-
ఒక్క క్లిక్తో ఈజీగా బస్సు జాడ
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు బయలుదేరే ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. తాము బయలుదేరి వెళ్లాల్సిన బస్సు ఎక్కడుందో మొబైల్ ఫోన్లో తెలుసుకొనే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ‘టీఎస్ ఆర్టీసీ బస్ ట్రాకింగ్’యాప్ను వినియోగంలోకి తెచ్చింది. ప్రయాణికులు గూగుల్ ప్లే స్లోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని బస్సు జాడ తెలుసుకోవచ్చు. ప్రస్తుతం బుకింగ్ చేసుకుంటున్న ప్రయాణికుల ఫోన్లకు టికెట్ వివరాలతోపాటు బస్ ట్రాకింగ్ లింక్ను కూడా అధికారులు ఎస్సెమ్మెస్ రూపంలో పంపిస్తున్నారు. ఆ లింక్పై క్లిక్ చేయగానే బస్సు ఎక్కడుందో ప్రయాణికులు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ట్రాకింగ్ యాప్ వివరాల ఆధారంగా బస్సు వచ్చే సమయాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చు. ‘‘ప్రస్తుతం ముందస్తు రిజర్వేషన్ చేసుకునే 1,800 బస్సు సర్వీస్లకు ఈ ట్రాకింగ్ సదుపాయం కల్పించాం. సంక్రాంతి సందర్భంగా రిజర్వేషన్ సౌకర్యం ఉన్న 600 ప్రత్యేక బస్సులకు కూడా ట్రాకింగ్ సౌకర్యాన్ని అనుసంధానం చేశాం. త్వరలో హైదరాబాద్లోని మెట్రో ఎక్స్ప్రెస్లుసహా మిగిలిన సర్వీస్లకు ట్రాకింగ్ సదుపాయం కల్పిస్తాం. ఒక్క క్లిక్తో బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు’’అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇలా.. ►గూగుల్ ప్లేస్టోర్ నుంచి, టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ►ఈ యాప్లో ప్రయాణికులు వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ►హైదరాబాద్ నగరంతోపాటు జిల్లా సర్వీస్లకు సంబంధించిన సమాచారాన్ని వేర్వేరుగా పొందుపర్చారు. ►ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించే బస్సుల వివరాలతోపాటు అవి ప్రస్తుతమున్న లొకేషన్ను తెలుసుకోవచ్చు. ►ప్రయాణికులు సమీపంలోని బస్టాప్, సర్వీస్, బస్సు నంబర్లను ఎంటర్ చేసి వివరాలను పొందవచ్చు. ►అత్యవసర పరిస్థితులు తలెత్తితే రిపోర్ట్ చేసే సదుపాయాన్ని ఈ యాప్లో కల్పించారు. ►బస్సు బ్రేక్డౌన్, వైద్య సహాయం, రోడ్డు ప్రమాదం తదితర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపోర్టు చేయొచ్చు. ఆ వివరాల ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. -
బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ విమర్శించారు. మండల్ కమిషన్ రిజర్వే షన్లు అడ్డుకునేందుకు కమండల్ యాత్ర చేసిన చరిత్ర ఆ పార్టీకి ఉందని ధ్వజమె త్తారు. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవి చంద్ర ఇళ్లపై ఈడీ, ఐటీ దాడులు జరిపించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, జాజుల సురేందర్, కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్తో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఓటమిని జీర్ణించుకోలేక అమిత్ షా, బండి సంజయ్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీసీలపై బీజేపీ చేస్తున్న దాడులను దేశం దృష్టికి తీసుకెళ్తా మని, ఇతర పార్టీలను కలుపుకుని పోరాటం చేస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బీసీ వ్యాపార వేత్తలను రాజకీయంగా ఎదగకుండా బీజేపీ కుట్ర చేస్తోందని సురేందర్ ఆరో పించారు. మోదీ రామగుండం పర్యటనపై నిరసనలు వ్యక్తమవుతున్న నేప థ్యంలో బీజేపీ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని చందర్ అన్నారు. -
డ్రైవర్లు, కండక్టర్లే ఆర్టీసీ రథసారథులు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు డ్రైవర్లు, కండక్టర్లే రథసారథులని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సమష్టికృషితోనే సత్ఫలితాలను సాధించగలమని చెప్పారు. సిబ్బందిలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పునశ్చరణ తరగతులు ఎంతో దోహదంచేస్తాయన్నారు. మంగళవారం ఆయన హకీంపేట్లోని ట్రాన్స్పోర్టు అకాడమీని సందర్శించారు. జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో సిబ్బందికి ఏర్పాటు చేసిన పునశ్చరణ తరగతులను పరిశీలించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఓఅండ్ఏ) యాదగిరి, అకాడమీ ప్రిన్సిపాల్ సుచరితలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్, కండక్టర్లతో పాటు మెకానికల్ సూపర్వైజర్లకు ఇస్తున్న శిక్షణ తీరును చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. అత్యధిక కేఎంపీఎల్ (7) సాధించిన డ్రైవర్ బి.డి. రెడ్డి, మెరుగైన ఈపీకే (38) సాధించిన కండక్టర్ గీతారమణిలను ఆయన అభినందించారు. ప్రయాణికుల ఆదరాభిమానాలను పొందితే నష్టాలను అధిగమించి లాభాల బాటలో పయనించవచ్చని చెప్పారు. ప్రతి బస్సులో ఆక్యుపెన్సీ పెంచుకొనేందుకు కృషి చేయాలన్నారు. రవాణా రంగంలో నెలకొన్న పోటీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందజేయాలన్నారు. సంస్థ ఆర్థిక స్థితి పుంజుకుంటున్న సంకేతాలు కని్పస్తున్నాయని, సరికొత్త ప్రణాళికలను అమలు చేయడానికి బాట వేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి మాట్లాడుతూ, కోవిడ్తో కుదేలైన ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్నారు. -
