breaking news
Bommireddy Ragavendra Reddy
-
వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి
సాక్షి, అమరావతి: నెల్లూరు మాజీ జెడ్పీ ఛైర్మన్, టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరారు. శుక్రవారం.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయనకు వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బొమ్మిరెడ్డితో పాటు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, టీడీపీ నేత ఇందూరు వెంకటరమణా రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, వరప్రసాద్, వైఎస్సార్సీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి హాజరయ్యారు. చదవండి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్సిగ్నల్ -
సింహపురి ZP సింహాసనం వైసీపీకే !
-
నెల్లూరు జెడ్పీ చైర్మన్ గా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి
నెల్లూరు: నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఎన్నికయ్యారు. ఆసక్తికరంగా సాగిన ఎన్నికల ప్రక్రియ రాజకీయ వర్గాలను ఉత్కంఠకు గురిచేసిన ఈ ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలో 46 జెడ్పీటీఎస్ స్థానాలుండగా, వైఎస్ఆర్ సీపీకి చెందిన 8 మంది మద్దతు తెలపడంతో టీడీపీకి 23 మంది సభ్యుల బలం చేకూరింది. దాంతో వైఎస్ఆర్సీపీ (23), టీడీపీ(23)లు ఓట్లు సమానంగా ఉండటంతో లాటరీ పద్దతి ద్వారా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైస్ చైర్మన్ గా పీ.శిరీషలు ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. టీడీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిచండంతో పార్టీ శిబిరంలో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుని ఆనందాన్ని పంచుకున్నారు.