breaking news
Bangalore traffic
-
కష్టజీవులపై చలానాస్త్రం! ‘రూ.9.6 లక్షలు పిండేశాం’
నగరాలలో పొట్టకూటి కోసం చిరుద్యోగాలు చేసుకునే కష్టజీవులు చాలా మంది కనిపిస్తారు. వీరిలో ముఖ్యంగా ఈ-కామర్స్ సంస్థలకు డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తూ పొట్టపోసుకునేవారే ఎక్కువ. రోజంతా రోడ్లపై తిరుగుతూ కష్టపడితే పదో పాతికో సంపాదిస్తారు. వీళ్లనే టార్గెట్ చేశారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. చిన్న చిన్న ఉల్లంఘనల పేరుతో జరిమానాల రూపంలో లక్షల రూపాయలు పిండేశారు.నిబంధనలు ఉల్లంఘించే ఈ-కామర్స్ వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు శనివారం (మార్చి 1) స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం 1,859 మంది నుంచి జరిమానాల రూపంలో రూ.9.6 లక్షలు వసూలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చూడటం రహదారి భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా, ఈ-కామర్స్ డెలివరీ వాహనాల ద్వారా పెరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలను పరిష్కరించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ డ్రైవ్ చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.స్పెషల్ డ్రైవ్ లో ఎక్కువగా ఈ-బైకులే నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు గుర్తించామని జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) ఎంఎన్ అనుచేత్ తెలిపారు. ఈ వాహనాలు ఎక్కువగా మైక్రో మొబిలిటీ వాహనాలు, వాటి వినియోగదారులకు నిబంధనలు తెలియవు. మైక్రో మొబిలిటీ వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబర్లు లేవని, వాటి వినియోగదారులు హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వివరించారు.చిరు ఉల్లంఘనలుఫుట్ పాత్ లపై ప్రయాణించినందుకు 79 మంది, నో ఎంట్రీ నిబంధనను ఉల్లంఘించినందుకు 389 మంది, వన్ వేకు విరుద్ధంగా ప్రయాణించినందుకు 354 మంది, సిగ్నల్ జంప్ చేసినందుకు 209 మంది, హెల్మెట్ ధరించనందుకు 582 మంది, రాంగ్ పార్కింగ్ చేసినందుకు 98 మంది, ట్రాఫిక్ కు ఆటంకం కలిగించినందుకు 148 మందిని పోలీసులు పట్టుకున్నారు. అక్కడికక్కడే జరిమానా చెల్లించేందుకు తమ వద్ద డబ్బులు లేవని రైడర్లు చెప్పడంతో పోలీసులు 794 వాహనాలకు నోటీసులు జారీ చేశారు.అవగాహన లేమిచాలా మంది రైడర్లు తమకు నిబంధనలపై అవగాహన లేదని చెప్పడంతో, వారికి గంటకు పైగా ఆయా పరిధుల్లో రూల్ ట్రైనింగ్ ఇచ్చినట్లు అనుచేత్ తెలిపారు. ఈ-కామర్స్ కు అనుబంధంగా ఉన్న ఎల్లోబోర్డు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే దీన్ని పోలీసులు ఖండించారు. వాహనం నంబర్ ప్లేట్ రంగుతో సంబంధం లేకుండా ఈ-కామర్స్ డెలివరీ కోసం ఉపయోగించే అన్ని రకాల వాహనాలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు కేసులు నమోదు చేసినట్లు అనుచేత్ తెలిపారు. -
బాబోయ్ ఇదేం ప్రయాణం.. నావల్ల కాదు.. ఇలాగైతే కష్టమే!
బెంగుళూరు: వాహనాలను ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత లోకల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే అంతకంటే మరో సౌకర్యం లేదనే స్థితికి చేరుకున్నారు నగరాల్లో నివసించేవారు. కానీ ఆ సౌకర్యంలో అసౌకర్యం కలిగితే ఎలా ఉంటుందో వివరించే ప్రయత్నం చేశాడు ఓ బెంగుళూరు వాసి. కేవలం 45 నిముషాల ప్రయాణానికి అతను 225 నిముషాలు ఎదురుచూడాల్సి వచ్చింది. అర్జెంటు పని ఏదైనా ఉండి ఏమాత్రం ఆయాస పడకుండా బయటకు వెళ్లాలంటే ఇప్పుడు బోలెడన్నీ ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఆన్లైన్లో వాహనాన్ని బుక్ చేసుకుని శరీర అలసట లేకుండానే రివ్వున గమ్యస్థానం చేరుకోవచ్చు. వాహనాన్ని బుక్ చేసుకునే సమయంలో కూడా తొందరగా వచ్చే వాహనాలనే ఎంచుకుని మరీ బుక్ చేసుకుంటాము. కానీ బెంగుళూరులో ఓ వ్యక్తికి ఈ ఆన్లైన్ సేవలో చేదు అనుభవం ఎదురైంది. ర్యాపిడోలో వాహనాన్ని బుక్ చేసుకున్న అతడు కేవలం 45 నిముషాల ప్రయాణం కోసం 225 నిముషాలు వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. సాధారణంగా బెంగుళూరు ట్రాఫిక్ కథనాల గురించి మనం తరచూ వింటూనే ఉంటాము. అలాంటి బెంగుళూరు ట్రాఫిక్ లో ప్రయాణించాలంటే ఆమాత్రం సమయం వెయిటింగ్ చేయక తప్పదు మరి. దీంతో విసుగొచ్చిన ఆ యువకుడు ఈ చోద్యాన్ని నలుగురితో పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో వెయిటింగ్ సమయాన్ని చూపిస్తున్న మొబైల్ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముంది కామెంట్ల రూపంలో ఈ పోస్ట్ కు విశేష స్పందన లభించింది. ఆ వెయిటింగ్ సమయంలో ఎంచక్కా ఎక్కువ నిడివి ఉన్న హాలీవుడ్ సినిమా చూసి రావచ్చంటూ కామెంట్లు చేస్తున్నారు. Rapido wait time getting out of hand. 😭 Gotta wait for more than 3.7 hours for 45 minutes travel. @peakbengaluru #rapido #Bengaluru #peakbengaluru pic.twitter.com/7xPO3cBkPz — deyalla (@deyalla_) August 1, 2023 ఇది కూడా చదవండి: అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం.. ఐదు రోజుల్లో రెండోసారి.. -
‘బీ-ట్రాక్’..ప్రమాదాలకు చెక్!
బెంగళూరు ట్రాఫిక్ చిక్కుల పరిష్కారం 2006లోనే రూ.350 కోట్లతో శ్రీకారం ఏటా తగ్గుతున్న రోడ్డు ప్రమాదాలు సాక్షి,హైదరాబాద్: ఉద్యాననగరిగా పేరొం దిన బెంగళూరు మహానగరం ఒకప్పుడు ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యేది. ప్రజలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రహదారులపై ట్రాఫిక్ను క్రమబద్దీకరిస్తూ ప్రమాదాలు తగ్గించే పని ట్రాఫిక్ పోలీసులది. అందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది. రెండు శాఖల మధ్య సమన్వయ లోపం ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ఈ సమస్య పరిష్కారానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరు ట్రాఫిక్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ (బీ-ట్రాక్) పథకాన్ని ప్రవేశపెట్టింది. 2006-07లో దీనిని అమలులోకి తెచ్చింది. మంచి ఫలితాలు వచ్చాయి. ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది. బెంగళూరు నగరానికి..హైదరాబాద్ నగరానికి ఎన్నో సారూపత్యలు ఉన్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ‘బీ-ట్రాక్’ పథకం అమలే పరిష్కార మార్గం. ఎన్నో సారూప్యతలు... కర్ణాటక రాజధాని బెంగళూరు మాదిరిగానే హైదరాబాద్ కూడా ఎంతో పాత నగరం. దీంతో అనేక రహదారులు చిన్నవిగా, బాటిల్నెక్స్తో నిండి ఉంటాయి. వినియోగంలో ఉన్న వాహనాల్లో అత్యధిక శాతం ద్విచక్ర వాహనాలే. పీక్ అవర్స్లో రోడ్లపై అడుగుపెట్టాలంటే నరకమే. వాణిజ్య సముదాయాలకు అవసరమైన స్థాయిలో పార్కింగ్ వసతులు ఉండవు. ఇక్కడ మాదిరిగానే సాఫ్ట్వేర్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి సంఖ్య పెరుగుతూనే ఉండేది. ఈ కారణాల నేపథ్యంలో అక్కడి ప్రజలు కూడా నిత్యం ట్రాఫిక్ నరకాన్ని చవిచూడటంతో పాటు రోడ్డు ప్రమాదాలకు గురయ్యేవారు. క్షతగాత్రులు, మృతుల సంఖ్య కూడా భారీగా ఉంటేది. చిన్న చిన్న మౌలికవసతుల కోసం ఇక్కడి ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ మీద ఆధారపడినట్లే అక్కడి అధికారులు బీఎంసీ అనుమతికి ఎదురుచూడాల్సి వచ్చేది. ‘బీ-ట్రాక్’తో మారిన పరిస్థితులు బీఎంసీ నుంచి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు పరిష్కారంగా అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిందే బీ-ట్రాక్ పథకం. సాధారణ మౌలికవసతుల ఏర్పాటు, ట్రాఫిక్ నిబంధనల ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రోడ్డు ప్రమాదాలు, మృతులు, క్షతగాత్రుల సంఖ్యను సాధ్యమైనంత వరకు తగ్గించడం దీని ప్రధాన లక్ష్యాలు. 2006-07లో రూ.350 కోట్లు కేటాయించిన కర్ణాటక ప్రభుత్వం నాలుగేళ్లల్లో ఈ నిధులను వినియోగించుకోవాలని నిబంధన పెట్టింది. అక్కడి ట్రాఫిక్ పోలీసుల విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కాలపరిమితిని ఎత్తివేసింది. ఏటా ట్రాఫిక్ పోలీసులు సమర్పించే యాక్షన్ ప్లాన్ ఆధారంగా నిధులు విడుదల చేస్తోంది. 2013-14 నాటికి రూ.139 కోట్లు కేటాయించింది. పరిజ్ఞానం, మౌలికవసతులకు వినియోగం... బీ-ట్రాక్ నిధులను బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రధానంగా సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడంతో పాటు మౌలికవసతుల అభివృద్ధికి వినియోగిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం కోసం 179 ప్రాంతాల్లో సర్వైలెన్స్ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వచ్చే ఫీడ్ను అధ్యయనం చేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రాంతాల వారీగా ఏరియా ట్రాఫిక్ సెంటర్లతో పాటు ఇన్ఫాంట్రీ రోడ్లోని ట్రాఫిక్ హెడ్-క్వార్టర్స్లో భారీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్ను (టీఎంసీ) ఏర్పాటు చేశారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఉల్లంఘనులకు కౌన్సెలింగ్ కోసం అత్యాధునిక వసతులతో ట్రాఫిక్ ట్రైనింగ్ అండ్ రోడ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. ఏడేళ్లల్లో సమకూరినవి.. బీ-ట్రాక్ నిధుల్ని వినియోగించి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఏడేళ్లల్లో సమకూర్చుకున్నవి, అభివృద్ధి చేసిన జాబితా ఇది. 179 సర్వైలెన్స్, 5 ఎన్ఫోర్స్మెంట్ కెమెరాలు, 9 ఇంటర్సెప్ట్ వాహనాలు . నగరంలోని 340 ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు, ఉన్నవాటిని అప్-గ్రేడ్ చేయడం. బెంగళూరులోని 625 ప్రాంతాల్లో వార్నింగ్ సిగ్నల్స్, 49 చోట్ల పాదచారుల కోసం పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు. క్షేత్రస్థాయిలో ఉల్లంఘనుల్ని నమోదు చేయడానికి సిబ్బందికి ప్రింటర్తో కనెక్టివిటీ ఉన్న 650 బ్లాక్బెర్రీ ఫోన్లు. కీలక, అవసరమైన ప్రాంతాల్లో 30 వేల రోడ్ సైనేజస్, వెయ్యి ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ బోర్డుల ఏర్పాటు. 85 జంక్షన్లను సమకాలీన అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి చేయడంతో పాటు రెండు లక్షల చదరపు మీటర్ల రోడ్ మార్కింగ్స్. మద్యం తాగి వాహనం నడిపే వారిని పట్టుకోవడం కోసం 125 బ్రీత్ అనలైజర్ల సమీకరణ. భారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహణ. వాణిజ్య సముదాయాలు చిన్న వర్టికల్ పార్కింగ్ ఏర్పాటు. రాజకీయ చిత్తశుద్ధి ఉంటే సాధ్యమే బెంగళూరులో అమలవుతున్న బీ-ట్రాక్ పథకం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయంతోనే జరుగుతోంది. ఇలాంటి స్కీమ్లను ఇతర నగరాల్లో అమలు చేయాలంటే రాజకీయ చిత్తశుద్ధి అవసరం. ట్రాఫిక్ పోలీసు లు ఏటా వసూలు చేసి ఇస్తున్న నిధుల్లో కొంత మొత్తం తిరిగి వారికే కేటాయిస్తే సరిపోతుంది. ఈ స్కీమ్ వల్ల బెంగళూరులో రోడ్డు ప్రమాదాలతో పాటు మృతులు, క్షతగాత్రుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. - బి.సదానంద, ట్రాఫిక్ చీఫ్, బెంగళూరు ప్రమాదాలు తగ్గాయి బెంగళూరులో ఒకప్పుడు రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉండేది. అప్పట్లో ఎన్ఫోర్స్మెంట్ పక్కాగా లేక జరిమానాల విధింపు, వసూళ్లు తక్కువగా ఉండేవి. ‘బీ-ట్రాక్’తో సమకూరిన సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపుతున్నాం. తద్వారా వసూలైన జరిమానాలు పెరగడమే కాదు... ప్రమాదాలు సంఖ్య తగ్గుతూ వచ్చింది. - వసంత్, టీఎంసీ సబ్-ఇన్స్పెక్టర్, బెంగళూరు ట్రాఫిక్. ప్రమాదాలు తగ్గడమే సక్సెస్ బెంగళూరులో ‘బీ-ట్రాక్’ నిధులతో రూపొందించిన ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్ ఏర్పాటుతో చలాన్ల వసూలు భారీ స్థాయిలో పెరిగింది. అయితే ఇది సక్సెస్కు ఏమాత్రం సూచిక కాదు. కేవలం ప్రమాదాల సంఖ్య తగ్గడాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నాం. ఆ కోణంలోనే ముందుకు వెళ్లాల్సిందిగా స్పష్టం చేస్తున్నాం - ప్రవీణ్ సూద్, హోం శాఖ కార్యదర్శి, కర్ణాటక.