-
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
సాక్షి, యాదగిరి కొండ : యాదాద్రి పుణ్యక్షేత్రంలో రెండో రోజు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సెలవుదినం కావడంతో భక్తులు యాదాద్రిశ్రీ లక్ష్మినరసింహస్వామిని దర్శించుకోవడానికి పోటెత్తారు. దీంతో యాదాద్రి పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ధర్మదర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పడుతున్నది. రద్దీ కారణంగా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతించట్లేదు. -
ముగిసిన పెన్నోహోబిలం బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ రూరల్ : పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఉదయం స్వామి వారికి అభిషేకం మహా మంగళహారతి, కుంకమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పల్లకీలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు ద్వారకనాథాచార్యులు ఆధ్వర్యంలో ఆమిద్యాల గ్రామంలోని పెన్నోబులేసుని ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. -
పెన్నహోబిలంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ రూరల్ : పెన్నహోబిలం లక్ష్మీనారసింహుడి బ్రహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని ఆమిద్యాల గ్రామం పెన్నబిళేసుడి ఆలయం నుంచి శ్రీవారి ఉత్సవమూర్తులను తీసుకోరావడానికి ప్రత్యేక పల్లకిను పెన్నహోబిలం నుంచి తీసుకెళ్లారు. ఈఓ రమేష్బాబు, ప్రధాన అర్చకుడు ద్వారాకానాథ్చార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాల మధ్య శ్రీవారి ఉత్సవ మూర్తులను పెన్నహోబిళానికి తీసుకొచ్చారు. -
వేమన బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కటారుపల్లి(గాండ్లపెంట) : మండల పరిధిలోని కటారుపల్లి యోగివేమన బ్రహ్మోత్సవాలు ఆదివారం స్వామివారి గొడుగుల ప్రదక్షిణతో ప్రారంభమయ్యాయి. భక్తులు వేమన సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం సాయంత్రానికే ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. వచ్చిన భక్తులు తలనీలాలు తీయించుకున్నారు. సేదతీరేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఆలయ ప్రాంగణంలోనే ఉండిపోయారు. ఆలయం వెలుపల గాజులు, బొమ్మలు, మిఠాయి షాపులు వెలిశాయి. సోమవారం తెల్లవారుజామున ఆలయం ఎదుట జొన్నధాన్యాలతో రాసి పోసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కుంభకూడును(ప్రసాదాన్ని) భక్తులు పెద్ద ఎత్తున పోటీపడి తీసుకుంటారు. నేడు బండ్ల మెరవణి వేమన బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాత్రి బండ్ల మెరవణి, పానక పందేరం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్బంగా భక్తులు ఎండ్లబండ్లను అలంకరించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకుంటారు. -
5 నుంచి రంగనాథుడి బ్రహ్మోత్సవాలు
ఆలూరు కోన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ కార్యానిర్వాహణాధికారి చంద్రమౌళి తెలిపారు. ఇందులో భాగంగా ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేపట్టారు. క్రీ.శ. 14వ శతాబ్ధంలో హరిహర బుక్కరాయలు కాలంలో ఎర్రమ తిమ్మరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ చరిత్ర స్పష్టం చేస్తోంది. ఆలయంలోని మూలవిరాట్ రంగనాథుడు ఐదు అడుగుల పొడవుతో శేషతల్పంపై శయనించినట్లుగా ఉంటుంది.. - తాడిపత్రి రూరల్ బ్రహోత్సవాలు ఇలా.. 5న అంకురార్పణ, ధ్వజారోహణము, కలశస్థాపన, దీక్ష హోమ పూజలు ఉంటాయి. 6న సింహ వాహనంపై గ్రామోత్సవం, 7న శేష వాహనం, 8న హనుమద్ వాహనం, 9న గరుడ వాహనం, 10న గజవాహనంపై గ్రామోత్సవాలు ఉంటాయి. 11న స్వామివారి కల్యాణం, రథోత్సవం, 12న అశ్వ వాహనంపై గ్రామోత్సవం, 13న కోనలో తీర్థవాది, వసంతోత్సవం, చక్ర స్నానం, హంస వాహనంపై గ్రామోత్సవం ఉంటాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement