-
స్వల్పంగా పెరిగిన ప్రవాహం
బ్యారేజ్ నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల ధవళేశ్వరం : కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతి సోమవారం సాయంత్రం స్వల్పంగా పెరిగింది. బ్యారేజ్ వద్ద నీటిమట్టం10.90 అడుగులకు చేరుకుంది. దీంతో 2,00,113 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టాలకు సంబంధించి తూర్పు డెల్టాకు 4,200 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2,200 క్యూసెక్కులు, పశ్చిమడెల్టాకు 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతోనే స్వల్పంగా నీటిమట్టం పెరిగిందని హెడ్వర్క్స్ ఈఈ కృష్ణారావు తెలిపారు. ఎగువప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 5.38 మీటర్లు, పేరూరులో 9.28 మీటర్లు, దుమ్ముగూడెంలో 8.34 మీటర్లు, భద్రాచలంలో 27.30 అడుగులు, కూనవరంలో 9.04 మీటర్లు, కుంటలో 7.05 మీటర్లు, కోయిదాలో 10.46 మీటర్లు,పోలవరంలో 7 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వేబ్రిడ్జివద్ద 13.95 మీటర్ల నీటిమట్టాలు నమోదయ్యాయి. -
బ్యారేజీ కాదు.. ఆనకట్ట!
తుమ్మిడిహెట్టిపై రాష్ట్ర ప్రభుత్వం యోచన * బ్యారేజీకి రూ.1,800 కోట్ల ఖర్చు.. ఆనకట్టకు రూ.200 కోట్లు * ప్రాణహిత-చేవెళ్లపై అధికారులతో సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అందులో స్వల్ప మార్పులు చేయాలని యోచిస్తోంది. బ్యారేజీ కి బదులు ఆనకట్ట నిర్మించే దిశగా ఆలోచనలు చేస్తోంది. వ్యయం తగ్గించడంతోపాటు మహారాష్ట్ర నుంచి ముంపు వివాదం లేకుండా ఉండేందుకే ఆనకట్ట నిర్మాణం వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆనకట్ట నిర్మాణ అంచనాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించినట్లుగా తెలిసింది. 6 టీఎంసీలకు అంత ఖర్చు అక్కర్లేదు.. 160 టీఎంసీల గోదావరి నీటితో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టులో ప్రభుత్వం పలు మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాజెక్టును రెండు భాగాలుగా చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం... పాత డిజైన్ ప్రకారం ఉన్న తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ ఉంటుందని, అక్కడ్నుంచి నీటిని మళ్లించి ఆదిలాబాద్ జిల్లా సాగు అవసరాలను తీరుస్తామని చెబుతోంది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 152 మీటర్ల నుంచి 148 మీటర్ల వరకు కుదించి నీటిని నిల్వ చేయాలని భావించింది. అయితే ఇందుకు సుమారు రూ.1,800 కోట్ల మేర వ్యయం అయ్యే అవకాశం ఉంది. కేవలం 5 నుంచి 6 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ఇంతస్థాయిలో ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే బ్యారేజీ బదులు ఆనకట్ట కట్టాలని యోచిస్తోంది. 2 టీఎంసీల మేర నీటిని నిల్వ చేసే ఎత్తులో కేవలం రూ.200 కోట్ల ఖర్చుతో దీన్ని చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆనకట్టలో నిల్వ చేసిన నీటిని... అవసరాన్ని బట్టి 80 నుంచి 120 రోజుల పాటు 15 టీఎంసీల వరకు మళ్లించుకోవచ్చని, దీనిద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని 1.50 లక్షల ఎకరాలకు నీరందించవచ్చన్నది ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది. బ్యారేజీ నిర్మాణం ఏ ఎత్తులో చేపట్టినా ముంపుపై మహారాష్ట్రకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యారేజీకి బదులు ఆనకట్ట వైపు ప్రభుత్వం మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. నీటి నిల్వ సామర్థ్యం ఒకట్రెండు టీఎంసీలు ఉంటే దాన్ని ఆనకట్టగా, 2 నుంచి 8 టీఎంసీల వరకు ఉంటే బ్యారేజీగా పరిగణిస్తారు. లైడార్ సర్వేకు ఓకే కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నిర్మించదలిచిన బ్యారేజీ పరివాహక ప్రాంతంలో అత్యాధునిక పద్ధతిలో లైడార్ సర్వే నిర్వహించేందుకు పౌర విమానయాన శాఖ సోమవారం అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి సమాచారం అందింది. ఇప్పటికే ఇక్కడ సర్వే చేసేందుకు కేంద్ర హోం, రక్షణ మంత్రిత్వ శాఖలు అనుమతినిచ్చాయి. రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు ప్రాజెక్టుల డిజైన్లో మార్పుచేర్పుల్లో భాగంగా మరో రెండు రిజార్వయర్ల సామర్థ్యాన్ని ప్రభుత్వం పెంచనుంది. ఇప్పటికే మెదక్ జిల్లాలోని పాములపర్తి, తడ్కపల్లి రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా నల్లగొండ జిల్లాలోని బస్వాపూర్, గంధమల రిజర్వాయర్ల సామర్థ్యం పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం ఈ దిశగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. గంధమల రిజర్వాయర్ను 0.5 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు, బస్వాపూర్ రిజర్వాయర్ను 0.8 టీఎంసీల నుంచి 13 టీఎంసీలకు పెంచాలని సీఎం సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు కాళేశ్వరం, ఎల్లంపల్లి అలైన్మెంట్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని సూచించినట్లుగా సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement