breaking news
bike-auto collisioned
-
కలెక్టర్ సాయం చేసినా.. ప్రాణాలు నిలువలేదు!
రామాయంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఒక యువకుడిని సమయానికి ఎవరూ ఆదుకోలేదు. అటుగా వచ్చిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా క్షతగాత్రుడిని తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మార్గం మధ్యలోనే ఆ యువకుడు ప్రాణాలొదిలాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శివారులో చోటు చేసుకుంది. హైదరాబాద్లోని మెడ్లీ ఫార్మసీలో ఏరియా మేనేజర్లుగా పనిచేస్తున్న రామకృష్ణ భరద్వాజ్, గంగల్ల నరేశ్కుమార్ లు బైక్పై కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. రామాయంపేట పట్టణ శివారులో వీరు వెళ్తున్న బైక్ ముందు వెళ్తున్న ఆటో వెనుక భాగాన్ని తాకి అదుపుత్పి పడిపోయింది. బైక్పై ఉన్న ఇద్దరూ కింద పడిపోయారు. వీరిలో రామకృష్ణ భరద్వాజ్ (30)కు తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో 108 రాకపోవడంతో నరేశ్కుమార్ రోడ్డుకు అడ్డంగా నిలబడి చాలా మందిని సాయం కోరాడు. కానీ, ఎవరూ స్పందించడం లేదు. ఆ సమయంలో అదే దారిలో కారులో హైదరాబాద్ వెళ్తున్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా తన కారులో క్షతగాత్రుడిని ఎక్కించుకుని నార్సింగిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. -
బైక్ను ఢీకొన్న ఆటో.. ముగ్గురికి గాయాలు
తలుపుల: అనంతపురం జిల్లా తలుపుల మండలం కొరుగుడ్డుపల్లి వద్ద ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కదిరి వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొంది. ఆటో డ్రైవర్ వన్నం రాజ, ద్విచక్ర వాహనంపై వెళ్తోన్న చౌడప్ప, శ్రీనివాస్ గాయపడ్డారు. ముగ్గురినీ కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో చౌడప్ప పరిస్థితి విషమంగా ఉంది.