-
పుర్రె గుర్తుపై స్పందించడం లేదేంటి?
ఎంపీ కవితపై మధుయాష్కీ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: బీడీ కట్టలపై పుర్రె గుర్తు పరిమాణాన్ని తగ్గించడానికి పార్లమెంటులో ప్రయత్నాలేమీ చేయకుండా కార్మికులను మోసం చేయడానికి ఎంపీ కవిత ప్రయత్నిస్తున్నారని మాజీ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ ఆరోపించారు. గాంధీభవన్లో గురువారం ఆయన మాట్లాడుతూ బీడీ కట్టలపై పుర్రె గుర్తును తొలగించడానికి, సైజును తగ్గించడానికి కవిత చేసిన ప్రయత్నాలేమిటో ప్రజలకు చెప్పాలన్నారు. పార్లమెంటులో దీనిపై ఏమీ మాట్లాడకుండా, రాష్ట్రంలో మాత్రం అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రధాని మోదీని కలిసి దీనిపై మాట్లాడాలని సూచించారు. -
బీడీ ఇవ్వలేదని చంపేశారు!
థానే: బీడీని కలసి తాగడానికి నిరాకరించిన ఓ టీనేజర్ను ఇద్దరు టీనేజర్లు తీవ్రంగా కొట్టి చంపారు. ఈ ఉదంతం మహారాష్ట్ర థానేలోని శాంతినగర్లో సోమవారం జరిగింది. అన్సారీ(17) పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్తుండగా 16 ఏళ్ల వయసున్న ఇద్దరు మైనర్లు అడ్డుకుని అతడు తాగుతున్న బీడిని అడిగారు. బిలాల్ ఒప్పుకోకపోవడంతో అతణ్ని కొట్టి చంపారు. నిందితులను అరెస్టు చేసి హత్యాభియోగాలు మోపి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. -
ఆదరణ తగ్గినా..అదే పని!
ఇప్పటికీ 80శాతం కుటుంబాలకు బీడీలే జీవనాధారం కుటుంబ పోషణకు కొండంత అండ పరిశ్రమల మూతతో ఆందోళనలో మహిళలు కాశిబుగ్గ : సిరిసిల్లకు చేనేత పరిశ్రమ ఎలానో .. వరంగల్కు బీడీ కార్ఖానాలు అంత. వరంగల్ తూర్పు పరిధిలో ఏ ఇంట చూసినా మహిళలు బీడీలు చుడుతూ కనిపిస్తారు. కాశిబుగ్గ, చార్బౌళి, గిర్మాజీపేట, కరీమాబాద్, రంగశాయిపేట, ఖిలావరంగల్, పుప్పాలగుట్ట, లేబర్కాలనీ ప్రాంతాలలో బీడీలు చుట్టడం రాని మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒక్క కాశిబుగ్గ పరిధిలోనే దాదాపు ఎనిమిది బీడీ పరిశ్రమలు ఉండడం గమనార్హం. అయితే క్రమంగా పరిశ్రమలు మూత పడుతుండడంతో మహిళలకు ఉపాధి కరువవుతోంది. ఒకప్పుడు తూర్పు పరిధిలో 12 కార్ఖానాలు ఉంటే ప్రస్తుతం రెండు మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. 80శాతం కుటుంబాలు బీడీ పరిశ్రమ పైనే ఆధారపడి జీవించేవి. ప్రస్తుతం పరిశ్రమలు మూతపడినా ఉన్నవాటి పైనే ఆధారపడి బతుకులు వెళ్లదీస్తున్నాయి. అండగా నిలిచిన పరిశ్రమలు వరంగల్ తూర్పు పరిధిలో కూలినాలి చేసుకునే వాళ్లే ఎక్కువ. భర్త పనికి వెళ్లాక, ఇంట్లో పనులు పూర్తయ్యాక మహిళలు ఇంటి వద్దనే బీడీలు చుడుతూ కుటుంబ పోషణలో వేన్నీళ్లకు చన్నీళ్లలా ఉండేవారు. ఇంటిల్లిపాదీ బీడీలు చుడుతూ ఎప్పుడూ కళకళలాడేవి. ప్రస్తుతం బీడీ పరిశ్రమలు చాలావరకు మూతపడడం, బీడీల వాడకం తగ్గిపోవడంతో ఒకటిరెండు కార్ఖానాలు మాత్రమే మిగిలాయి. అయితే మహిళలు మాత్రం బీడీలు చుట్టడం మాత్రం మానలేదు. ఒకప్పుడు ఇంట్లోని ప్రతి ఒక్కరు బీడీలు చుడితే ప్రస్తుతం ఒకరు మాత్రమే ఆ పనిలో ఉంటున్నారు. వచ్చిన పనిని మర్చిపోలేక, మరో పనిలేక దీనిని వదులుకోలేకపోతున్నారు. కొంతమంది మహిళలు మాత్రం ప్రత్యామ్నాయంగా కూలి పనులకు వెళ్తున్నారు. పాత పని మర్చిపోలేక.. నేను 35 సంవత్సరాల నుంచి బీడీలు చుడుతున్నాను. ఒకప్పుడు బీడీల మీద మంచి ఆదాయం వచ్చేది. ఇప్పుడు బీడీలు చుట్టినా కార్ఖానాలు తగ్గిపోవడంతో తీసుకోవడం లేదు. పాత పని మరువలేక.. కొద్దో గొప్పో ఆసరాగా ఉంటుందని అదే పనిచేస్తున్నా. - దిడ్డి సుశీల, బీడీ కార్మికురాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి మాకు బీడీలే జీవనాధారం.. దీని మీదనే కొద్దో గొప్పో ఆదాయం వస్తే ఇల్లు గడిచేది. ఇప్పుడు బీడీలు అంటే ఈసడించుకుంటాళ్లు. ప్రభుత్వం మాకు ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి. మహిళలు ఇంటి వద్ద పనిచేసుకునే విధంగా ఉపాధి కల్పించాలి. -చంద్రకళ ఆదాయం తగ్గుతోంది ఒకప్పుడు నెలకు రూ.రెండు, మూడు వేలకుపైగా సంపాదించేదాన్ని. ఇప్పుడు బీడీలు చుడితే రూ.వెయ్యి మాత్రమే వస్తున్నాయి. కార్ఖానాలు బంద్ అయినయ్. మాకు ఉపాధి దొరకడం లేదు. - ఆడెపు సుజాత ఈ పని నడవడం కష్టమే.. ఒకప్పుడు బీడీలు తాగేటోళ్లు బాగా ఉండేటోళ్లు. చక్కెర బీడీలకు బాగా గిరాకీ ఉండేది. ఇప్పుడు బీడీలు ఎవరూ తాగడం లేదు. మరో ఐదు సంవత్సరాల తరువాత ఈ పని నడవడం కష్టమే. - ఆర్ల లలిత -
సమస్యలు పరిష్కరిస్తా..
సెలైన్స్.. సెలైన్స్ అంటూ అసెంబ్లీని కొనసాగించే స్పీకర్ మధుసూదనాచారి ఆదివారం సాయంత్రం అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు శాయంపేట మండలంలో ‘సాక్షి’ రిపోర్టర్గా మారారు. చలివాగు రిజర్వాయర్ వద్ద మత్స్యకారులు, బీడీ, చేనేత కార్మికులు, గ్రామస్తులతో సుమారు రెండు గంటల పాటు ముచ్చటించి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. రాడికల్ విద్యార్థి నేత నుంచి రాజకీయాల్లోకి.. నిరుపేద కుటుంబంలో పుట్టినా.. రాడికల్స్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ఎస్యూ)లో పని చేశాను. రోజు ‘సాక్షి’ దిన పత్రిక చూస్తా. అందులో ప్రచురితం అయ్యే ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. శాయంపేట మండల కేంద్రంలో మోడల్ స్కూల్, 30 పడకల ఆస్పత్రి, జోగంపల్లి, రాజుపల్లిల్లో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. మత్స్యకారులు, బీడీ, చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. - మధుసూదనాచారి, స్పీకర్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టింగ్లో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి : ఏం తమ్మి బాగున్నావా? చలివాగు రిజర్వాయర్ మత్స్యకారులతో కళకళలాడుతోందా? అయిరబోయిన బిక్షపతి, మత్స్య పారిశ్రామిక సంఘం చైర్మన్, పెద్దకోడెపాక : సర్కారు ఇచ్చిన చేపలను ఈ రోజు చెరువులో పోస్తున్నాం సార్. అందుకే మా వాళ్లు అందరూ వచ్చారు. స్పీకర్ : సరే.. మీ జీవనం ఎలా ఉంది? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? బిక్షపతి : ఈ ఏడాది వర్షాలు లేవు. మా ఆర్థిక పరిస్థితి బాగా లేదు. మీ కృషితో దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా రిజర్వాయర్లోకి నీరు చేరింది. ఈ ఏడాది ప్రభుత్వం రుణం మాఫీ చేయాలని కోరుతున్నాం. స్పీకర్ : ‘మిషన్ కాకతీయ’ లాభం చేకూరుస్తుందని భావిస్తున్నారా? నిమ్మల మహేందర్ : లబ్ధి చేకూరుతుందని అనుకుంటున్నాం. చలివాగు రిజర్వాయర్ను అభివృద్ధి చేస్తే మాతోపాటు రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. స్పీకర్ : సంఘం ఎదుర్కొంటున్న అవస్థలు? పల్లెబోయిన అశోక్ : మా మండలానికి సర్కారు రెండు కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేసింది. అవి గ్రామాల్లో నిర్మించనున్నారు. శాయంపేట మండల కేంద్రానికి ఒక కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తే సమావేశాలు నిర్వహించుకునేందుకు సులువుగా ఉంటుంది. స్పీకర్ : చేపలు పట్టడంలో కూలీ గిట్టుతుందా? ఇళ్లు గడస్తుందా? చాడ కిష్టస్వామి : దయనీయంగా ఉంది. చలివాగులో కొన్నేళ్లుగా కాంట్రాక్టరే చేప పిల్లలు పోస్తున్నాడు. శ్రీకాకుళం నుంచి మత్స్యకారులను తీసుకొచ్చి చేపలను పట్టిస్తున్నాడు. మాకు కూలీ కూడా లేదు. ఈ ఏడాది చేప పిల్లలను ప్రభుత్వమే పోసినందున స్థానిక మత్స్యకారులకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించాలి. స్పీకర్ : ఎన్నేళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు? మీ పిల్లలను ఇదే వృత్తిలో కొనసాగించాలని అనుకుంటున్నారా? ఐరవేని సదయ్య : తరతరాలుగా ఇదే వృత్తిపై బతుకుతున్నాం. మా పిల్లలతో ఈ పని చేయించాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. మా కులస్తుల కోసం ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. స్పీకర్ : మీ కుటుంబాల్లో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? పల్లెబోయిన సారయ్య : చాలా తక్కువగా ఉన్నారు. మా కులాన్ని బీసీ‘డీ’ నుంచి బీసీ‘ఏ’కి మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తే మా పిల్లలకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. స్పీకర్ : ఆర్టీసీకి సంబంధించి సమస్యలు ఉన్నాయా? పెండ్యాల పైడి : శాయంపేట-పెద్దకోడెపాక గ్రామాలకు పల్లె వెలుగు బస్సులు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. మాందారిపేట క్రాస్రోడ్ వద్ద ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటున్నందున బస్షెల్టర్ ఏర్పాటు చేయాలి. మరుగుదొడ్డి నిర్మించాలి. స్పీకర్ : ప్రభుత్వం నుంచి ఏ పథకాలు ఆశిస్తున్నారు? ఐరబోయిన చేరాలు : ముదిరాజ్ మత్స్యకారులు ఆర్థికంగా ఎదగలేదు. కళ్యాణలక్ష్మి పథకాన్ని ముదిరాజ్లకు వర్తింపజేయూలి. స్పీకర్ : ఏం తల్లి.. ఏం పని మీద చెరువు దగ్గరికి వచ్చావు? కూచనం సమ్మక్క : ఇక్కడికి సార్లు వస్తున్నరని తెలిసి వచ్చిన. నాకు 70 ఏళ్లు. ఇంతకు ముందు రూ.200 పింఛన్ వచ్చేది. ఇప్పుడు గవర్నమెంట్ రూ.1000 ఇస్తందని తెలిసి మండలాఫీసుల దరఖాస్తు చేసుకున్న. కాని పింఛన్ రాలేదు నాయనా. స్పీకర్ : తల్లులు బాగున్నారా? బీడీలు చేస్తే రోజు కూలీ గిట్టుతుందా? క్యాతం విజయ : పదేళ్ల