-
బయోమాస్ సేకరణపై ఫోకస్.. ఖర్చు ఎంతంటే..
అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల నిత్యం గ్యాస్ ధరల పెరుగుతున్నాయి. భారత్ విదేశాల నుంచి గ్యాస్ను దిగుమతి చేసుకుంటుంది. దాంతో ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతోంది. చేసేదేమిలేక ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపుతోంది. అయితే దిగుమతి చేసుకునే గ్యాస్ స్థానే స్థానికంగా బయోమాస్ను సేకరించి దీన్ని తయారుచేసుకోవాలని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్(ఐబీఏ) సూచించింది. అందుకు అనుగుణంగా బయోమాస్ సేకరణపై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఐబీఏ పేర్కొంది. బయోగ్యాస్ ప్లాంట్లకు బయోమాస్ను సప్లయ్ చేయడానికి మెషినరీ, ఎక్విప్మెంట్ల కోసం రూ.30 వేలకోట్ల వరకు పెట్టుబడులు అవసరం అవుతాయని ఐబీఏ అంచనా వేసింది. ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) దిగుమతులను తగ్గించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. వరిగడ్డి వంటి అగ్రి వేస్టేజ్ను బయోఎనర్జీ ఉత్పత్తికి వాడుకోవాలని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ చైర్మన్ గౌరవ్ కేడియా అన్నారు. అయితే బయోమాస్ను సేకరించడంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. దాన్ని సేకరించడం, స్టోర్ చేయడం, రవాణా వంటి వాటికి అధికమొత్తంలో ఖర్చువుతుందని, దీంతో వరిగడ్డి వంటి అగ్రి వేస్ట్ను అమ్మడం కంటే తగలబెట్టడానికే రైతులు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం లాజిస్టిక్స్ను మెరుగుపరచడం కంటే వరి గడ్డిని సమర్ధవంతంగా సేకరించగలిగే ఎక్విప్మెంట్లను వాడేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇదీ చదవండి: ‘వేర్’వేర్లు..! విభిన్న సాఫ్ట్వేర్లు.. -
షుగర్ మిల్ ఓనర్లతో ముఖేష్ అంబానీ చర్చలు - ఎందుకో తెలుసా?
భారతదేశంలో అత్యంత సంపన్నుడు, ప్రముఖ వ్యాపారవేత్త 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) తన కొత్త వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కొన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత? ఆ వ్యాపారం ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ.. కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ఉత్పత్తికి కీలకమైన ముడిసరుకు చెరుకు వ్యర్దాలు సేకరించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే చక్కెర మిల్లు నిర్వాహకులతో చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే.. రిలయన్స్ బయోగ్యాస్ ఉత్పత్తి ప్లాంట్స్ మరిన్ని త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. బయోగ్యాస్ ఉత్పత్తి కోసం కంపెనీ టన్నుల కొద్దీ చెరకు వ్యర్థాలు కొనుగోలు చేయనుంది. రానున్న ఐదేళ్లలో 100 బయోగ్యాస్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు.. ఒక్కో ప్లాంట్ 5.5 మిలియన్ టన్నుల వ్యవసాయ వ్యర్థాలు, సేంద్రియ వ్యర్థాలను ప్రాసెస్ చేసి బయోగ్యాస్ను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. రిలయన్స్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను నిర్వహిస్తోంది, ఈ మధ్య కాలంలో ప్రారంభమైన ఈ ప్లాంట్ నిర్వహణకు టన్నుల కొద్దీ చెరుకు వ్యర్దాలు అవసరమని స్పష్టమైంది. బయోగ్యాస్ ప్లాంట్లలో ఉపయోగించే వ్యర్దాల వల్ల సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని, 2.5 టన్నుల సేంద్రియ ఎరువును తయారు చేయవచ్చని చెబుతున్నారు. ఇదీ చదవండి: రతన్ టాటా పేరిట మోసం.. వైరల్ అవుతున్న పోస్ట్ గత నెలలో కోల్కతాలో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 7వ ఎడిషన్లో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. స్వదేశంలో అభివృద్ధి చెందిన సాంకేతికల ఆధారంగా అతి పెద్ద బయో ఎనర్జీ ఉత్పత్తిదారుగా భారత్ అవతరిస్తుందని వెల్లడించారు. బయోగ్యాస్ ఉత్పత్తికి రిలయన్స్ కంపెనీ మాత్రమే కాకుండా అదానీ కంపెనీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. -
వెదురు నుంచి జీవ ఇంధనాలు!
ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. సరైన ప్రత్యామ్నాయ ఇంధనాలు విరివిగా అందుబాటులో లేకపోవడంతో పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి వాటిపై అనివార్యంగా ఆధారపడాల్సి వస్తోంది. వీటివల్ల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని, పర్యావరణానికి, భూగోళంపై మానవళి మనుగడకు ముప్పు ఏర్పడుతోందని తెలిసినప్పటికీ మరో దారిలేక ప్రమాదకరమైన ఇంధనాలపైనే అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు పునరుత్పాదక ఇంధనాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో ఊపందుకోవడం లేదు. జల విద్యుత్ ఉత్పత్తికి కొన్ని పరిమితులున్నాయి. ఇలాంటి తరుణంలో హంగేరీలోని ‘హంగేరియన్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్’ పరిశోధకులు తీపి కబురు అందించారు. అడవుల్లో సహజసిద్ధంగా, విస్తృతంగా పెరిగే వెదురు(బ్యాంబూ)తో బయో ఇథనాల్, బయో గ్యాస్ వంటి జీవ ఇంధన ఉత్పత్తులు తయారు చేయవచ్చని తమ అధ్యయనంలో తేల్చారు. సమీప భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధన రంగంలో వెదురు ఒక విప్లవమే సృష్టించబోతోందని చెబుతున్నారు. శిలాజ ఇంధనాలకు కాలుష్యానికి తావులేని ఇలాంటి ఇంధనాలే సరైన ప్రత్యామ్నాయం అవుతాయని అంటున్నారు. ఈ అధ్యయనం వివరాలను ‘జీసీబీ బయో ఎనర్జీ’ జర్నల్లో ప్రచురించారు. ► ఇతర చెట్లతో పోలిస్తే వెదురు చాలా వేగంగా పెరుగుతుంది. ఇదొక విలువైన సహజ వనరు. కాలుష్యాన్ని కట్టడి చేసే విషయంలో వెదురును ‘సూపర్ స్పాంజ్’గా పరిగణిస్తుంటారు. కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటుంది. వాతావరణంలోకి ప్రాణవాయువు(ఆక్సిజన్) ను అధికంగా విడుదల చేస్తుంది. ► ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడంలో వెదురు పాత్ర చాలా కీలకం. భూమిపై వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ► ప్రకృతిలో వెదురు ప్రాధాన్యతను గుర్తించిన పరిశోధకులు దాని నుంచి పునరుత్పాదక ఇంధనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ► కిణ్వ ప్రక్రియ(ఫెర్మెంటేషన్), అధిక ఉష్ణోగ్రతల వద్ద కుళ్లిపోయేలా చేయడం(పైరోలిసిస్)తోపాటు హైడ్రోథర్మల్ లిక్విఫాక్షన్, అనెయిరోబిక్ డైజేషన్ వంటి ప్రక్రియల ద్వారా ముడి వెదురు నుంచి బయో ఇథనాల్, బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని కనిపెట్టారు. ► పరిశుద్ధమైన, స్థిరమైన ఇంధన వనరులను అందించగల సామర్థ్యం వెదురుకు ఉందని గుర్తించారు. ► కొన్ని జాతుల వెదురు నుంచి అధికంగా బయో ఇంధనం ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. వేర్వేరు జాతులు వేర్వేరుగా రసాయన చర్య జరపడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ► వెదురులో సెల్యూలోజ్లు, హెమిసెల్యూలోజ్ లో అధిక మోతాదులో ఉంటాయి. వీటి నుంచి బయో ఇథనాల్, బయోగ్యాస్తోపాటు బయోచర్ అనే ఎరువు కూడా ఉత్పత్తి అవుతుంది. ► వెదురు నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాలను తయారు చేసుకుంటే శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గిపోతుందని, తద్వారా కాలుష్యాన్ని, వాతావరణ మార్పులను నియంత్రించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. వెదురు నుంచి జీవ ఇంధనాల ఉత్పత్తి ప్లాంట్లకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదని చెబుతున్నారు. ఇది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ అని పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విస్కీ వ్యర్థాలతో బయో ఇంధనం
రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలు ఇంకా పూర్తి స్థాయిలో మార్కెట్లోకి రాలేదు. ఇప్పడు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనం కాకుండా మరో వాహనం మార్కెట్లోకి రానుందా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ప్రముఖ స్కాచ్ విస్కీ బ్రాండ్ "గ్లెన్ ఫిడిచ్" గురుంచి చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పడు ఈ కంపెనీ మద్యం తయారీతో పాటు ఇంధనం తయారీలో అడుగుపెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా తన డెలివరీ వాహనాలలో పెట్రోలకు ప్రత్యామ్నాయంగా విస్కీ వ్యర్థాల నుంచి తయారు చేసిన బయోగ్యాస్ ఇంధనాన్ని ఉపయోగించడం ప్రారంభించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఇంధనం వాహన కాలుష్యాన్ని(సీఓ2 ఉద్గారాన్ని) 95% వరకు తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది. గ్లెన్ ఫిడిచ్ ఇప్పటికే తన డెలివరీ ట్రక్కులను ఈ బయోగ్యాస్ ఇంధనం ద్వారా నడపడం ప్రారంభించింది. "క్లోజ్డ్ లూప్" ధారణీయత ప్రాజెక్ట్ లో భాగంగా ఈశాన్య స్కాట్లాండ్ లోని కంపెనీ డఫ్ టౌన్ డిస్టిలరీలో ఇంధన స్టేషన్లను ఏర్పాటు చేసింది. విస్కీ వ్యర్థాల నుంచి తయారు చేసిన బయోగ్యాస్ డీజిల్ ఇతర శిలాజ ఇంధనాలతో పోలిస్తే సీఓ2 ఉద్గారాలను 95% కంటే ఎక్కువ తగ్గిస్తుందని, ఇతర హానికరమైన గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను 99% వరకు తగ్గిస్తుందని గ్లెన్ ఫిడిచ్ పేర్కొంది. ఈ ఇందనాన్ని త్వరగా మార్కెట్లోకి తీసుకొనిరావడానికి కంపెనీ యోచిస్తుంది. ఒకవేల ఈ ఇందనాన్ని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయగలిగితే కార్బన్, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల నుంచి పర్యావరణాన్ని కాపాడవచ్చు అని కంపెనీ పేర్కొంది. -
‘చెత్త’తో వెలుగులు.. ప్లాంట్ ఎలా పనిచేస్తుందంటే?
సాక్షి, హైదరాబాద్ : వ్యర్థాలు కూడా వెలుగులు నింపుతున్నాయి. డంపింగ్ యార్డుకు తరలించే చెత్తను ఇంధన శక్తిగా మార్చడం ద్వారా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మార్కెటింగ్ శాఖ.. నగరవ్యాప్తంగా ఉన్న మార్కెట్లన్నింటిలోనూ ఈ విధానంతో విద్యుత్ను ఉత్పత్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బోయిన్పల్లి మార్కెట్లో పవర్ప్లాంట్ను ఏర్పాటు చేసిన ఆ శాఖ.. 10 టన్నుల చెత్తతో 550 యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. తద్వారా మార్కెట్ అవసరాలన్నింటికీ ఈ కరెంట్ సరిపోతుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) సహాయంతో చెత్తను బయోగ్యాస్గా మార్చిన నేపథ్యంలో ఇదే విధానాన్ని ఇతర మార్కెట్లలోనూ అవలంభించాలని మార్కెటింగ్ శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. ఈ క్రమంలో ఎర్రగడ్డ రైతుబజార్లో ఒకడుగు ముందుకేసి.. ప్లాంట్ను అందుబాటులోకి కూడా తెచ్చింది. ఇది ఉత్పత్తి చేసే విద్యుత్తో క్యాంటీన్ కూడా నిర్వహిస్తున్నట్లు మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. ప్రతిరోజూ 500 కిలోల చెత్తను బయోగ్యాస్ మార్చడం ద్వారా.. ఈ పవర్ను ఉత్పత్తి చేస్తున్నారు. గతంలో ఈ మార్కెట్లో వ్యర్థాలను తరలించేందుకు నెలకు సుమారు రూ.1.5 లక్షల మేర ఖర్చు చేసేవారు. పవర్ప్లాంట్ రాకతో సుమారు రూ.70వేల మేర ప్రభుత్వ ఖజానాకు ఆదా అవుతుంది. బోయిన్పల్లే ఆదర్శం.. బోయిన్పల్లి తరహాలో గుడిమల్కాపూర్, గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ సరూర్నగర్ రైతు బజార్తో పాటు గ్రేటర్ పరిధిలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగే ఇతర మార్కెట్లలో కూడా ఇలాంటి ఏర్పాట్లకు మార్కెటింగ్ శాఖ ప్రణాళికలు రూపొందించిందని ఆ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తెలిపారు. ఇప్పటికే మెహిదీపట్నం రైతుబజార్లో సేంద్రియ ఎరువుల తయారీ యూనిట్ నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ కూరగాయల మార్కెట్, అల్వాల్ రైతుబజార్లో ఎర్రగడ్డ తరహాలో ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. చదవండి: కోళ్ల వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీ బోయిన్పల్లి ప్లాంట్.. ►1500 ఎరువు ఉత్పత్తి రూ.3 కోట్లతో బోయిన్ పల్లిలో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ పవర్ ప్లాంట్ విశేషాలు ►నిత్యం 10 టన్నుల చెత్తను ఇంధనంగా మార్చుతోంది. రోజుకు 1220–1400 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి ► 550 ఎల్పీజీ గ్యాస్తో సమానం ►నగరంలోని వివిధ హోల్సేల్ మార్కెట్లలో చెత్త ఎత్తడానికి నెలకు అయ్యే ఖర్చు దాదాపు రూ.20 లక్షలు బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్.. ►10 టన్నుల వ్యర్థాలతో బయోగ్యాస్, విద్యుత్తుగా ఎలా మారుస్తోంది. ►ఆహారం వృథా: ఐక్యరాజ్య సమితి 2019 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 931 మిలియన్ టన్నుల ఆహారం వృథా అయిందని అంచనా. ►వీటిలో 61శాతం గృహాల నుండి, 26 శాతం ఆహార సేవ నుండి, 13 శాతం చిల్లర వర్తకం (రిటైల్) నుండి వృథా అయ్యాయి. ►భారతదేశంలో గృహ ఆహార వ్యర్థాల సంవత్సరానికి 68.7 మిలియన్ టన్నులు అని ఆ నివేదిక తెలిపింది. బోయిన్పల్లి మార్కెట్ ►హైదరాబాద్ మార్కెట్ స్థిరమైన పద్ధతిలో రోజువారీగా 10 టన్నుల వ్యర్థాన్ని నిర్వహిస్తోంది. ►ఇది ఆహారం, కూరగాయ వ్యర్థాలను బయోగ్యాస్, విద్యుత్తుగా మారుస్తోంది. ► వీధి దీపాల దుకాణాలకు విద్యుత్తునందిస్తోంది ► గత కొన్ని నెలలుగా, 500 యూనిట్ల విద్యుత్తును వినియోగించడం జరుగుతోంది. ►120 వీధి దీపాలకు విద్యుత్తు ►170 దుకాణాలకు విద్యుత్తు ►శీతల గిడ్డంగి (కోల్డ్ స్టోరేజ్ యూనిట్)కి విద్యుత్తు. ఎల్పీజీ స్థానంలో.. ► గ్యాస్ హరిత విద్యుత్తు సేంద్రీయ ఎరువు వెచ్చదనం ► ప్లాంట్ వద్ద అదే వ్యర్థాలను ఉపయోగించి బయోగ్యాస్ను ఉత్పత్తి చేయడం జరుగుతోంది. ►ఇది మార్కెట్ క్యాంటీన్లో ఉపయోగించే ఎల్పీజీ వంట గ్యాస్ స్థానాన్ని భర్తీ చేస్తోంది. ►ఈ క్యాంటీన్ రోజుకు 800 మందికి భోజనాలను వడ్డిస్తుంది. ఈ ప్లాంట్ ఎలా పనిచేస్తుంది? ► మార్కెట్ నుంచి వ్యర్థాల సేకరణ ►ప్లాంట్కు వాటిని తీసుకురావడం ► వ్యర్థాల మక్కించడం ► ఫీడ్ తయారీ ట్యాంక్లో నానబెట్టడం ► ముద్దగా మార్చడం ►ఏరోబిక్ బయో మీథనేషన్ ప్రక్రియకు గురికావడం ► ప్రత్యేక ట్యాంకుల్లో బయోగ్యాస్ సేకరణ ►బయోగ్యాస్ను వంటగదికి పంపడం ►బయో ఇంధనం 100% బయోగ్యాస్ జనరేటర్లోకి సరఫరా చేయడం ► నీటి పంపునకు, శీతల గిడ్డంగులకు, వీధి దీపాలు, దుకాణాలకు కరెంట్ సరఫరా ► హైదరాబాద్ బోయిన్పల్లిలోని కూరగాయల మార్కెట్ తీసుకున్న చొరవను ప్రధాని నరేంద్ర మోడీ తన ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో ప్రశంసించారు. ► ‘హైదరాబాద్లోని బోయిన్పల్లిలోని కూరగాయల మార్కెట్ ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తోందో తెలుసుకుని ఆనందిస్తున్నాను’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ► సహజ వాయువుకు ప్రతిగా బయోగ్యాస్, అమెరికాలో సహజ వాయువు కన్నా బయోగ్యాస్ 5 రెట్లు అధిక ధర పలుకుతుంది. ► విద్యుత్తు డిమాండ్కు తగినంతగా వృథా లేనందున సహజ వాయువు స్థాయిని బయోగ్యాస్ భర్తీ చేయలేదు. కానీ ఇది వ్యర్థాలను తగ్గించడంలో తోడ్పడుతుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement