breaking news
bike crashes
-
ప్రమాదమే కాపాడింది.. అసలేం జరిగిందంటే..
ధార్వాడ్: కర్ణాటకలోని ధార్వాడ్లో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్ కలకలం రేపింది. బైక్ ప్రమాదానికి గురవ్వడంతో నిందితుడు పట్టుబడగా.. చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. ధార్వాడ్లోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మూడో తరగతి చదువుతున్న తన్వీర్ దొడ్మని, లక్ష్మి కరియప్పనవర్ అనే ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు.విరామం తర్వాత పిల్లలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. వారు కిడ్నాప్కు గురయ్యారని అనుమానించారు. దీంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ఓ వ్యక్తి ఆ పిల్లలిద్దరినీ బైక్పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. నిందితుడిని కరీం మేస్త్రీగా గుర్తించారు.పిల్లలను తీసుకుని వెళ్తున్న క్రమంలో నిందితుడు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాద సమాచారం అందుకున్న దండేలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ గాయపడిన వ్యక్తితో పాటు ఇద్దరు పిల్లలు ఉండటాన్ని గమనించారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి.. తాను పిల్లలను "ఉలవి చెన్నబసవేశ్వర జాతరకు తీసుకువెళ్తున్నట్లు పోలీసులకు చెప్పాడు. అయితే కిడ్నాప్ ఉద్దేశంతోనే వారిని తీసుకువెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారులను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన నిందితుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పలు కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
అమానవీయం: రక్తపు మడుగులో ఫిల్మ్మేకర్.. ఫోన్, కెమెరా దొంగతనం
ఢిల్లీ: సమాజంలో మానవీయ విలువలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సాటి మనిషికి చేయందించలేని దుస్థితికి చేరుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే దేశ రాజధానిలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి ఎవరూ సాయం చేయలేదు. సాహాయం చేయకపోగా బాధితుని ఫోన్, కెమెరాను ఎత్తుకుపోయారు. పీయూష్ పాల్ గురుగ్రామ్లో ఫిల్మ్మేకర్గా పనిచేస్తున్నాడు. దక్షిణ ఢిల్లీలోని పంచశీల్ ఎన్క్లేవ్ సమీపంలో రాత్రి 10 గంటలకు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పీయూష్ బైక్ను సిగ్నల్ వద్ద వెనక నుంచి వేగంగా వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. దీంతో బైక్ ఆయన్ని కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకుంటూ పోయింది. ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లడంలో జాప్యం జరిగినందునే పీయూష్ మృతి చెందాడని అతని స్నేహితులు చెబుతున్నారు. రక్తపు మడుగులో పడిన 20 నిమిషాల పాటు ఎవరూ రక్షించలేదని చెప్పారు. అంతేకాకుండా కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితుని ఫొటోలు, వీడియోలు తీశారని మండిపడ్డారు. తన స్నేహితుని వద్ద ఉన్న మొబైల్ ఫోన్, గో-ప్రో కెమెరాను దొంగిలించారని చెబుతున్నారు వాళ్లు. రాత్రి 10 వరకు ఫోన్ మోగిందని, ఆ తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చిందని పోలీసులకు తెలిపారు. తమకు న్యాయం జరగాలని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదీ చదవండి: ప్రమాదక స్థాయిలో ఢిల్లీ వాయు కాలుష్యం.. 616 పాయింట్లకు చేరిన గాలి నాణ్యాతా సూచీ -
డీసీఎం, బైక్ ఢీ..ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
హైదరాబాద్: డీసీఎం-బైక్ ఢీకొని ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు. వరంగల్ జిల్లా మహబూబాబాద్కు చెందిన అనిల్(25) హైదరాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతడు మంగళవారం బోయిన్ పల్లి నుంచి కళాశాలకు బైక్పై వెళ్తుండగా చింతల్ ఐడీపీఎల్ చౌరస్తా సమీపంలో డీసీఎం వెనుకవైపు ఢీకొట్టింది. దీంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చింతల్)


