-
బి.నాగిరెడ్డి పోస్టల్ స్టాంప్ విడుదల
సాక్షి, చెన్నై : ప్రేక్షకులకు పలు చిరస్మరణీయ చిత్రాలను అందించిన అలనాటి ప్రముఖ నిర్మాత బి.నాగిరెడ్డి స్మారక పోస్టల్ స్టాంపును ముఖ్య అతిధిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం విడుదల చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో దగవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, రాష్ట్ర మంత్రి అన్భళగన్ ఆస్పత్రి నిర్వాహకులు, నాగిరెడ్డి వారసులు పాల్గొన్నారు. ఎన్నో చిత్రాల నిర్మాతగా, విజయా స్టుడియోస్ అధినేతగా, ఆస్పత్రుల వ్యవస్థపకులుగా, చందమామ పత్రిక పబ్లిషర్గా నాగిరెడ్డి సేవలు అమోఘమని ముఖ్య అతిధులు శ్లాఘించారు. సినీ రంగాని, వైద్య రంగానికి నాగిరెడ్డి చేసిన సేవలని గుర్తుతెచ్చుకునే విధంగా పోస్టల్ స్టాంప్తో , పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషం కలిగించిందని వెంకయ్య నాయుడు అన్నారు. సమాజానికి సేవలు చేసిన నాగిరెడ్డి పేరిట స్టాంప్ విడుదల చేసేందుకుకు ముందుకు వచ్చిన తపాలా శాఖకు అభినందనలు తెలిపారు. నాగిరెడ్డి గొప్ప మానవతావాది అని, గొప్పవారి జ్ఞాపకాలను రేపటి తరాలకు అందించటం హర్షించదగ్గ పరిణామం అన్నారు. విజయా సంస్థ చిత్రాలతో పాటు చందమామ, బాలమిత్ర వంటి కథలు నాగిరెడ్డిని ఇప్పటికీ గుర్తుకు తెస్తాయని వెంకయ్య అన్నారు. -
8న ‘స్వచ్ఛ తెలంగాణ’కు శ్రీకారం
రాష్ట్రంలోని 67 పట్టణాల్లో అమలు హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఈ నెల 8న ‘స్వచ్ఛ భారత్-స్వచ్ఛ తెలంగాణ’ కార్యక్రమం ప్రారంభించనున్నామని రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు బి.నాగిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 67 మున్సిపాలిటీల్లో ఏకకాలంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ తెలంగాణ ఏర్పాట్లపై మేయర్లు/చైర్మన్లు, మునిసిపల్ కమిషనర్లతో మంగళవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కింద వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం, ఘన వ్యర్థాల నిర్వహణతో పాటు పారిశుధ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఈ కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు ప్రతి పట్టణానికి ఒక నోడల్ అధికారిని, ప్రతి వార్డుకు వార్డు స్థాయి అధికారిని నియమించామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేసుకునే లబ్ధిదారులకు ఈ నెల 8న ప్రారంభోత్సవం రోజు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు. రెండు విడతల్లో పునాది వరకు నిర్మిస్తే రూ.6 వేలు, పూర్తిగా నిర్మిస్తే మిగిలిన రూ.6 వేలను లబ్ధిదారులకు చెల్లిస్తామన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement