-
భూదానం తరతరాలు నిలిచిపోతుంది: మంత్రి ఉష శ్రీ చరణ్
-
అనంతపురంలో ఎలుగుబంటి కలకలం..
సాక్షి, అనంతపురం : జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలం రాయలదొడ్డి గ్రామ సమీపంలో ఎలుగుబంటి సంచరించడం కలకలం రేపింది. ఎలుగుబంటి దారితప్పి జనావాసాల్లో రావడంతో గ్రామస్తులు భయాందోళనతో పరుగులు తీశారు. ఎలుగుబంటి ఎక్కడ దాడి చేస్తుందో అని భయపడ్డారు. తర్వాత గ్రామస్తులు మూకుమ్మడిగా ఎలుగుబంటిపై దాడికి దిగారు. దీంతో ఎలుగుబంటి సమీపంలోని కొండల్లోకి పరుగులు తీసింది. అనంతరం గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. -
ఇసుక లారీ సీజ్
బ్రహ్మసముద్రం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ లారీని బ్రహ్మసముద్రం పోలీసులు సీజ్ చేశారు. వివరాల్లోకెళితే... బ్రహ్మసముద్రంలోని వేదావతి హగరిలో నాణ్యమైన ఇసుక ఉంది. దీనిపై కన్నేసిన నంజాపురం గ్రామానికి చెందిన ఇద్దరు అధికార పార్టీ నేతలు పాలవెంకటాపురం సమీపంలోని యర్రగుండ్ల దగ్గర గొల్లబాలు అనే రైతు పొలంలోని చీనీ చెట్లలో అక్రమంగా ఇసుకను డంప్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. హరీష్, గొల్ల బాలు అనే వ్యక్తులు పరారవగా... కర్ణాటక దాసర్లపల్లికి చెందిన విజయ్, నాగభూషణ, శ్రీనివాసులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి వేళల్లో లారీలతో ఆ ఇసుకను కర్ణాటకలోకి చిత్రదుర్గంకు తరలిస్తున్న పోలీసులు తెలిపారు. అక్కడ లారీ ఇసుకను రూ. 40 వేలకు పైగా విక్రయిస్తున్నట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. -
నకిలీ పాసు పుస్తకాలపై పోలీసుల ఆరా
బ్రహ్మసముద్రం: అనంతపురంలో జూలై 17న ఇద్దరు వ్యక్తుల వద్ద పట్టుబడిన నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలపై పోలీసులు మంగళవారం బ్రహ్మసముద్రం తహసీల్దార్ కార్యాలయానికి తరలి వచ్చి ఆరాతీశారు. తీటకల్లు రెవెన్యూ గ్రామంలోని సర్వేనంబర్లు 13–1, 325లో కళ్యాణదుర్గం మండలం హులికల్లుకు చెందిన వారి పేరిట గల నకిలీ పాసుపుస్తకాలను ఆన్లైన్లో పరిశీలించగా నకిలీవని తేలింది. అయితే తమ కార్యాలయంలో ఈ పుస్తకాలను ఇవ్వలేదని, గతంలో ఇక్కడ పనిచేసిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి పాసుపుస్తకాలు తయారు చేసినట్లు తహసీల్దార్ వెంకటశేషు తెలిపారు. అనంతరం కంబదూరు మండలం పాళ్లూరు రెవెన్యూగ్రామంలోని నకిలీపుస్తకాలపై విచారణకు పోలీసులు బయల్దేరి వెళ్లారు. -
నకిలీ పాసు పుస్తకాలపై సీఐడీ అధికారుల ఆరా
బ్రహ్మసముద్రం : మండలంలో 2014–2015లో నమోదైన నకిలీ పట్టదారు పాసు పుస్తకాలు, కేసుల వివరాలపై సీఐడీ అధికారులు ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలను తమకు అందజేయాలని తహశీల్దార్ సుబ్రమణ్యంకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయమై బుధవారం తహశీల్దార్ కార్యాలయంలో వివరాలు సేకరించినట్లు తెలిసింది. మండలంలో 2009 నుంచి 2015 వరకు మండలంలో పనిచేసిన తహశీల్దార్ల వివరాలు, సిబ్బందిపై నమోదైన పోలీస్ కేసులు తదితర వివరాలను అడిగినట్లు తహశీల్దార్ సుబ్రమణ్యం తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement