-
బంద్ సక్సెస్
-
ఉద్రిక్తతల మధ్య సిరిసిల్ల బంద్
మూడు ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం నేడు కొనసాగనున్న బంద్ సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమం ఉధతమైంది. 48గంటల బంద్లో భాగంగా మంగళవారం ఉద్రిక్తతల మధ్య బంద్ సంపూర్ణంగా సాగింది. జిల్లా సాధన జేఏసీ, అఖిలపక్షం పిలుపు మేరకు సిరిసిల్ల బంద్ జరిగింది. తెల్లవారుజామునే జేఏసీ నాయకులు బస్ డిపోముందు బైఠాయించి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. వన్పల్లికి వెళ్లిన నైట్హాల్ట్ బస్సు సిరిసిల్లకు రాగా.. ఆందోళనకారులు అద్దాలను ధ్వంసం చేశారు. తెరిచి ఉన్న పెట్రోల్ బంక్ డిస్ప్లేను, ఆఫీస్ అద్దాలను పగులగొట్టారు. బైపాస్ దారిలో వెళ్తున్న సిద్దిపేట, వేములవాడ డిపోల బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. రోడ్లపై టైర్లు వేసి మంటలు అంటించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కేటీఆర్ చొరవ చూపి సిరిసిల్ల జిల్లాను ఇవ్వాలని డిమాండ్చేశారు. కోర్టు ముందు న్యాయవాదులు దీక్షలు కొనసాగించారు. వస్త్రవ్యాపారులు దీక్షల్లో కూర్చున్నారు. రోడ్డుపైనే వంటావార్పు చేసి సామూహికంగా భోజనాలు చేశారు. పట్టణంలో దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. సిరిసిల్లలో మరమగ్గాలను బంద్చేసి వస్త్రోత్పత్తిని నిలిపివేసిన నేతకార్మికులు జిల్లా సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. డీఎస్పీ పి.సుధాకర్, సీఐలు జి.విజయ్కుమార్, సీహెచ్.శ్రీధర్, పది మంది ఎసై ్సలు బందోబస్తును పర్యవేక్షించారు. 48 గంటల బంద్లో భాగంగా బుధవారం బంద్ కొనసాగుతుంది. -
పోలగరం
బంద్ సక్సెస్ పాలమూరు : పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ పార్లమెంట్లో సవరణ బిల్లును ఆమోదించడాన్ని నిరసిస్తూ వామపక్షపార్టీలు, టీజేఏసీ, టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపుమేరకు శనివారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగింది. జిల్లావ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, బ్యాంకులు, పెట్రోల్బంకులు, సినిమా థియేటర్లు, హోటళ్లు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆయా పార్టీలు, ప్రజాసంఘాలు నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి. బంద్ సందర్భంగా టీజేఏసీ,విద్యార్థి సంఘాలు, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంల్ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు జిల్లాలోని పలు డిపోల వద్ద బైఠాయించారు. మహబూబ్నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ప్రధాని నరేంద్రమోడీ, చంద్రబాబుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ పాల్గొని కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసన తెలిపారు. బంద్లో భాగంగా సీపీఎం నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక బస్సు డిపో ప్రధానగేట్ ఎదుట బైఠాయించారు. తెలంగాణ సీపీఎం ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లావ్యాప్తంగా నిరసనలు కొడంగల్లో బంద్ విజయవంతంగా కొనసాగింది. టీజేఏసీ పిలుపు మేరకు టీఆర్ఎస్, టీవీవీ, టీఎన్జీఓస్, టీజేఏసీ, సీపీఐ నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొడంగల్లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బంద్లో పాల్గొన్నారు. షాద్నగర్లో అత్యవసర సేవలు మినహా వ్యాపార సముదాయలను స్వచ్ఛందంగా మూసివేశారు. టీజేఏసీ నాయకులు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. టీఆర్ఎస్, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు బస్టాండ్ ఆవరణలో మానవహారం చేపట్టారు. నాగర్కర్నూల్లో టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ డిపో వద్ద బైఠాయించారు. అంతకుముందే కొన్ని బస్సులు డిపో నుంచి వెళ్లిపోవడంతో మిగిలినవాటిని కూడా బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. స్థానిక బస్టాండ్ కూడలిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలవ రం బిల్లును వ్యతిరేకిస్తూ టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ జడ్చర్ల నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది. వనపర్తిలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. తెలంగాణవాదులు నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బంద్లో భాగంగా దేవరకద్ర, కొత్తకోట, అడ్డాకుల, సీసీకుంట, భూత్పూర్ మండల కేంద్రాల్లో వ్యాపారసంస్థలను స్వచ్ఛందంగా మూసిఉంచారు. ‘పేట’, నియోజకవర్గాల పరిధిలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. కొల్లాపూర్, మక్తల్, గద్వాల నియోజకవర్గాల్లో వ్యాపారులు ముందుగానే వ్యాపారసంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. అలంపూర్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. కల్వకుర్తిలో సీపీఎం, కాంగ్రెస్పార్టీలు బంద్లో పాల్గొన్నాయి. అచ్చంపేటలో ఉదయం నాలుగు గంటల నుంచే సీపీఎం, టీఆర్ఎస్, జేఏసీ నాయకులు ఆర్టీసీ డిపోగేటు ఎదుట బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement