breaking news
bomb hoax
-
ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
సాక్షి, ఢిల్లీ: దేశరాజధానిలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం రేగింది. సోమవారం పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు ఫోన్కాల్స్, మెయిల్స్ రావడంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు. తొలుత..ద్వారకా ఏరియాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు సోమవారం ఉదయం బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీస్, ఫైర్ సిబ్బందితోపాటు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ క్యాంపస్కు చేరుకుని అక్కడున్నవాళ్లను ఖాళీ చేయించి తనిఖీ చేపట్టారు. ఆ వెంటనే మరికొన్ని స్కూళ్లకు ఇదే తరహాలో ఫోన్లు, మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ పరిసరాల్లోని పాఠశాలలకు ఇలా బాంబు బెదిరింపులు ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా వస్తున్నాయి. ఒక్కవారంలోనే పాతికకు పైగా ఇలాంటి బాంబు బూచీ బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో.. ఉత్తుత్తి బెదిరింపులను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈమెయిల్స్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ ఫోరెన్సిక్ దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలో.. అంతర్జాతీయ IP అడ్రస్లు, వర్చువల్ ప్రాక్సీలు వాడుతున్నట్లు గుర్తించారు. తాజాగా.. ఓ స్కూల్కు బాంబు ఉందని, పిల్లలు చనిపోతారని కాల్ చేసిన వ్యక్తిని.. 12 ఏళ్ల బాలుడిగా పోలీసులు గుర్తించడం తెలిసిందే. స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసులు, పబ్లిక్ ప్లేసులు, ఆఖరికి విమానాల్లోనూ బాంబు ఉందంటూ ఫోన్, మెసేజ్, సోషల్ మీడియా ద్వారా వచ్చినా, కఠిన ప్రోటోకాల్ ప్రకారం విచారణ జరుగుతుంది. ఇలాంటి నేరాలకు పాల్పడినవారిపై జైలు శిక్ష, ఆర్థిక జరిమానా విధిస్తారు. విమానాలకు బాంబు బెదిరింపులు చేస్తే శిక్షతోపాటు ప్రయాణాలు చేయకుండా బ్లాక్లిస్ట్లో చేర్చే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో.. BNS (భారతీయ న్యాయ సంహిత) ప్రకారం ఉగ్రవాద చర్యగా పరిగణించి జీవిత ఖైదు తరహా కఠిన శిక్షా పడొచ్చు. -
విమానంలో 322 మంది.. 8 గంటల జర్నీ తర్వాత వెనక్కి!
న్యూఢిల్లీ, సాక్షి: ముంబై-న్యూయార్క్ ఎయిరిండియా విమానం. ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత.. ఎలా వెళ్లిందో అలాగే తిరిగి వెనక్కి వచ్చేసింది. దీంతో ప్రయాణికులంతా కంగారు పడ్డారు. మరోవైపు అధికారులు హడావిడిగా వాళ్లందరినీ దించేసి.. బాంబు స్క్వాడ్ను పిలిపించి తనిఖీలు చేయించారు. చివరకు తమకు వచ్చిన సమాచారంగా తేల్చారు. 303 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777 విమానం గత అర్ధరాత్రి 2గం. ముంబై నుంచి న్యూయార్క్కు బయల్దేరింది. సుమారు 15 గంటల తర్వాత జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్పోర్టుకు అది చేరుకోవాల్సి ఉంది. అయితే విమానంలో బాంబు ఉందనే సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అజర్బైజాన్ దాకా వెళ్లిన విమానానికి.. వెనక్కి రప్పించారు.#AirIndia pic.twitter.com/kZ7cEau7sI— NDTV (@ndtv) March 10, 2025ముంబైలో ఈ ఉదయం 10.20 గం. ప్రాంతంలో ఎయిరిండియా విమానం దిగగానే.. ప్రయాణికులను దించేసి బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేయించారు. చివరకు బెదిరింపు కాల్గా నిర్ధారించుకున్నారు. రద్దైన విమానం మంగళవారం ఉదయం 5గం. రీషెడ్యూల్ చేసినట్లు ప్రకటించింది. అసౌకర్యానికి ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన ఎయిరిండియా.. వాళ్ల భద్రతే తమకు ముఖ్యమని తెలిపింది. ఈ ప్రయాణంలో వాళ్లకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని తెలిపింది. మరోవైపు.. ఈ ఘటనపై ఎయిరిండియా ఫిర్యాదుతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
ఇండిగో విమానంలో ‘బాంబు’ కలకలం
పాట్నా: ఓ ప్యాసింజర్ చేసిన పని.. ప్రయాణికులతో పాటు పోలీసులను, విమాన సిబ్బందిని హడలగొట్టింది. ఇండిగో విమానంలో బాంబు కలకలం చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన ఇండిగో విమానం(6e 2126)లో ఓ ప్రయాణికుడు తన బ్యాగులో బాంబు ఉందని చెప్పాడు. దీంతో విమానాన్ని పాట్నా జయ్ ప్రకాశ్ నారాయణ్ ఎయిర్పోర్టులోనే అత్యవసరంగా తనిఖీలు చేశారు. బుధవారం రాత్రి పాట్నా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు తన బ్యాగులో బాంబు ఉందని చెప్పడంతో అంతా ఉలిక్కి పడ్డారు. ప్రయాణికులందరినీ విమానం నుంచి కిందకు దించారు విమాన సిబ్బంది. ఆపై పోలీసులు బాంబు-డాగ్ స్క్వాడ్ సాయంతో అతని బ్యాగ్ను చెక్ చేశారు. అలాగే ప్రోటోకాల్ ప్రకారం విమానం మొత్తం తనిఖీలు చేపట్టి.. ఏం లేదని నిర్ధారించారు. బాంబు బెదిరింపునకు పాల్పడ్డ ప్రయాణికుడు తన కుటుంబంతో ప్రయాణిస్తున్నాడని, అతన్ని అదుపులోకి తీసుకున్నామని, అతని మానసిక స్థితిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పాట్నా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ వెల్లడించారు. తనిఖీల అనంతరం విమానాన్ని ప్రయాణానికి అనుమతించారు. Bihar | Visuals from Patna airport where the Bomb squad & Police personnel are conducting inspection after a man in a Delhi-bound flight reportedly claimed that he had a bomb in his bag. His bag was checked further & no bomb was found pic.twitter.com/BkNxpjZ2QC — ANI (@ANI) July 21, 2022 -
రైల్వేస్టేషన్లో బాంబు కలకలం
లండన్ : లండన్ చేరింగ్ క్రాస్ రైల్వేస్టేషన్లో బాంబుతో సంచరిస్తున్నట్టు ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో కలకలం రేగింది. తన వద్ద బాంబు ఉందన్న వ్యక్తిని బ్రిటిష్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్పై నిలుచున్న ఓ వ్యక్తి తన వద్ద బాంబు ఉందని చెప్పడంతో బ్రిటిష్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రయాణీకులు, సిబ్బందిని హుటాహుటిన బయటకు పంపిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా నిమిషాల్లో స్టేషన్ను ఖాళీ చేయించారు. పెద్ద ఎత్తున సాయుధ బలగాలను స్టేషన్కు రప్పించి, అడుగడుగునా జల్లెడ పట్టారు. కాగా, బాంబు ఉందని హెచ్చరించిన వ్యక్తిని అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రస్తుతం రైల్వేస్టేషన్లో సేవలు పునరుద్ధరించే ప్రక్రియ సాగుతోందని చెప్పారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని పోలీస్ ప్రతినిధి వెల్లడించారు. అండర్గ్రౌండ్ సర్వీసులను అధికారులు క్రమబద్ధీకరించారని, ప్రయాణీకులు ట్రైన్ షెడ్యూల్స్లో మార్పులు గమనించి అందుకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. -
బుజ్జిగాడు బాంబు పేల్చాడు
ఆ బుడుగు టీవీలో వస్తున్న షోని చూశాడు. అందులో హీరో 100 నంబర్ కి ఫోను చేసి రాబోయే బాంబు ప్రమాదం గురించి చెప్పాడు. తక్షణం పోలీసులు వచ్చి బాంబును నిర్వీర్యం చేశారు. అది చూసిన ఆ పదేళ్ల కుర్రాడికి మన పోలీసులు ఎలా పనిచేస్తారో చూడాలనిపించింది. అంతే... ఫోను తీసుకుని 100 కి డయల్ చేశాడు. మా ఇంటి దగ్గర ఉప్పుఫ్యాక్టరీ పక్కన బాంబు పేలిందని సమాచారం ఇచ్చాడు. ఇంకేముంది? నిముషాల్లో పోలీసులు వచ్చేశారు. బాంబు స్క్వాడ్లు, డాగ్ టీమ్ లు వచ్చాయి. హడావిడిగా అంతా వెతికితే బాంబు ఎక్కడా కనిపించలేదు. చివరికి ఆరా తీస్తే పదేళ్ల బుడతడు ఫోన్ చేశాడని తెలిసింది. 'పోలీసులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని టెస్ట్ చేశానంతే' అన్నాడు ఆ కుర్రాడు. ఆ కుర్రాడి పేరు షమీమ్. ఈ సంఘటన కాన్పూర్ జిల్లాలోని రావత్ పూర్ లో జరిగింది. అనవసరంగా హడావిడిపడ్డందుకు కోపం వచ్చినా పోలీసులు తల్లిదండ్రులను మందలించారు. పిల్లవాడిని మాత్రం వదిలేశారు.