-
నకిలీ బయో కంపెనీలపై దర్యాప్తు
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: అనుమతి లేని బయో కంపెనీలపై దర్యాప్తు జరిపిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. నకిలీ బయో పెస్టిసైడ్స్తో రైతుల్ని నట్టేట ముంచుతున్న కంపెనీలపై వేటు తప్పదని హెచ్చరించారు. ఈ వ్యాపారం వెనకున్న వాళ్లు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. ’బయో మాయ’ శీర్షికన సాక్షి దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనంపై మంత్రి కన్నబాబు స్పందించారు. బయో ఉత్పత్తుల పేరిట కొన్ని సంస్థలు నకిలీలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల్లో కేసులు వేసి గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్న బయో పెస్టిసైడ్స్ తయారీ సంస్థలను కట్టడి చేస్తామన్నారు. ఈ వ్యవహారమై సీఎం జగన్ కూడా చాలా సీరియస్గా ఉన్నారన్నారు. పూర్తి వివరాలతో మంగళవారం మీడియాతో మాట్లాడతానని చెప్పారు. స్పందించిన అధికారులు.. ‘బయో మాయ’ కథనంపై అధికారులు స్పందించారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్కుమార్, వ్యవసాయ శాఖ జేడీ విజయభారతితో పాటు, ఏడీఏలు సమావేశమయ్యారు. నకిలీ బయోఉత్పత్తుల తయారీదారులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఐదు టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేసి ఎఫ్సీఓ యాక్ట్ అమలయ్యేలా చూడాలని చెప్పారు. కంపెనీ ప్రతినిధులు, డీలర్ల అసోసియేషన్లతో వెంటనే సమావేశం ఏర్పాటు చేసి ఎఫ్సీఓ యాక్ట్పై అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను కోరారు. వెంటనే డీలర్ల వద్ద ఉన్న నకిలీ బయోలను ఉత్పత్తిదారులకు తిప్పి పంపేలా నోటీసులు జారీ చేయాలన్నారు. నకిలీ బయో ఉత్పత్తులు అమ్మితే ఎఫ్సీఓ యాక్ట్ 1985 (ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం వ్యవసాయ అధికారులు ఏడీఏ హేమలత ఆధ్వర్యంలో గుంటూరు పట్నంబజారులో పురుగు మందుల షాపుల్లో తనిఖీలు చేశారు. విశ్వనాథ ట్రేడర్స్ లైసెన్సు పదిరోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేశారు. సదరు షాపులోని ఉత్పత్తుల నమూనాలను పరీక్షలకు తిరుపతిలోని రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్కు పంపినట్టు అధికారులు చెప్పారు. చట్టం కచ్చితంగా అమలు ఇప్పటివరకు జీవో నంబర్ ఎస్18, హైకోర్టు ఆదేశాల ప్రకారం బయో ప్రొడక్ట్స్ వ్యాపారం జరుగుతున్నట్టు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం నోటిఫికేషన్ ఎస్వో నంబర్ 882 (ఇ) ప్రకారం బయో ప్రొడక్ట్స్ అన్నింటినీ స్టిమ్యులెన్స్గా పేర్కొని.. అన్ని ప్రొడక్ట్స్ను ఫెర్టిలైజర్ (కంట్రోల్) ఆర్డర్–1985 పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు. బయో స్టిమ్యులెంట్స్ వ్యాపారం చేయదలచిన డీలర్లందరూ ఆ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని జేడీ తెలిపారు. -
వ్యవసాయశాఖలో 'బయో' వణుకు!
– ఆరుగురు అధికారులపై వేటు? – బయోలతో లింకులే కారణం – ఆధారాలతో సహా నివేదించిన విజిలెన్స్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: వ్యవసాయశాఖలో వణుకు మొదలయ్యింది. మొన్నటి వరకు బయో కంపెనీలతో చెట్టాపెట్టాలేసుకుని తిరిగి... రైతుల అమాయకత్వంతో వ్యాపారం చేసిన వ్యవసాయశాఖ అధికారులపై వేటు పడనుంది. ప్రధానంగా బయో కంపెనీలతో సంబంధాలతో పాటు ఏకంగా ఆ కంపెనీలల్లో వాటాదారులుగా ఉన్న జిల్లాలోని ఆరుగురు వ్యవసాయశాఖ అధికారులపై సస్పెన్షన్ వేటుపడనుంది. అంతేకాకుండా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధమయ్యింది. రైతులకు వ్యవసాయ సూచనలు ఇచ్చి, వారికి చేదోడుగా నిలవాల్సిన వ్యవసాయశాఖ అధికారులు కొద్ది మంది.. ఇందుకు భిన్నంగా పంటలను సర్వనాశనం చేసే బయో కంపెనీలకు అండగా నిలవడం ఇప్పుడు ఆ శాఖలో చర్చనీయాంశమయ్యింది. వీరందరిపై ఆధారాలతో కూడిన అభియోగాలు ఇప్పటికే వ్యవసాయశాఖకు చేరాయి. దీని ఆధారంగా వీరిపై వేటు పడనుంది. తమ పరిధిలో బయో వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండటమే కాకుండా ఎటువంటి తనిఖీలు వీరు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరుగురు వీరే...! బయో కంపెనీలతో ఆర్థిక సంబంధాలు నెరిపిన ఆరుగురు వ్యవసాయ అధికారులను ఇప్పటికే రాష్ట్ర విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇందుకు అనుగుణంగా ఏయే అధికారులు ఏయే బయో కంపెనీలతో సంబంధాలు నెరిపారనే అంశాలతో కూడిన నివేదికను వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు అందజేసినట్టు తెలిసింది. విజిలెన్స్ నివేదిక నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రధాన కార్యాలయం నుంచి కూడా మరో అధికారి వచ్చి విచారణ కూడా జరిపారు. ఈ నేపథ్యంలో సదరు ఆరుగురు వ్యవసాయశాఖ అధికారులపై త్వరలో వేటు పడనుంది. స్వయంగా వ్యవసాయశాఖ డైరెక్టర్ కూడా బయో కంపెనీలతో సంబంధాలు పెట్టుకుని నకిలీ పురుగు మందులతో రైతులను మోసం చేయడంతో పాటు...ఆ పంటను మనం కూడా తింటామన్న కనీస స్పృహ లేకుండా వ్యవహరించారని కొద్దిరోజుల క్రితం జరిగిన సమావేశంలో మండిపడ్డారు. ఇక్కడి అధికారులకు బయో కంపెనీలతో సంబంధాలు ఉన్నట్టు కూడా తేలిందని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో సదరు అధికారుల్లో వణుకు మొదలయ్యింది. వేటు పడనున్న వారిలో.... ప్రధాన నగరానికి సమీపంలోనే ఉండే మండల అధికారి ఉన్నారు. వేగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతున్న మండలానికి చెందిన వ్యవసాయ అధికారి. కర్నూలు నగరానికి 30–40 కిలోమీటర్ల పరిదిలో ఉండే మరో అధికారి. జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిజినెస్ సెంటర్లో పనిచేసే అధికారి. మరో ఇద్దరు ఈ వ్యవహారాల్లో పేరు మోసిన వారు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఈ ఆరుగురిపై త్వరలో వేటు పడనుంది. అయితే, తమపై వేటు పడకుండా పలువురు.. అధికార పార్టీ నేతలను కూడా కలిసి పైరవీలు చేసుకుని కాపాడమని కోరుతున్నట్టు తెలిసింది. ప్రధానంగా వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలతో సిఫార్సులు చేయిస్తున్నట్లు సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ
డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.
కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement