ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి మృతి
తిరుమల: తిరుమల రెండో ఘాట్రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి చెందింది. బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎలుగుబంటి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అటవీ కార్యాలయానికి తరలించారు.