-
బొల్లారం నుంచి బ్రెజిల్ దాకా.. అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన వాళ్లు సైతం..
ఉదయం 6 గంటలు... పక్షుల కిలకిలరావాలు.. అప్పుడప్పుడే బయటకు వస్తోన్న ప్రజలు. బొల్లారంలోని సదర్ బజార్లో ఓ ఇరుకు గల్లీ నుంచి కొద్దిగా ముందుకు వెళితే ఓ గ్రౌండ్.. ఓ వైపు వందేళ్ల కింద కట్టిన బ్రిటీష్ కాలం నాటి ప్రభుత్వ పాఠశాల, మరోవైపు సదర్ బజార్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్. వాటి మధ్య విశాలమైన క్రీడా ప్రాంగణం. అదే కంటోన్మెంట్ ఫుట్బాల్ క్లబ్ అడ్డా బొల్లారం స్పోర్టింగ్ గ్రౌండ్. లోపలికి అడుగుపెడితే ఇంత పెద్ద గ్రౌండ్ లోపల ఉందా.. అనుకుంటూ ఆశ్చర్యపోతాం.. అక్కడి స్పోర్టింగ్ క్లబ్లో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా పిల్లలు రెడీ అయిపోతారు. 6గంటల కంటే ముందే వందకు పైగా పిల్లలు సాకర్ గెటప్లో వచ్చేస్తారు. 1,2,3.. వరుసగా కౌంట్ చేసుకుంటూ పిల్లలు వేసే కేకలు.. విశాల ప్రాంగణంలో మార్మోగుతాయి. ఎండాకాలం సెలవులంటే ఇంట్లోనే సెల్ఫోన్లకు పరిమితమై పోయే పిల్లలను ఫుట్బాల్ వైపు నడిపిస్తోంది బొల్లారం స్పోర్టింగ్ క్లబ్. ఇది కమర్షియల్గా చేస్తోంది కాదు. పూర్తిగా సామాజిక సేవగా, మట్టిలో మాణిక్యాలను వెలికితీసే కార్యక్రమంలో భాగంగా క్లబ్ కోచ్లు, గతంలో క్లబ్తో కలిసి ప్రయాణం చేసిన మాజీ ఆటగాళ్లు ఈ క్యాంప్ను నడిపిస్తున్నారు. సాధారణ వ్యక్తుల్లా ఇదే క్లబ్లో అడుగుపెట్టి.. ప్రొఫెషనల్ ఆటగాళ్లుగా మారి.. ఇప్పుడు వేర్వేరు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తోన్న కోచ్లు.. తమకిష్టమైన ఫుట్బాల్ కోసం వంతుల వారీగా బొల్లారం వచ్చి పిల్లలకు మెలకువలు నేర్పిస్తున్నారు. 1946లో ప్రారంభమైన బొల్లారం స్పోర్టింగ్ క్లబ్ 75 ఏళ్ల వజ్రోత్సవాలను 2022లో పూర్తి చేసుకుంది. వజ్రోత్సవాలను పురస్కరించుకుని అమ్మాయిలకు, అబ్బాయిలకు ఫుట్బాల్ టోర్నీలను ఏడాదంతా నిర్వహించింది. మొత్తం 75 మ్యాచ్లు ఇందులో భాగంగా నిర్వహించారు. ఈ క్లబ్లో ఓనమాలు నేర్చుకుని జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పటివరకు 16 మంది ఆటగాళ్లు వేర్వేరు సంవత్సరాల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. బొల్లారం ఫుట్ క్లబ్ నుంచి కొందరు ఆణిముత్యాలు. 1.పీటర్ తంగరాజ్ రెండు సార్లు ఒలింపిక్స్ (1956, 1960లో) ఫుట్ బాల్ మ్యాచ్ల్లో ఆడారు. అలాగే 1967లో అర్జున అవార్డు అందుకున్నారు. 2.తులసీదాస్ బలరాం కూడా రెండు సార్లు ఒలింపిక్స్లో పాల్గొన్నారు. పీటర్ తంగరాజ్తో కలసి 1956, 1960 ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. 3.డి.కన్నన్ 1958 ఏషియన్ గేమ్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. 4.అంటోనీ పాట్రిక్ ఇక్కడి నుంచే గేమ్ మొదలుపెట్టి అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. 5.GM పెంటయ్య 1960లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్లో కోచ్గా సేవలందించారు. 6.అలీం ఖాన్ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. DYSOగా పని చేసి రిటైర్ అయ్యారు 7.KRV మూర్తి ఇదే క్లబ్ నుంచి ఎన్నో మ్యాచ్లు ఆడి స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్లో పని చేసి రిటైరయ్యారు 8.GP విజయ్ కుమార్ ఫుట్ బాల్ ప్లేయర్గా రాణించారు, రాష్ట్ర టీంకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో సెంట్రల్ ఎక్సైజ్లో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారు. 9.B వేణుగోపాల్, ఫుట్బాల్ ప్లేయర్ నుంచి సాయ్లో సీనియర్ కోచ్గా ఎదిగారు. అలాగే NIS సర్టిఫైడ్ కూడా 10.విక్టర్ అమూల్ రాజ్ బొల్లారం నుంచి భారత జట్టకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్నారు. 11.మణిభూషణ్, రాష్ట్ర జట్టుకు ఆడారు 12.ES శ్యాం స్థానిక ఫుట్బాల్ ప్లేయర్గా మొదలుపెట్టి అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. ప్రస్తుతం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పని చేస్తూనే కోచ్గానూ సేవలందిస్తున్నారు. AFC ‘A’ లైసెన్స్ సర్టిఫైడ్ కోచ్గా ఉన్నారు 13. BR వివేక్– రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రైల్వేస్లో పని చేసి రిటైరయ్యారు 14. జయకుమార్ - రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రైల్వేస్లో పని చేసి రిటైరయ్యారు 15. అమర్ చంద్ - రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. స్టేట్ బ్యాంకులో పని చేస్తున్నారు. యువతలో ముఖ్యంగా చిన్నారుల్లో ఆటల పట్ల ఉత్సాహం పెంచాలన్నది ఈ సమ్మర్ క్యాంపు ప్రధాన ఉద్దేశ్యం. దానికి ఫుట్బాల్ను ఒక టూల్గా వాడుతున్నారు. శారీరక, మానసిక ఉల్లాసం కలిగించడంతో పాటు ఉత్సాహం పెంచడానికి కృషి చేస్తున్నారు. అలాగే చారిత్రక బొల్లారం ఫుట్బాల్ క్లబ్ నుంచి మరింత మంది కొత్త ప్లేయర్లను తయారు చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ క్లబ్ నిర్వహణకు అన్ని రకాల సహకారం అందిస్తోన్న మాజీ కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, గోపాల్రావు, జ్ఞానేశ్వర్, జీపీ విజయ్కుమార్తో పాటు ప్రస్తుత కార్యదర్శి రాజ్ సాయికృపా ఆనంద్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రెగ్యులర్ కోచ్లుగా సీనియర్ ఆటగాళ్లున్నారు. 1. గండ్ల సందీప్, రంగారెడ్డి జిల్లాతో పాటు యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు 2. S సునీల్ కుమార్, అండర్ 19 రాష్ట్ర టీంకు ప్రాతినిధ్యం వహించారు 3. C ప్రభాకర్ రెడ్డి, NIS సర్టిఫైడ్ కోచ్, కేంద్రీయ విద్యాలయం బొల్లారంలో కోచ్గా ఉన్నారు 4. బొడ్డు రాఘవేందర్, జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ ప్లేయర్ 5. Y వినోద్ కుమార్, సీనియర్ ప్లేయర్ 6. R చండిల్, సీనియర్ ప్లేయర్ 7. B అనిల్ కుమార్, సీనియర్ ప్లేయర్ వేర్వేరు ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తోన్న మాజీ ఆటగాళ్లు ఈ క్లబ్ నిర్వహణలో తమ వంతుగా సహకరిస్తున్నారు. సమ్మర్ క్యాంపులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు, వారందరికి ధన్యవాదాలు. ప్రతీ రోజు ఉదయాన్నే పిల్లలకు ఆటతో పాటు క్రమశిక్షణ, వ్యాయామం నేర్పిస్తున్నాం. ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొన్న పిల్లల్లో స్పష్టమైన మార్పును కనిపెట్టవచ్చు. శారీరకంగా ఉత్సాహాంగా ఉంటారు. -సునీల్, కోచ్, బొల్లారం స్పోర్టింగ్ క్లబ్ వ్యక్తిగతంగా తమ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నాం. ఎక్కడెక్కడో పని చేస్తున్నా.. ఈ క్యాంపు కోసం వంతులు వేసుకుని వందల కిలోమీటర్లు ప్రయాణించి రెండు, మూడు రోజులు ప్లేయర్లతో గడుపుతున్నాం. ఆఫీసులో ఎంత పని ఒత్తిడి ఉన్నా.. వీకెండ్లో ఇక్కడికి వచ్చి క్లబ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఈ తరంలో కొందరయినా.. బొల్లారం క్లబ్కు పునర్వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నాం. -శ్యాం, ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్, కోచ్, స్టేట్ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ చిన్నప్పటి నుంచి ఈ క్లబ్తో అనుబంధం ఉంది. ఇక్కడే ఎంతో నేర్చుకున్నాం. అదే ఆటను ఇక్కడి వాళ్లకు నేర్పించడంలో ఎంతో ఆనందం ఉంది. ఎంత బిజీగా ఉన్నా.. ఇక్కడికి వచ్చి పిల్లలకు మెలకువలు నేర్పిస్తాం. బొల్లారం ఫుట్బాల్ క్లబ్ మా జీవితంలో భాగం. సందీప్, కోచ్, బొల్లారం స్పోర్టింగ్ క్లబ్ -
Telangana Liberation Day 2022: మందు పాతరలు.. చివరి అస్త్రం
సాక్షి, హైదరాబాద్: భారత ప్రధాన సైన్య విభాగం బొల్లారం చేరకుండా చివరి ప్రయత్నంగా నిజాం సైన్యం మందుపాతర్లను ప్రయోగించింది. షోలాపూర్–హైదరాబాద్ రహదారి మీదుగా వస్తున్న మేజర్ జనరల్ చౌదురీ నేతృత్వంలోని సైనిక బృందాన్ని హతమార్చేందుకు నిజాం సైన్యం సికింద్రాబాద్కు 20 మైళ్ల దూరంలో పెద్ద సంఖ్యలో మందుపాతర్లను అమర్చింది. అదే సమయంలో భారత సైన్యానికి పట్టుబడ్డ కొందరు నిజాం సైనికులు ఈ విషయాన్ని వెల్లడించారు. వాటిని తొలగించాల్సిందిగా భారత సైన్యం ఆదేశించింది. కానీ, వాటిని జాగ్రత్తగా వెలికితీసే విధానంపై అవగాహన లేకపోవడంతో ఆ సైనికులు చేతులెత్తేశారు. దీంతో భారత సైన్యంలోని నిపుణులు ఐదు గంటలు కష్టపడి వాటిని గుర్తించి, నిర్వీర్యం చేశారు. ఈ మందుపాతర్ల వ్యవహారం వల్ల భారత సైన్యం ఐదు గంటలు ఆలస్యంగా బొల్లారం చేరుకుంది. సాయంత్రం నాలుగున్నరకు సికింద్రాబాద్ శివార్లలో నిజాం సైన్యాధ్యక్షుడు మేజర్ జనరల్ ఎడ్రూస్ ఎదురేగి చౌదురీ బృందానికి స్వాగతం పలికాడు. నిజాం సేనల లొంగుబాటు పత్రాన్ని సమర్పించాడు. ఇండియన్ ఆర్మీని తోడ్కొని భారత ప్రభుత్వ ప్రతినిధి మున్షీ భవనానికి తీసుకెళ్లాడు. 20 మంది భారత సైనికులు మృతి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేందుకు జరిగిన ఆపరేషన్లో భారత సైన్యం 20 మంది జవాన్లను కోల్పోయింది. అతి తక్కువ ప్రాణనష్టంతో గొప్ప విజయాన్ని సాధించినట్టయింది. 600 మంది నిజాం సైనికులు, 1,000 మందికిపైగా రజాకార్లు ఈ ఆపరేషన్ పోలోలో మరణించినట్లు అప్పట్లో లెక్కలు తేల్చారు. (క్లిక్ చేయండి: అణచివేతపై సాయుధ పోరాటం!) కృత్రిమ వరదలకు కుట్ర భారత సైన్యాన్ని అడ్డుకునే క్రమంలో మూసీ నదిలో రజాకార్లు కృత్రిమ వరదలు సృష్టించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్కు మంచినీరు సరఫరా చేసే హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల గేట్లను ధ్వంసం చేసి మూసీలోకి భారీగా వరద వచ్చేలా చేశారు. నదిలో వరద నిండుగా ఉంటే భారత సైన్యం ముందుకు రాలేదన్నది వారి ఆలోచన. కానీ, ఈ ప్రతిబంధకాలను విజయవంతంగా అధిగమించి భారత సైన్యం నగరంలోకి చొచ్చుకొచ్చింది. రజాకార్ల దుశ్చర్యతో హైదరాబాద్ను కొంతకాలం పాటు తాగునీటి కష్టాలు చుట్టుముట్టాయి. (క్లిక్: జిన్నా చనిపోయిన రోజే ముహూర్తం.. చకచకా పావులు కదిపిన సర్దార్ పటేల్) -
రాష్ట్రపతి నిలయానికి భారీ బందోబస్తు
బొల్లారం, న్యూస్లైన్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తొలిసారిగా హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఆయన ప్రత్యేక విమానం ల్యాండ్ కానుంది. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు తరలి రానున్నారు. గురువారం సాయంత్రం 5.15 గంటలకు రాష్ట్రపతి విమానం ఎయిర్ఫోర్స్ స్టేషన్లో దిగనుంది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆయనను తీసుకువచ్చే వాహనాలతో బుధవారం మధ్యాహ్నం రూటు రిహార్సల్ను అధికారులు నిర్వహించారు. రాష్ట్రపతి నిలయం నుంచి ఎయిర్ఫోర్స్ స్టేషన్, ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి రాష్ట్రపతి నిలయం వరకు కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. హైదరబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ, అడిషనల్ కమిషనర్ అంజనికుమార్, ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అమిత్గార్గ్, సంయుక్త కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్) బి.మల్లారెడ్డి డీసీపీ జయలక్ష్మి, ఇతర పోలీసు, ఆర్మీ ఉన్నతాధికారులు బందోబస్తుతో పాటు ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ప్రణాళికలు రూపొందించారు. ఉన్నతాధికారుల కాకుండా 750 మంది సిబ్బందిని రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో మోహరించారు. ఆర్మీ, పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు స్పెషల్ బ్రాంచి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. నేడు ట్రాఫిక్ ఆంక్షలు రాష్ట్రపతి గురువారం హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం 5.15 గంటలకు హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఆయన ప్రత్యేక విమానం దిగనుంది. ఈ నేపథ్యంలో ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ కింద తెలిపిన ప్రాంతాల మీదుగా ప్రయాణించే వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకోవాలని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అమిత్గార్గ్ కోరారు. ఆంక్షలున్న ప్రాంతాలివే: ఎయిర్ఫోర్స్ స్టేషన్ ‘వై’ జంక్షన్-ఎయిర్ఫోర్స్ బెటాలియన్ 2,3 గేట్లు-బొల్లారం చెక్పోస్ట్-సహేజ్ ద్వార్-ఈఎంఈ సెంటర్ వద్ద ఉన్న జేసీఓ మెస్, ఫస్ట్ బెటాలియన్-పంప్ హౌస్-బిసిన్ ఎన్వైర్మెంట్ పార్క్-బిసిన్ హెడ్ క్వార్టర్స్ మెయిన్ గేట్- యాప్రాల్-బిసిన్ బేకరీ ఎక్స్టెన్షన్- నేవీహౌస్ జంక్షన్- ఆంధ్రా సబ్-ఏరియా ఆఫీసర్స్ మెస్- ఆర్ఎస్సై జంక్షన్- ఈఎంఈ సెంటర్ హౌస్-గేట్ నెం.3, 2, 1- రాష్ట్రపతి నిలయం మెయిన్గేట్.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement