bazar
-
గోల్డ్ మ్యాన్ అందించే '24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ'..! ధర ఎంతంటే..
విలాసవంతంమైన ఆహారపదార్థాలను ఎన్నో చూశాం. కానీ ఐస్క్రీం డిజర్ట్లలో గోల్డ్తో చేసింది చూసుండరు. దీన్ని విక్రయించే వ్యక్తి సైతం గోల్డ్ మ్యాన్లా మెరిసిపోతుండటం విశేషం. ఇంతకీ ఎక్కడ ఈ గోల్డ్ కుల్ఫీని అమ్ముతున్నారంటే..ఇండోర్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన పురాతన సరఫా బజార్లో ఈ 24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ దొరకుతుంది. అక్కడ ఈ విలాసవంతమైన డెజర్ట్ తోపాటు ఫలూడా, ది గోల్డ్ మ్యాన్ జామున్, రబ్డీ వంటి వివిధ రుచులను సైతం అందిస్తోంది. ఇక్కడ ప్రత్యేకతే ఏంటంటే..ఈ గోల్డ్ కుల్ఫీని అందించే వ్యక్తి ఒంటి నిండా గోల్డ్తో ధగ ధగ మెరిసిపోతూ కనిపిస్తుంటాడు. బహుశా అదే అతడి సేల్స్ ట్రిక్ ఏమో గానీ..చూడటానికి మాత్రం ఏదో లగ్జరీయస్ హోటల్కి వచ్చామా..! అనే డౌటు వచ్చేస్తుందని అంటున్నారు అక్కడ స్థానికులు. అత్యంత ఆడంబరంగా కనపించే వీధి దుకాణమే ఇది. ఒరిజనల్ గోల్డ్తో తయారయ్య ఈ కుల్ఫీ ధర వచ్చేసి రూ. ₹351-401ల మధ్య ఉంటుందట. ఇది శతాబ్దాల నాటి పాక సంప్రదాయానికి పరాకాష్ట. ఇండోర్ సందర్శించడానికి వచ్చిన వాళ్లు తప్పనిసరిగా ఈ కుల్ఫీని తిని చూడకుండా వెళ్లరట. 'సరఫా' అనే పేరు ఎలా వచ్చిందంటే..హోల్కర్ రాజవంశం సమయంలో 18వ శతాబ్దం నాటి ఈ మార్కెట్ బంగారం, వెండి వ్యాపారుల వాణిజ్య కేంద్రంగా ఉండేదట. అందుకే దీనికి "సరఫా" అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇక హిందీలో దీని అర్థం బులియన్. కానీ చీకటి పడుతుందనగా.. ఈ ప్రాంతంలోని ఆభరణాల దుకాణాలు మూతపడిపోతాయి..రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో..అత్యంత ఫేమస్ అయిన ఈ గోల్డ్ కుల్ఫీ దుకాణం అమ్మకాలు ప్రారంభమవుతాయట. చిరుతిండికి ఫేమస్ ఈ బజార్. ఈ కుల్ఫీ దుకాణమే కాకుండా రుచికరమైన జిలేబీలు, స్పైసీ దాల్ బఫ్లా వంటి చిరుతిండ్లకు చిరునామా ఇది. భద్రత దృష్ట్యా మొదలైన ఈ మార్కెట్ క్రమంగా విస్తరించిందట. చివరగా ఈ సరఫా బజార్లో ది గోల్డ్మ్యాన్ విక్రేత అందించే బంగారు కుల్ఫీ ప్రత్యేక ఆకర్షణగా హైలెట్గా నిలిచిన డెజర్ట్. ఇది ఒక రకంగా రుచితోపాటు..సర్వ్ చేసే వ్యక్తి దృశ్యం.. కస్టమర్ని ప్రభావితం చేసేలా అమ్మకాలు జోరందుకుంటాయనే విషయాన్ని హైలెట్ చేసింది.(చదవండి: టేస్టీ టేస్టీ..రొయ్యల పాప్కార్న్, మ్యాంగో కేక్ చేద్దాం ఇలా..!) -
ఐపీవో యోచనలో బ్యాంక్ బజార్
న్యూఢిల్లీ: ఫిన్టెక్ కంపెనీ బ్యాంక్ బజార్.కామ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. రానున్న 12–18 నెలల్లోగా ఐపీవోకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్న ట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. బ్యాంకింగ్ దిగ్గజాలతో భాగస్వామ్యం ద్వారా కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్న కంపెనీ మార్చితో ముగి సి న గతేడాది(2022–23) రూ. 160 కోట్ల ఆదాయం సాధించింది. ఏడాది నుంచి ఏడాదిన్నర లోగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే యోచనలో ఉన్నట్లు ఒక ప్రకటనలో బ్యాంక్ బజార్.కామ్ తెలియజేసింది. -
డ్వాక్రా బజార్ ప్రారంభం
కర్నూలు (టౌన్): స్థానిక సి. క్యాంపు సెంటర్లో డ్వాక్రా బజారు ప్రారంభమైంది. బుధవారం జిల్లా కలెక్టర్ సి.హెచ్. విజయమోహన్ జ్యోతి ప్రజ్వలనతో దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను అమ్మేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన వస్తువులకు ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు. ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు, మెప్మా పీడీ రామాంజనేయులు, ఆర్అండ్బీ ఈఈ జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావసరాలకు అనుగుణంగా రైతుబజార్లు
సీఈవో రమణమూర్తి కాకినాడ సిటీ : ప్రజల అవసరాలకు అనుగుణంగా రైతుబజార్లలో సేవలు అందేలా చర్యలు చేపడుతున్నట్టు సీఈవో బీవీ రమణమూర్తి తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న రైతుబజార్లో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఆధ్వర్యంలో రూ.10 లక్షలతో నిర్మించిన షెడ్ ప్రారంభోత్సవం మంగళవారం జరిగింది. రమణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 10 రైతుబజార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. రైతుబజార్లన్నింటికీ పటిష్టమైన షెడ్లు నిర్మించడంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాకినాడ జగన్నాథపురంలోని జిల్లా పరిషత్కు చెందిన స్థలంలో రైతుబజార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. తొలుత జిల్లాలోని రైతుబజార్ల పనితీరును జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సీఈవోకు వివరించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఏడీ కేవీఆర్ఎన్ కిషోర్, డీఈఈ ఎస్ఎస్వీ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సుల్తాన్బజార్లో కార్డాన్ సెర్చ్