breaking news
Bike rallys
-
మోదీ పర్యటనపై నిరసన సెగలు
సాక్షి, విశాఖపట్నం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు, వామపక్షాలు కలసి శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించాయి. మోదీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ.. బైక్, సైకిల్పై ర్యాలీలు నిర్వహించారు. నల్ల దుస్తులు, నల్ల జెండలు ధరించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దొండపర్తి డీఆర్ఎమ్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాల్తేరు డివిజన్తో కూడిన రైల్వేజోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష నేతలు ర్యాలీ చేపట్టగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వామపక్ష రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణతో పాటు సీహెచ్ నర్సింగరావు, సత్యనారాయణ మూర్తి, విమల, మాధవి, ఈశ్వరమ్మతో పాటు వందలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు దేశ సరిహద్దులో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రధాని రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు. -
ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా ఉరవకొండలో భారీ బైక్ ర్యాలీ
-
ర్యాలీల సంస్కృతిని విడనాడదాం
-
మరో ఆడియో విడుదల చేసిన కొత్వాల్
సాక్షి, సిటీబ్యూరో : నగరవాసులతో పాటు రాకపోకలు సాగించే వారినీ ఇబ్బందులకు గురి చేస్తున్న బైక్ ర్యాలీల సంస్కృతిని విడనాడాలంటూ సీపీ అంజనీ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఓ ఆడియో విడుదల చేశారు. అందులో కొత్వాల్ చెప్పిన వివరాలివీ.అందమైన హైదరాబాద్ దేశంలోనే నాలుగో అతిపెద్ద నగరం. దాదాపు 80 లక్షల మందికి ఆశ్రయం కల్పిస్తున్న ఈ మహానగరం ఎప్పటికప్పుడు కొత్తగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఎందరో టూరిస్ట్లు, వ్యాపారులు బయటి ప్రాంతాల నుంచి నిత్యం వస్తున్నారు. కేవలం వీరే కాదు... స్థానికులు సైతం ఊరేగింపులు, ర్యాలీల వల్ల వారికి కలుగుతున్న ఇబ్బందులను నిత్యం నా దృష్టికి తీసుకువస్తున్నారు. వారంతా ప్రధానంగా మోటారు సైకిల్/బైక్ ర్యాలీల విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మిత్రులారా మనం క్రమంగా నగరంలో ఉన్న కొన్నింటిని అధిగమించే దిశగా అడుగులు వేద్దామా! అలాంటి బైక్ ర్యాలీలు, ఊరేగింపుల వల్ల సాధారణ ప్రజలు ప్రభావితం కాకుండా చూడాలి. ఎలాంటి బైక్ ర్యాలీలు చేయకుండా నిర్వాహకులను ఒప్పించడానికి, వారిలో అవగాహన పెంచడానికి కృషి చేయాల్సిందిగా సహచర అధికారులు, సిబ్బందిని కోరుతున్నా. సామాన్యులను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ బైక్ ర్యాలీల కోసం దరఖాస్తు కూడా చేయని విధంగా వారిలో మార్పు తీసుకురావాలి. నగరంలో జీవన ప్రమాణాల పెంచడానికి ఇది మనందరి కలిసి నిర్వర్తించాల్సిన బాధ్యత. నగరంలో ఉండే వారికి, పర్యటనలకు వచ్చే వారికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూద్దాం. అంతా కలిసి మన నగరాన్ని బైక్ ర్యాలీలు లేని విధంగా మార్చుకుందాం. దీన్ని సాకారం చేసుకుంటే కాలేజీలు, పాఠశాలలకు వెళ్ళే మీ పిల్లలు, వారి స్నేహితులతో పాటు ఆస్పత్రులకు వెళ్ళే రోగులు, వారి సంబంధీకులు ఎంతో ఉపశమనం పొందుతారు. ఈ చిన్న మార్పును సాకారం చేయడం ద్వారా మన నగరాన్ని రానున్న తరాలకు ఓ స్వర్గాధామంగా మార్చుకోవచ్చు. నగరాన్ని సుఖసంతోషాలతో నింపాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. -
సైకిల్ భారమై.. ప్రజా మద్దతు కరువై
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రత్యేక హోదా సాధన కోసమంటూ టీడీపీ నేతలు జిల్లాలో శనివారం చేపట్టిన సైకిల్ యాత్రలు మొక్కుబడిగా కొనసాగాయి. ప్రజలు నుంచి స్పందన కరువై హోదా నినాదం ఎక్కడా వినిపించ లేదు. కొన్ని నియోజకవర్గాల్లో కనీసం కార్యకర్తలు కూడా వెంట లేక పోవడంతో నేతలు తూతూమంత్రంగా చేపట్టారు. కొన్ని చోట్ల నేతలు సైకిల్ తొక్కలేక ఇబ్బంది పడ్డారు. మరి కొన్ని చోట్ల సైకిల్ కష్టమంటూ బైక్ ర్యాలీలు నిర్వహించారు. కర్నూలులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. వారి వెంట కార్యకర్తలు, ప్రజలు కనిపించలేదు. నందికొట్కూరు ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర జూపాడుబంగ్లా నుంచి పాములపాడు వరకు కొనసాగింది. నంద్యాలలో ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందారెడ్డి ఆధ్వర్యంలో కొత్తపల్లి నుంచి నంద్యాల వరకు, మంత్రి భూమా అఖిలప్రియ చాగలమర్రిలో సైకిల్ ర్యాలీ చేపట్టారు. బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లె నుంచి పసుపల వరకు బైక్ ర్యాలీ చేశారు. డోన్లో కేఈ ప్రతాప్ ఆధ్వర్యంలో అవులదొడ్డి నుంచి కామగానిగుండ్ల వరకు నాయకులు సైకిల్ తొక్కారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ఆధ్వర్యంలో సి. బెళగల్లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైకిల్ తొక్కేందుకు ఇతరుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. ఆత్మకూరు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వెలుగోడులో సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు.ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో సైకిల్ ర్యాలీ చేపట్టారు. కేఈ శ్యామ్బాబు ఆధ్వర్యంలో పులికొండ నుంచి పత్తికొండకు వరకు యాత్ర కొనసాగింది. పాణ్యంలో ఇన్చార్జి ఏరాసు ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. -
జజ్జెనకరి జనారే
తెలంగాణ ఆయారే.. ఊరూరా ఉద్యమకారుల సంబురాలు పల్లె పల్లెనా పండుగలా ఆనందోత్సాహాలు కదిలివచ్చిన పార్టీలు, వివిధ సంఘాల నేతలు ఉత్సాహంతో నృత్యాలు చేసిన ప్రజలు టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ సాక్షి, నెట్వర్క్: ఆత్మగౌరవం.. స్వయంపాలన కోసం.. ఆరుదశాబ్దాలపాటు తెలంగాణ ప్రజలు సాగించిన సుదీర్ఘపోరాటం ఫలించింది. ఉద్యమ పతాక ఉవ్వెత్తున లేచింది. తెలంగాణ గెలిచింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును మంగళవారం లోక్సభ ఆమోదించిన నేపథ్యంలో పది జిల్లాల్లో సంబురాలు అంబరాన్ని తాకాయి. ప్రజలంతా తెలంగాణ జెండాలు చేబూని స్వరాష్ట్ర ఏర్పాటును స్వాగ తించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీఆర్ఎల్డీ, ఎంఎస్పీ, వివిధ ఉద్యోగ, న్యాయవాద, ప్రజా సంఘాలు, తెలంగాణ ప్రజాఫ్రంట్, టీఎన్ఎస్, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. వరంగల్ జిల్లాకేంద్రంతోపాటు వర్ధన్నపేట, ములుగు, పరకాల, ఏటూరునాగారం, నర్సంపేట, మహబూబాద్, డోర్నకల్, తొర్రూరు, పాలకుర్తి, మరిపెడ సెంటర్లలో తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరి ఆనందోత్సాహంతో ఆలింగనాలు చేసుకున్నారు. హన్మకొండలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ కిషన్ ఉద్యోగులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ తెలంగాణచౌక్లో రహదారిపై టపాసులు కాల్చి, నృత్యాలు చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు జరిగాయి. బీజేపీ, సీపీఐ ఎంఎల్, బీఎస్పీ, ఎంబీటీ తదితర పార్టీలు ర్యాలీలు నిర్వహించాయి. న్యాయవాదులు, పలు శాఖల ఉద్యోగులు ఆనందోత్సవాలతో నృత్యాలు చేశారు. కలెక్టరేట్ ఉద్యోగులు మిఠాయిలు పంచుకున్నారు. మంచిర్యాల, కాగజ్నగర్, నిర్మల్,లక్షెట్టిపేట్, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఊట్నూర్, భైంసాలో ర్యాలీలు జరిగాయి. సింగరేణి బొగ్గు గనులపై కార్మికులు సంబరాలు జరుపుకొన్నారు. కరీంనగర్లో టీఆర్ఎస్ నాయకులు వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యాసంస్థలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. హుజూరాబాద్, రామగుండం, జగిత్యాల, హుస్నాబాద్, పెద్దపల్లి, చొప్పదండి, మానకొండూరు తదితర నియోజకవర్గాల్లో సంబరాలు జరుపుతూ.. మిఠాయిలు పంపిణీ చేశారు. నిజామాబాద్లో టీజేఎసీ ప్రతినిధులు, ఉద్యోగులు, యువకులు, విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, రహదారులపైకి చేరి జయజయధ్వానాలు చేశారు. టీ జేఏసీ ప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి, ఆర్మూరు, బోధన్, ఎల్లారెడ్డి, బాన్సువాడల్లో సంబురాలు జరిగాయి. ఖమ్మంలో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన, కుల సంఘాలు, మైనార్టీలు, కార్మికులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి సంబరం చేసుకున్నారు. నల్లగొండ జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. వివిధ పార్టీలు, ఉపాధ్యాయ, విద్యార్థి, ఉద్యోగసంఘాలు కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాయి. తెలంగాణ మలి ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పలువురు తెలంగాణవాదులు పాలాభిషేకం చేశారు. మహబూబ్నగర్లోని తెలంగాణ చౌరస్తాలో టీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు, జేఏసీ జిల్లా ఛైర్మన్ రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంచకుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఐఎంఎల్, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. షాద్నగర్, జడ్చర్ల, నాగర్కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, మక్తల్, నారాయణపేట, కొడంగల్, అలంపూర్, దేవరకద్ర, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో సంబురాలు జరుపుకొన్నారు. కేశంపేట మండలం పాటిగడ్డతండాకు చెందిన కవి, గాయకుడు పాపగంటి శేఖర్ (28) షాద్నగర్ విజయోత్సవ ర్యాలీలో గుండెపోటుతో మృతి చెందాడు. మెదక్ జిల్లాలో తెలంగాణవాదుల సంబరాలు అంబరాన్నంటాయి. ఉద్యమ పురిటిగడ్డలో విజయోత్సవ వేడుకలు హోరెత్తాయి. జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులు, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీ జేఏసీ, సీపీఐ, కొన్నిచోట్ల టీడీపీ నాయకులు వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకొన్నారు. సంగారెడ్డిలో అమరవీరుల స్థూపానికి క్షీరాభిషేకం చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సంబరాలు మిన్నం టాయి. పరిగి, తాండూరు, చేవెళ్ల, శంషాబాద్, తాండూరు, వికారాబాద్, మేడ్చల్, ఇబ్రహీంపట్నంలో తెలంగాణ వాదులు సంబరాలు చేసుకున్నారు. రంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ నాన్గెజిటెడ్ ఉద్యోగులు, మండలాల్లో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. హైదరాబాద్లోని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీభవన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీల నేతలు, కార్యకర్తలు వేడుకల్లో మునిగితేలగా... సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఓయూలో 25న పూర్తిస్థాయిలో విజయోత్సవాలు నిర్వహిస్తామని టీఎస్ జేఏసీ ప్రకటించింది. తెలంగాణ భవన్లో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నేతలు బాజాభజంత్రీల మధ్య నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ తెస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకున్నామని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించింది. బిల్లు ఆమోదం పొందిన అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. జంట నగరాల పరిధిలోని అన్ని కోర్టులతోపాటు రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. ఆశయం నెరవేరింది తెలంగాణ బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేయడంతో తెలంగాణ మలిఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్చారితోపాటు వెయ్యి మంది అమరవీరుల ఆశయం నెరవేరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమవుతున్న వేళ శ్రీకాంత్చారి తల్లిదండ్రులుగా ఎంతో సంతృప్తి చెందుతున్నాం. మలి ఉద్యమానికి మా కొడుకు త్యాగం ఎంతో స్ఫూర్తినిచ్చింది. లక్ష బాధలు పడి తెలంగాణ లక్ష్యాన్ని కేసీఆర్ సాధించారు. రాష్ట్ర సాధనకోసం లెక్కలేని అభాండాలు, అపనిందలు తనపై మోపినా కేసీఆర్ భరించారు. తెలంగాణ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఇప్పటికైనా సీమాంధ్రులు ఉద్యమాన్ని విరమించుకోవాలి. ఎలాంటి ఆటంకాలు లేకుండా హైదరాబాద్లో కలిసిమెలిసి బతకవచ్చు. - శ్రీకాంత్చారి తల్లిదండ్రులు శంకరమ్మ-వెంకటాచారి అమరుల త్యాగఫలితం ‘తెలంగాణ కోసం నా భర్త (కానిస్టేబుల్ కిష్టయ్య) తన జీవితాన్నే త్యాగం చేశారు. ఆయన లేకపోవడం మాకు ఎంతో నష్టం. ఆ బాధ ఉన్నా రాష్ట్రం రావడం ఆనందం కలిగిస్తోందన్నారు. ఆయనతోపాటు ఎందరో అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం. ఆయన స్వప్నం నెరవేరడం సంతోషం. సోనియమ్మకు కృతజ్ఞతలు. తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకోవాలి’ - కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మ అన్యాయం తొలగిపోయింది సీమాంధ్ర నాయకులు ఏళ్లసంది దోచుకున్నరు, ఇప్పటికైనా తెలంగాణ ఇవ్వడం సంతోషం... మా గ్రామానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటనకు వచ్చినప్పుడు ఏం కావాలని నన్ను అడిగితే.. తెలంగాణ కావాలని చెప్పిన. అప్పుడు ఆయన తెల్లమొహం పెట్టుకొని పోయిండు. నేను అప్పుడు అట్ల అడిగినందుకు యువకులకు స్పూర్తిని ఇచ్చినట్టయింది. ఇప్పడు తెలంగాణ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. మా ఉద్యోగాలు, మా నీళ్లు మాకు దక్కుతాయి. సీమాంధ్రులు ఇప్పటికైనా ఆందోళన విరమించుకుంటే మంచిగుంటది.-న్యూస్లైన్,రాయపర్తి - తెలంగాణ వాది పనికర మల్లయ్య, రాయపర్తి, వరంగల్ జిల్లా -
నిరసన జ్వాల
సాక్షి, నెల్లూరు: విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్జీఓలు చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో మంగళవారంతో ఆరో రోజుకు చేరింది. ఎన్జీఓలు, సమైక్యవాదులు జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, మోటారు బైక్ ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. రాష్ట్ర విభజనకు పూనుకుంటే సీమాంధ్రలో కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవన్నారు. సమైక్యాంధ్ర సాధించేవరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. పాణ త్యాగాలకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనలు తెలిపారు. ఎన్జీఓల దీక్షలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. నెల్లూరు నగరంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగులు ఎన్జీఓ భవన్ నుంచి మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా థియేటర్లను మూయించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్సీ కూడలిలో విద్యార్థులు యూపీఏ దిష్టి బొమ్మను దహనం చేశారు. కావలిలోఎన్జీఓ నేతలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. పొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్ ట్రంకురోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో వాహనాల రాక పోకలకు అంతరాయం కలిగింది. వాకాడులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక అశోక్స్తంభం సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. దీంతో రాకపోకలు స్తంభించాయి. వెంకటగిరిలో సమైక్యాంధ్రకు మద్దతుగా, జయప్రకాష్ నారాయణపై తెలంగాణ వాదులు దాడిని నిరసిస్తూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం నుంచి పట్టణ వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు.