-
బీఈఎల్- భారతీ ఇన్ఫ్రాటెల్.. భల్లేభల్లే
ముంబై, సాక్షి: తొలుత హుషారుగా ప్రారంభమైనప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. అయితే సానుకూల వార్తల కారణంగా ఓవైపు పీఎస్యూ దిగ్గజం భారత్ ఎలక్ట్రానిక్స్(బీఈఎల్), మరోపక్క టెలికం టవర్ల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) క్యూ2లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ పూర్తి ఏడాదిలో ఆకర్షణీయ పనితీరు చూపే వీలున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్ ఎలక్ట్రానిక్స్ తాజాగా తెలియజేసింది. ఎల్సీఏ, ఆకాష్ వెపన్ సిస్టమ్, స్మార్ట్ సిటీ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ తదితరాల నుంచి రూ. 15,000 కోట్ల విలువైన ఆర్డర్లను ఆశిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఆదాయంలో రెండంకెల వృద్ధిని అందుకోగలమని అంచనా వేసింది. అంతేకాకుండా 20-21 శాతం స్థాయిలో ఇబిటా మార్జిన్లు సాధించగలమని అభిప్రాయపడింది. దీంతో వరుసగా రెండో రోజు ఈ కౌంటర్కు డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బీఈఎల్ షేరు 6 శాతం జంప్చేసి రూ. 109 వద్ద ట్రేడవుతోంది. వెరసి రెండు రోజుల్లో 13 శాతం లాభపడినట్లయ్యింది. క్యూ2లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 443 కోట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. భారతీ ఇన్ఫ్రాటెల్ టెలికం మౌలిక సదుపాయాల కంపెనీ ఇండస్ టవర్స్తో విజయవంతంగా విలీనాన్ని పూర్తిచేసుకున్నట్లు భారతీ ఇన్ఫ్రాటెల్ పేర్కొంది. తద్వారా ఇండస్ టవర్స్ కంపెనీ పేరుతో అతిపెద్ద టవర్ల కంపెనీగా ఆవిర్భవించింది. ఈ సంయుక్త సంస్థలో మాతృ సంస్థ భారతీ ఎయిర్టెల్కు 36.73 శాతం వాటా లభించగా.. వొడాఫోన్ గ్రూప్ 28.2 శాతం వాటాను పొందింది. ప్రావిడెన్స్కు సైతం 3.25 శాతం వాటా దక్కింది. ఈ నేపథ్యంలో భారతీ ఇన్ఫ్రాటెల్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 13 శాతం దూసుకెళ్లి రూ. 210 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 214 వరకూ ఎగసింది. నేటి ట్రేడింగ్ తొలి గంటలోనే (బీఎస్ఈ, ఎన్ఎస్ఈ) ఈ కౌంటర్లో 10 మిలియన్ షేర్లు చేతులు మారడం గమనార్హం! -
ఉద్యోగాలు
టీసీఐఎల్ న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా కాంట్రాక్ట్ పద్ధతిలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టుల సంఖ్య: 3 అర్హతలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీఈ/ బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 17 వెబ్సైట్: ఠీఠీఠీ.్టఛిజీజీఛీజ్చీ.ఛిౌఝ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూర్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీర్ ఖాళీలు: 13 వయసు: 28 ఏళ్లకు మించకూడదు. అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 22 వెబ్సైట్: www.bel-india.com స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ పద్ధతిలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: సీఏ/ పీజీ డిప్లొమా ఇన్ కంపెనీ సెక్రటరీ లేదా ఏదైనా పీజీ ఉండాలి. 15 ఏళ్ల అనుభవం అవసరం. వయసు: 40 - 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 22 వెబ్సైట్: www.sbi.co.in
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement