breaking news
Bank Payments
-
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుకు ఊరట
న్యూఢిల్లీ: కొత్తగా మళ్లీ ఖాతాదారులను చేర్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతులు లభించినట్లు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తెలియజేసింది. అలాగే ఖాతాదారుల వివరాల ధృవీకరణ కోసం ఆధార్ ఈ–కేవైసీని ఉపయోగించుకునేందుకు విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ యూఐడీఏఐ నుంచి కూడా అనుమతి లభించినట్లు తెలియజేసింది. ఎయిర్టెల్ మొబైల్ సబ్స్క్రయిబర్ల అనుమతి లేకుండానే వారి పేరున ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలు తెరవడం, కోట్ల కొద్దీ రూపాయల వంటగ్యాస్ సబ్సిడీ మొత్తాలు వీటిల్లోకి మళ్లడం.. కొన్నాళ్ల కిందట వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో కొత్త కస్టమర్లను చేర్చుకోరాదంటూ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ను ఆర్బీఐ ఆదేశించింది. అలాగే ఆధార్ డేటా బేస్ను ఉపయోగించుకోకుండా టెలికం సంస్థ ఎయిర్టెల్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్కి ఇచ్చిన ఈ–కేవైసీ లైసెన్సులను యూఐడీఏఐ సస్పెండ్ చేసింది కూడా. ఈ ఏడాది మార్చిలో ఎయిర్టెల్ లైసెన్సును పునరుద్ధరించినప్పటికీ, పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సుపై సస్పెన్షన్ కొనసాగింది. -
ఇక.. బ్యాంకు చెల్లింపులు
ఉపాధికూలీల వేతనాల పంపిణీ ♦ త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభానికి కసరత్తు ♦ ఖాతాలు లేనివారికి తెరిపించాలని ప్రభుత్వం ఆదేశాలు ♦ ఉన్నవారికి ఆధార్ అనుసంధానించాలని సూచన ♦ అవకతవకలు తగ్గుతాయని సర్కార్ ఉద్దేశం ♦ జిల్లాలో 1,84,934 జాబ్కార్డులు ♦ 18 మండలాల్లో 4,29,951 మంది కూలీలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు ఇకపై బ్యాంకుల ద్వారానే కూలి డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటివరకు కొన్ని చోట్ల పోస్టాఫీసుల ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ ప్రక్రియకు త్వరలో స్వస్తి చెప్పనున్నారు. కూలీలందరికీ బ్యాంకుల్లో ఖాతాలు తప్పనిసరిగా ఉండాలని డీఆర్డీఓకు గ్రామీణాభివృద్ధి శాఖ సూచించింది. అదే విధంగా ఖాతాలకు ఆధార్ నంబర్ను అనుసంధానించాలని పేర్కొంది. దీంతో దాదాపు పదిహేనేళ్ల నుంచి పోస్టాఫీసుల ద్వారా డబ్బులు చెల్లించే ప్రక్రియకు త్వరలో రాంరాం చెప్పనుంది. బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరిపితే ఎలాంటి అక్రమాలు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయని భావించి ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. సాక్షి, వికారాబాద్: ఒకప్పుడు డబ్బుల చెల్లింపునకు ప్రభుత్వం పోస్టాఫీసులపైనే ఆధారపడేది. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్, ఆన్లైన్ విధానం, ఏటీఎం కార్డుల జారీ ప్రక్రియ వంటివి బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రవేశపెట్టినప్పటినుంచి సర్కార్ అన్ని శాఖల చెల్లింపులన్నీ దాదాపుగా బ్యాంకుల ద్వారానే జరుపుతున్నాయి. పోస్టాఫీసుల ద్వారా ఉపాధి డబ్బులు చెల్లిస్తే లబ్ధిదారు స్వయంగా వెళ్లి తీసుకోవాల్సి వచ్చేది. అదే బ్యాంకుల్లో అయితే ఏటీఎం కార్డుల ద్వారా ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు తీసుకునే వీలుంది. పోస్టాఫీసుల ద్వారా చెల్లింపులు జరిపినప్పుడు కొన్నిసార్లు అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా చెల్లింపునకు పూర్తిగా స్వస్థి పలకాలని నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని 26 గ్రామ పంచాయతీల్లో వికారాబాద్ జిల్లా 18 మండలాలలో ఏర్పడింది. లక్షా 84వేల 934 జాబ్కార్డులు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 4లక్షల 29వేల 951 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. అయితే, వీరిలో రెగ్యులర్గా ఉపాధి పనులకు వచ్చేవారు 3 లక్షల 5వేల మంది మాత్రమే. జిల్లా ఏర్పాటు సమయంలో మహబూబ్నగర్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట్ మండలాలను విలీనం చేశారు. దీంతో ఈ మండలాల పరిధిలోని 26 గ్రామ పంచాయతీల్లో నేటికీ పోస్టాఫీసుల ద్వారానే ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లిస్తున్నారు. కొడంగల్ మండలంలో 10,764 జాబ్కార్డులు.. 27,950 మంది కూలీలు, దౌల్తాబాద్ మండలంలో 12,470 జాబ్కార్డులుండగా, 33 569 మంది పనిచేస్తున్నారు. బొంరాస్పేట మండలంలో 13,839 జాబ్కార్డులకు 31,230 మంది ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ మూడు మండలాల్లో పనిచేసే ఉపాధికూలీలకు బ్యాంకు ఖాతాలు తెరిపించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ గ్రామీణాభివృద్ధి అధికారులను ఆదేశించారు. దీంతోపాటు జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధికూలీల బ్యాంకు ఖాతాలకు ఆధార్ను అనుసంధానించాలని సూచించారు. కూలీల బ్యాంకు ఖాతాలు, ఉపాధిజాబ్కార్డులు, సెల్ఫోన్నెంబర్లను తీసుకొని వాటికి ఆధార్కార్డును అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో కూలీ డబ్బులు నేరుగా కూలీల ఖాతాల్లో జమ చేసేందుకు వీలు కలుగుతుంది. అదేవిధంగా డబ్బుల పంపిణీలో అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా ఉండే విధంగా గ్రామీణాభివృద్ధి అదికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఈ పనిని అప్పగించి సెప్టెంబరు నెలాఖరులోగా బ్యాంకు ఖాతాలు తెరిపించడానికి అధికారులు కసరత్తు వేగిరం చేశారు. వచ్చే నెలాఖరులోపు పూర్తిచేస్తాం బ్యాంకుల ద్వారానే ఉపాధి కూలీలకు కూలీ డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రతి కూలీకి బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు జిల్లాలోని కొడంగల్, బొంరాస్పేట్, దౌల్తాబాద్ మండలాల్లో పనిచేసే 92,749 మంది ఉపాధి కూలీలు పోస్టాఫీసుల ద్వారానే కూలీ డబ్బులు తీసుకుంటున్నారు. వీరికి వచ్చేనెలలోపు బ్యాంకు ఖాతాలు తెరిపించడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని 4,29,951 మంది కూలీలందరికీ బ్యాంకు ఖాతాలు ఉండి ఆధార్ అనుసంధానం చేయించేందుకు నిర్ణయించాం. మరో రెండుమూడు నెలల్లో పోస్టాఫీసుల ద్వారా ఉపాధిహామీ పథకం కూలీలకు డబ్బులు పంపిణీ చేసే ప్రక్రియకు ప్రభుత్వం పూర్తిగా ముగింపు పలకాలని భావిస్తుంది. ఈక్రమంలోనే కూలీలందరికీ బ్యాంకు ఖాతాలు తెరిపించాలనే ఆదేశాలు ఉన్నాయి. – జాన్సన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, వికారాబాద్ -
చెల్లింపుల బ్యాంక్లో పేటీఎం వాలెట్ వ్యాపారం విలీనం
న్యూఢిల్లీ: త్వరలో ఏర్పాటు చేయనున్న చెల్లింపుల బ్యాంకులో వాలెట్ వ్యాపార విభాగాన్ని విలీనం చేయనున్నట్లు పేటీఎం మాతృ సంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్’ వెల్లడించింది. వాలెట్ విభాగం వ్యాపారం మొత్తం పేమెంట్స్ బ్యాంకుకు బదలారుుస్తామని, అమ్మకాల భాగాన్ని మాత్రమే వన్97 నిర్వహిస్తుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. చెల్లింపుల బ్యాంకుకు సంబంధించి ఆర్బీఐ నుంచి తుది అనుమతులు పొందే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని వివరించారు. చైనా దిగ్గజం ఆలీబాబా గ్రూప్ తదితర ఇన్వెస్టర్ల నుంచి 680 మిలియన్ డాలర్లు సమీకరించిన వన్97 కమ్యూనికేషన్స... ఇటీవలే పేటీఎం ఈ-కామర్స్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పేరిట రెండు వేర్వేరు సంస్థలను నమోదు చేసింది. పేమెంట్స్ బ్యాంక్లో వన్97 వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు మెజారిటీ వాటాలుంటారుు. -
పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ కులోగో డిజైన్ పోటీ
న్యూఢిల్లీ: డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కొత్తగా ఏర్పాటు చేయనున్న పేమెంట్స్ బ్యాంక్కు సంబంధించి లోగో, ట్యాగ్లైన్ డిజైన్ కోసం మైగౌవ్ ప్లాట్ఫామ్ ద్వారా ఒక పబ్లిక్ కంటెస్ట్ను నిర్వహిస్తోంది. ఇందులో గెలుపొందిన వారికి రూ. 50,000 ప్రైజ్ మనీని అందిస్తోంది. పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఔత్సాహికులకు ఈ కంటెస్ట్ జూలై 9 వరకు అందుబాటులో ఉంటుందని పోస్టల్ డిపార్ట్మెంట్ తెలిపింది. పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభమౌతాయని అం చనా. ప్రముఖ డిజైనర్లు, నిపుణులతో కూడిన ఒక కమిటీ వచ్చిన ఎంట్రీస్లో 20 ఉత్తమ డిజైన్లను షార్ట్లిస్ట్ చేస్తుంది. విజేత కోసం వీటిని తర్వాత మైగౌవ్ ప్లాట్ఫామ్లో ఓటింగ్కు పెడతారు. దేనికైతే అధిక ఓట్లు వస్తాయో.. దాన్ని రూపొందించిన వారిని విన్నర్గా ప్రకటించి.. వారికి ప్రైజ్ మనీని అందజేస్తారు.