-
తడిసి ముద్దయిన బెజవాడ
సాక్షి, విజయవాడ: అరగంట పాటు ఆగకుండా కురిసిన వర్షానికి విజయవాడ తడిసి ముద్దయింది .ప్రధాన రహదారులు జలమయమయ్యాయి .చిన్నపాటి చెరువులను తలపించాయి. కొద్దిపాటి వర్షానికే నగరంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రహదారులు జలమయం కాగా, ప్రధాన కూడళ్లు చెరువులను తలపించాయి. డ్రైనేజీ వాటర్తో కలిసి వర్షపు నీరు రోడ్లపైకి వచ్చేయటంతో వాహన చోదకులు ,పాదచారులు నానా అవస్థలు పడ్డారు. సైలెన్సర్లు నీట మునగటంతో ద్విచక్ర వాహనాలు ముందుకు కదిలేందుకు మొరాయించాయి. ఇక డ్రైనేజ్ నీళ్లు, వర్షం నీటితో కలిపి రోడ్లపైకి వచ్చేయడంతో దుర్గంధం వెలువడుతోంది. దీంతో పాదచారులు ఇబ్బందులు పడ్డారు. కృష్ణా, గుంటూరులో భారీ వర్షం ఇక కృష్ణాజిల్లా గన్నవరం, నందిగామలో భారీ వర్షం పడింది. రోడ్లన్నీ జలమయం కావడంతో డ్రైనేజ్లు పొంగి పొర్లుతున్నాయి. వర్షపు నీటితో పల్లపు ప్రాంతాలో చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. అలాగే గుంటూరు జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. రహదారులు అన్ని జలమయం అయ్యాయి. -
బెజవాడ ట్రాఫిక్కు విముక్తి!
బెజవాడ నగరంలో పద్మవ్యూహంలా మారిన ట్రాఫిక్కు విముక్తి లభించబోతోంది. ఇరుకు రోడ్లు, వెల్లువెత్తుతున్న వాహనాల రద్దీతో విజయవాడ ట్రాఫిక్ రోజురోజుకూ నరకంలా మారింది. ప్రధానమైన జంక్షన్లలో నిత్యం ట్రాఫిక్తో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. దీన్ని ఛేదించడానికి నగర పోలీసులు నిత్యం నానా తంటాలు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి పోలీసు అధికారులు సాంకేతిక సాయం తీసుకోబోతున్నారు. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్) ప్రాజెక్ట్ ద్వారా ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చేయబోతున్నారు. సాక్షి, అమరావతి : విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాత సిగ్నలింగ్ వ్యవస్థ బదులు ప్రయోగాత్మకంగా 17 కూడళ్లలో ఏటీసీఎస్ (అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్) ను ఏర్పాటు చేయనున్నారు. నగరంలో దాదాపు 180 కూడళ్లు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా తొలి దశలో ప్రకాశం బ్యారేజీ నుంచి బెంజి సర్కిల్ వరకు వారధి నుంచి ఎయిర్పోర్టు వరకు వినాయక టెంపుల్, గద్ద బొమ్మ, ప్రకాశం విగ్రహం, ఓల్డ్ బస్టాండ్, బందర్ లాకులు, గోల్డెన్ పెవిలియన్, రాఘవయ్య పార్క్, రాజ్భవన్, స్టేట్ గెస్ట్ హౌస్, డీసీపీ బంగ్లా, ఆర్టీఏ సర్కిల్తోపాటు బాలాజీ నగర్, స్క్రూ బ్రిడ్జి, బెంజి సర్కిల్, రామవరప్పాడు రింగ్ రోడ్, న్యూ ఆటోనగర్ కూడళ్లను ఏటీసీఎస్కు అనుసంధానం చేస్తారు. ఆయా కూడళ్లలో వాహన చోదకులు తరచూ ఇబ్బందులు పడుతున్నారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు తక్కువ సమయంలో నలువైపులా వాహనాలు వేగంగా వెళ్లేలా చర్యలు చేపట్టనున్నారు. సమీకృత ఇంటెలిజెంట్ సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా అన్ని సిగ్నళ్లను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తారు. ఇవి కేంద్రీకృత నియంత్రిత విధానం ద్వారా పని చేస్తాయి. వీటికి ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఇవి వాహనాలను లెక్కించి, వాటిని వర్గీకరించి సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి పంపిస్తాయి. వాహనాల రద్దీని బట్టి సిగ్నల్ పడుతుంది. ఎక్కువ వాహనాలు ఉండే మార్గంలో ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి అధిక సమయం ఆకుపచ్చ లైట్ వస్తుంది. సిగ్నలింగ్ వ్యవస్థ అంతా సౌరశక్తితో పని చేస్తుంది. ఇక నిరీక్షణ ఉండదు!.. పోలీస్ కంట్రోల్ రూం నుంచి బెంజి సర్కిల్ వరకు దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుంది. పాత పద్ధతిలో సిగ్నల్స్ ఒకదానితో మరొకటి సంబంధం లేదు. దీనివల్ల ఈ కొద్ది దూరానికే ఒక్కొక్క సిగ్నల్ వద్ద చాలా సమయం నిరీక్షించాల్సి వస్తోంది. కొత్త వ్యవస్థ వస్తే ఎక్కడా ఆగాల్సిన పని లేదు. అత్యవసర వాహనాలకు ప్రత్యేక ట్యాగ్లు బిగిస్తారు. ఈ వాహనాలు వచ్చే సమయంలో ఆ మార్గంలో అకుపచ్చ లైట్లు వెలుగుతాయి. సిగ్నళ్ల స్తంభాలకు బిగించిన కెమెరాలు వాహనాల నెంబరు ప్లేట్లను గుర్తిస్తాయి. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే నేరుగా చలానా జారీ అవుతుంది. వీటికి సెన్సార్లు ఉంటాయి. అలాగే ముఖ్యమైన కూడళ్లలో పబ్లిక్ అడ్రస్ సిస్టం ఉంటుంది. ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. వీటిపై ట్రాఫిక్ నిబంధనలు, ముఖ్యమైన సూచనలు, వాతావరణం, తదితర వివరాలు వస్తుంటాయి. అత్యవసర వాహనాలకు గ్రీన్ సిగ్నల్.. ఈవీపీ (ఎమర్జెన్సీ వెహికల్ ప్రయార్టీ) : ఇప్పటి వరకు అత్యవసర సమయాలు, అంబులెన్స్లు వెళ్లేటప్పుడు, వీవీఐపీల రాకపోకల సమయంలో మాన్యువల్ విధానాన్ని ట్రాఫిక్ పోలీసులు పాటించేవారు. ఆయా వాహనాల రాకపోకల సమయాల సమాచారం తెలియగానే... ట్రాఫిక్ కానిస్టేబుల్ టైమర్లను నిలిపిసేవారు. ఆ తర్వాత మాన్యువల్ పద్ధతిలో రాకపోకలను నియంత్రించేవారు. ఈవీపీ పద్ధతిలో ఇకపై మాన్యువల్ విధానం అవసరం ఉండబోదు. అంబులెన్స్, ఫైర్ ఇంజిన్స్ వస్తున్న సమయంలో ఆ మార్గంలో ఆకుపచ్చ లైట్లు వెలుగుతాయి. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.. విజయవాడ నగర ట్రాఫిక్ సమస్యకు ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమే సరైన పరిష్కారం. ఈ ప్రాజెక్టు పూ ర్తిస్థాయిలో అమల్లోకి వస్తే ప్రజలకు ఎం తో మేలు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు సా కారం కావడానికి చాలా కష్టపడ్డాం. త్వరలో పనులు ప్రారంభం అవుతాయి. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ఏటీసీ ఎస్ సిగ్నలింగ్ వ్యవస్థను అమలు చేస్తాం. – సీహెచ్ ద్వారకా తిరుమలరావు, పోలీసు కమిషనరు, విజయవాడ -
బెంబేలెత్తిన బెజవాడ వాసులు..
►ట్రాఫిక్ జామ్తో స్తంభించిన బెజవాడ రోడ్లు ►దాదాపు మూడు గంటల నుంచి రోడ్లపైనే నిలిచిన వాహనాలు ►నగరమంతా అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్ సాక్షి, విజయవాడ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపుతో బెజవాడ ప్రజలు పట్టపగలే చుక్కలు చూశారు. అసలే ఇరుకు రోడ్లు. ఆపై చిన్నచిన్న వీధుల్లోకి ట్రాఫిక్ మళ్లింపులతో శనివారం సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలం కావడంతో నగర వాసులను ట్రాఫిక్ బేజారెత్తించింది. బందర్ రోడ్డుకు కనెక్ట్ అయ్యే కృష్ణలంక రోడ్ పూర్తిగా జామైపోయింది. దాంతో రెండు గంటలపాటు వందల వాహనాలు నిలిచిపోయాయి. అధికార యంత్రాంగం చేతులెత్తేయడంతో విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్ళాల్సిన ఉద్యోగులు, ఆసుపత్రులకు వెళ్ళాల్సిన రోగులు నానా అవస్ధలు పడ్డారు. ప్రభుత్వం ముందు చూపు లేకుండా కార్యక్రమాలను నిర్వహిస్తూ తమను కష్టాల పాలు చేస్తోందని పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఎన్ని గంటలు ఇలా రోడ్లపై వుండాలంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి నుంచే ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమాన్ని చేపట్టిన పోలీసులు వాహనాలకు సరైన రీతిలో ప్రత్యామ్నాయం చూపకపోవడంతో అనేక చోట్ల ట్రాఫిక్ అస్తవ్యస్థంగా తయారైంది. విజయవాడ బయట కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇక గన్నవరం నుంచి వెలగపూడి వరకు 23కిలో మీటర్ల మేర పూర్తిగా ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. అలాగే రామలింగేశ్వర నగర్, కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాల నుంచి రావాలంటే బందర్ రోడ్ మీదుగానే రావాల్సి వుంటుంది. అయితే బందర్ రోడ్తో వున్న అన్ని కనెక్టింగ్ రోడ్లను పోలీసులు మూసివేశారు. ఫలితంగా వేలాది వాహనాలు కృష్ణ లంక వైపు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. మరోవైపు హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాహనాలను సత్తుపల్లి మీదుగా, విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్, గుడివాడల మీదుగా, హైదరాబాద్నుంచి బందరు వెళ్లే వాహనాలు..నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లించారు. అలాగే మచిలీపట్నంనుంచి చెన్నై వెళ్లే వాహనాలను..పామర్రు, చల్లపల్లి మీదుగా మళ్లించారు. ఉప రాష్ట్రపతి పర్యటన, వాహనాలు మళ్లింపు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
Advertisement