breaking news
Bonhams company
-
చిటికెడు మట్టి రూ.4 కోట్లు
లండన్: అపోలో 11 మిషన్లో 53 ఏళ్ల క్రితం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుమోపిన సంగతి తెలిసిందే! ఆయన తనతో పాటు తెచ్చిన చంద్రుడి మృత్తికకు తాజాగా జరిగిన వేలంలో భారీ ధర పలికింది. అంతర్జాతీయ ఆక్షన్ సంస్థ బొన్హామ్స్ నిర్వహించిన వేలంలో చిటికెడు చంద్ర మృత్తికను గుర్తు తెలియని వ్యక్తి 5,04, 375 డాలర్లు (సుమారు 3.85 కోట్ల రూపాయలు) వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే తాము అనుకున్న రేటు రాలేదని సంస్థ భావిస్తోంది. వేలానికి ముందు దీనికి దాదాపు 12 లక్షల డాలర్లు పలుకుతుందని అంచనా వేసింది. అపోలో మిషన్ నుంచి తెచ్చిన శాంపిళ్ల వేలానికి ఇంతవరకు నాసా అభ్యంతరాలు చెబుతూ వచ్చింది. అయితే 2017లో కోర్టు ఆదేశాల మేరకు నాసా తన అభ్యంతరాలను విరమించుకుంది. -
షాంపేన్ బాటిల్.. ఐదున్నర లక్షలు
165ఏళ్ల చరిత్ర గల ప్రఖ్యాత పోల్ రోజర్ కంపెనీకి చెందిన అరుదైన షాంపేన్ బాటిల్ ఇది. ఈ షాంపేన్ బాటిల్ వందేళ్లనాటిది. శుక్రవారం లండన్లోని బొన్హామ్స్ సంస్థవారు నిర్వహించిన వేలంపాటలో రికార్డుస్థాయిలో రూ.5.54లక్షలకు అమ్ముడుపోయింది. మొదటి ప్రపంచ యుద్ధ జ్ఞాపకాలను భద్రపరిచే లండన్లోని ‘ఇంపీరియల్ వార్ మ్యూజియం ఫౌండేషన్‘ సంస్థ నిధుల సేకరణ కోసం ఈ బాటిల్ను వేలంవేశారు.