నుంచి బీడీలు చేస్తున్నాం. నెలలో పది రోజులే పని దొరుకుతాంది. రూ.1000 వస్తున్నాయి. కటింగ్ పోను రూ.700 చేతికి వస్తాయి. వ్యవసాయం, బీడీలు చుట్టడం.. రెండు పనులు చేసినా ఇళ్లు గడవడం కష్టంగానే ఉంది సారూ. స్పీకర్ : ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏమి కోరుకుంటున్నారు? గుండు సౌందర్య : పొగాకు పడక చాలా మంది క్యాన్సర్ బారిన పడ్డారు. వయసు పరిమితితో సంబంధం లేకుండా పింఛన్లు అందించాలి. మాకు హెల్త్ కార్డులు అందజేస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ప్రభుత్వ ఆస్పత్రిని 30 పడకల ఆస్పత్రిగా మార్చాలి. స్పీకర్ : కరెంటు సమస్య ఏమైనా ఉందా? మెండు చంద్రకళ: కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. వర్షాలు కురియక, కరెంటు ఉండక పంటలు ఎండినయ్. స్పీకర్ :చేనేత కార్మికులకు ఇబ్బందులు ఉన్నాయా? బాసాని లక్ష్మీనారాయణ : గ్రామంలో సుమారు 600 మంది చేనేత కార్మికులు ఉండేవారు. కూలీ గిట్టక బీవండి, సిరిసిల్లకు వలసెళ్లారు. కొందరు ఇక్కడే వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో 150 మంది చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందించాలి. స్పీకర్ :కాలుష్య ఇబ్బందులు ఉన్నాయా? దైనంపల్లి సుమన్ : కాలుష్య సమస్య లేదు. కానీ.. గ్రామ సమీపంలోని క్రషర్లతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. క్రషర్ల సమీపంలో కస్తూర్బా స్కూల్ సైతం నిర్మిస్తున్నారు. విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ మేరకు చర్యలు చేపట్టాలి. స్పీకర్ : పంటలకు మద్దతు ధర లభిస్తుందా? శ్రీనివాస్ : ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రరుుస్తే మద్దతు ధర లభిస్తోంది. కానీ.. దళారులతో మోసపోతున్నాం. పత్తి, మిర్చి పంటలను విక్రయించేందుకు వరంగల్కు వెళ్లాల్సి వస్తోంది. మండల కేంద్రంలో మూసివేసిన సబ్ మార్కెట్ను తెరిస్తే చాలు. స్పీకర్ :విద్యాపరంగా శాయంపేట పరిస్థితి ఎలా ఉంది? పరకాల దేవేందర్ : మండలానికి చెందిన వందలాది మంది యువకులు ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగావకాశాలు పొందారు. మోడల్ పాఠశాల లేకపోవడమే లోటు. నిర్మిస్తే బాగుంటుంది. స్పీకర్ : తాగునీరు దొరుకుతుందా? అమ్మ అశోక్ : జోగంపల్లి గ్రామస్తులు తాగునీరు దొరకడం లేదు. గత ప్రభుత్వం డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ను పూర్తికాకముందే హడావుడిగా ప్రారంభించింది. కానీ.. నీరు సరఫరా కావడం లేదు. నాసిరకం పనుల మూలంగా పైప్లైను పైపులు పగిలిపోతున్నాయి. ప్రస్తుత సర్కారు మరమ్మతులు చేపట్టి గ్రామస్తులకు నీరందించాలి. స్పీకర్ : ఇంకా ఎక్కడ తాగునీటి సమస్య ఉంది? కానుగుల నాగరాజు : మండలంలోని రాజుపల్లిలో ఫ్లోరైడ్ సమస్య ఉంది. చిన్నపిల్లలు నీటిని తాగి ఫ్లోరోసిస్ బారిన పడుతున్నారు. గ్రామంలో డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ను నిర్మించి గ్రామస్తులకు తాగు నీరందించాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement