంపుతున్న బీఎస్ఎన్ఎల్ నెట్ కనెక్షన్, సర్వీస్చార్జ్ తదితర ఖర్చులతో ఒక్కొక్క పంచాయతీ నుంచి వెయ్యి నుంచి రెండువేల రూపాయల వరకు బీఎస్ఎన్ఎల్ నుంచి బిల్లులు వచ్చాయి. కంప్యూటర్లు బిగించకుండా, పనులు జరగకుండానే ఇంటర్నెట్ బిల్లులు రావడంపై అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఆపరేటర్ల నియామకాన్ని ప్రభుత్వం కార్వీ సంస్థకే అప్పగించిందని ఇన్చార్జ్ డీపీవో చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతలు రాకపోవడంతో నియామకాలు నిలిచిపోయాయని కార్వీ సంస్థ హైదరాబాదు ప్రతినిధి వివరించారు.