breaking news
borns and died
-
సామ్రాజ్య భారతి: 1880/1947
ఘట్టాలు: నైనిటాల్లో ఏకధాటిగా 68 గంటల వ్యవధిలో కుండపోతగా కురిసిన 36 సెంటీమీటర్ల వర్షపాతం 151 మందిని బలిగొంది. కొండ చరియలు విరిగి పడటంతో వారంతా శిథిలాల కింద చిక్కుకుని మరణించారు. జననాలు: రాజశేఖర్ బసు : రచయిత, కెమిస్ట్, నిఘంటు నిపుణులు (బెంగాల్); మున్షీ ప్రేమ్చంద్ : స్వాతంత్య్ర ఉద్యమకారుడు; హిందూ, ఉర్దూ భాషల్లో రచయిత (బెనారస్); అబ్దుల్ ముహసిన్ ముహమ్మద్ సజ్జద్ : పండితులు, స్వాతంత్య్ర సమర యోధులు, ‘ముస్లిం ఇండిపెండెంట్ పార్టీ’ వ్యవస్థాపకులు (బిహార్ ప్రావిన్స్); బరీంద్రకుమార్ ఘోష్ : స్వాతంత్య్ర సమర తిరుగుబాటు వీరుడు, జర్నలిస్ట్ (కలకత్తా); బళ్లారి రాఘవ : తెలుగు నాటక రంగ ప్రముఖులు, ప్రసిద్ధ న్యాయవాది (అనంతపురం జిల్లా); సుఖ్లాల్ సంఘ్వీ : జైన్ పండితులు, తత్వవేత్త (గుజరాత్); అమరేంద్ర చటర్జీ : స్వాతంత్య్రోద్యమ కార్యకర్త (పశ్చిమ బెంగాల్). చట్టాలు: రెలిజియస్ సొసైటీస్ యాక్ట్, కాజీస్ యాక్ట్, ఈస్టిండియా లోన్ (ఈస్టిండియన్ రైల్వే డిబెంచర్స్) యాక్ట్, ఇండియా స్టాక్ (పవర్స్ ఆఫ్ అటార్నీ) యాక్ట్. (చదవండి: సామ్రాజ్య భారతి 1879/1947) -
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు.. కాసేపట్లోనే మృతి
సీతంపేట (శ్రీకాకుళం): ఓ మహిళ ముగ్గురు ఆడ శిశివులకు జన్మనిచ్చింది. అయితే కాసేపట్లోనే ముగ్గురూ మృత్యువాత పడ్డారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సీతం పేట మండలంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని కారెం గ్రామానికి చెందిన సరోజిని ఇంట్లోనే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. తర్వాత కూడా నొప్పులు రావడంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ మరో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన కాసేపట్లోనే ముగ్గురు శిశువులు మృతి చెందారు. తల్లి ఆరోగ్యం కూడా విషమంగా ఉండటంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.