breaking news
block deal
-
రూ. 2,873 కోట్ల లెన్స్కార్ట్ షేర్లు అమ్మేసిన సాఫ్ట్బ్యాంక్
న్యూఢిల్లీ: ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ తాజాగా ఐవేర్ కంపెనీ లెన్స్కార్ట్లో 3.25 శాతం వాటా విక్రయించింది. షేరుకి రూ. 508.55 సగటు ధరలో ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 5.65 కోట్ల షేర్లను అమ్మివేసింది. ఎన్ఎస్ఈ బ్లాక్ డీల్ వివరాల ప్రకారం వీటి విలువ రూ. 2,873 కోట్లు. అనుబంధ సంస్థ ఎస్వీఎఫ్ 2 లైట్బల్బ్(కేమాన్) ద్వారా వాటా విక్రయించింది. ఈ విక్రయానికి ముందు లెన్స్కార్ట్లో సాఫ్ట్ బ్యాంక్ వాటా 13.13 శాతంకాగా.. ప్రస్తుతం 9.88 శాతానికి తగ్గింది. ఎంఎఫ్లు వైట్ఓక్ క్యాపిటల్, మిరాయ్ అసెట్, కొటక్, కెనరా రొబెకో, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్తోపాటు.. ఇన్సూరెన్స్ కంపెనీలు హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, సొసైటీ జనరాలి తదితరాలు సాఫ్ట్ బ్యాంక్ విక్రయించిన షేర్లను కొనుగోలు చేశాయి. -
పేటీఎంలో బ్లాక్ డీల్.. చేతులు మారిన రూ.963 కోట్ల షేర్లు
న్యూఢిల్లీ: పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్లో 1.34 శాతం వాటా బ్లాక్ డీల్ ద్వారా చేతులు మారింది. గోల్డ్మన్ సాక్స్, సొసైటే జనరల్, సిటిగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అలాగే సుందరం మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ వంటి దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు ఈ షేర్లను కొనుగోలు చేశాయి.మొత్తం 85.98 లక్షల షేర్లను ఒక్కోటి సగటున రూ.1,120.65 ధరకు కొనుగోలు చేయగా, డీల్ విలువ రూ.963.60 కోట్లకు చేరింది. ఈ షేర్లను హాంకాంగ్కు చెందిన ప్రైవేట్ ఈక్విటీదారు ఎస్ఏఐఎఫ్ పార్ట్నర్స్, గురుగ్రామ్కు చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ ఎలివేషన్ క్యాపిటల్లు విక్రయించాయి. ఈ లావాదేవీ అనంతరం వన్97 కమ్యూనికేషన్స్లో ఎస్ఏఐఎఫ్ పార్ట్నర్స్ వాటా 13.43% నుంచి 12.18 శాతానికి తగ్గింది.