కూటమికి ఓటేస్తే అంధకారమే: ఎంపీ కవిత
సాక్షి, డిచ్పల్లి/మోపాల్: ప్రజా కూటమి పేరుతో వచ్చే అభ్యర్థులకు ఓటు వేస్తే రాష్ట్రాన్ని మరోసారి అంధకారంలోకి నెడతారని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. మహా కూటమి కాదు.. మాయల కూటమి అని దుయ్యబట్టారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ఎన్నికల్లో ఏం పని అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా ఎంపీ కవిత సోమవారం డిచ్పల్లి, మోపాల్ మండలాల్లోని మిట్టాపల్లి, సారంగపూర్లలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీడీపీ, కాంగ్రెస్ పొత్తు అనైతికమని విమర్శించారు. తెలంగాణపై అధికారం చెలాయించడానికి చంద్రబాబు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడితే మళ్లీ అధికారం ఆంధ్రోళ్ల చేతుల్లోకి వెళ్తుందన్నారు. ఇప్పటికే ఉమ్మడి పాలనలో అరవై ఏండ్లు గోస పడ్డాం. మళ్లీ ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన ధర్మాబాద్ తదితర 40 గ్రామాల సర్పంచులు తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని గతంలో బాజిరెడ్డి గోవర్ధన్ను కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి రూరల్లో ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని, సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకునే వారికి రూ.5లక్షలు ఇస్తామని తెలిపారు. ప్రజలు సంతోషంగా ఉండటం చూసి ఓర్వలేని కాంగ్రెస్, టీడీపీ నాయకులు కూటమి కట్టి టీఆర్ఎస్ అమలు చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అభివృద్దిని చూసి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం గొల్లకుర్మలు ఎంపీ కవిత, ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు గొర్రె పిల్లలను కానుకగా అందజేశారు. మాజీ జెడ్పీటీసీ దినేశ్కుమార్, ఎంపీపీ దాసరి ఇందిర, ఎంపీటీసీ సవిత, టీఆర్ఎస్ మం డల అధ్యక్ష, కార్యదర్శులు శక్కరికొండ కృష్ణ, ఒడ్డెం నర్సయ్య, లక్ష్మీనర్సయ్య, నేతలు రాజు, బాల గంగాధర్, గోపు వెంకన్న, గంగరత్నం, సాయిలు, సత్యనారాయణ, గోపు రవీందర్, శ్రీనివాస్గౌడ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి
సాక్షి,మోపాల్: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో అమల్జేసిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయని ఆ పార్టీ నిజామాబాద్రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవ ర్ధన్ అన్నారు. శుక్రవారం మండలంలోని కాల్పోల్ మాజీ సర్పంచ్ బర్మల్ టీఆర్ఎస్లో చేరారు. అనతరం ఆయన మాట్లాడారు. అనంతరం మం డలంలోని బోర్గాం(పి) గ్రామంలో టీఆర్ఎస్ పా ర్టీ కార్యాలయాన్ని యువ నాయకులు బాజిరెడ్డి జ గన్ ప్రారంభించారు. మండలంలోని ఖానాపూర్, భాగ్యనగర్ కాలనీలోగల కుల సంఘాల నాయకులు బాజిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. డిచ్పల్లి: సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ది పనులు చూసి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ తదితర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం డిచ్పల్లి మండల కేంద్రంలోని సాక్షి యూనిట్ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ సభా స్థలాన్ని బాజిరెడ్డి పరిశీలించారు. అనంతరం యానంపల్లి, మెంట్రాజ్పల్లి, సాంపల్లి, బర్థిపూర్ గ్రామాలకు చెందిన పలువురు బాజిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. సిరికొండ: బాజిరెడ్డి గోవర్ధన్కు మద్ధతుగా కొండాపూర్లో బాజిరెడ్డి చిన్న కుమారుడు అజయ్, ఎంపీపీ మంజుల ప్రచారం చేశారు. జక్రాన్పల్లి: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని గత నాలుగున్నరేళ్లలో ఎంతో అభివృద్ధి చేశానని, మీకు సేవ చేయడానికి నన్ను మరోసారి ఆశీర్వదించండని టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మెల్సీ వీజీగౌడ్తో కలిసి బాజిరెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ధర్పల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని బాజిరెడ్డి తనయుడు జగన్ శుక్రవారం చల్లగరిగె, దుబ్బాక, రేకులపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement