breaking news
bahudha River
-
ఇప్పటివరకు 25 వేల పక్షులు.. వావ్ వాట్ ఏ సీన్!
బరంపురం: నగర శివారులోని బహుదా నదీ తీరాన విదేశీ అతిథి పక్షులు సందడి చేస్తున్నాయి. తొలిసారిగా ఇక్కడికి విచ్చేస్తున్న విహంగాలను చూసి నగరవాసులు ఆనందం వ్యక్త చేస్తున్నారు. ఏటా శీతాకాలంలో గంజాం జిల్లా, బరంపురం దగ్గరలోని చిలికా సరస్సులో ఉన్న 24 దీవులకు విదేశాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో వలస పక్షులు వచ్చి, విడిది చేస్తుంటాయి. ఎప్పటిలాగే కాకుండా ఈ ఏడాది రికార్డు స్థాయిలో 185 జాతులకు చెందిన దాదాపు 10 లక్షల పక్షులు చిలికాకు చేరుకోవడంతో, వాటిలో కొన్నింటి నివాసం ఏర్పాటుకు కాస్త అడ్డంకి ఏర్పడింది. దీంతో విడిది కోసం సరస్సుకు సమీపంలోని బహుదా నదికి కొన్ని పక్షులు చేరుకుంటున్నట్లు సమాచారం. ఇదంతా చూస్తున్న అక్కడి వారు ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే మరింత బాగుంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు 25 వేల పక్షులు నదీ తీరానికి చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల నదీ తీరంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును అక్కడి అడవిలోకి తరలించేందుకు వెళ్లిన బరంపురం అటవీ శాఖ అధికారుల ద్వారా అతిథి పక్షుల ఆచూకీ వెలుగులోకి రావడం విశేషం. ప్రస్తుతం నది పరిసర ప్రాంతాల్లో నివాసం ఏర్పరుచుకుని 25 వేల వరకు పక్షులు ఉన్నట్లు గుర్తించినట్లు డీఎఫ్ఓ అముల్యకుమార్ ప్రధాన్ తెలిపారు. చదవండి: కొన్ని రోజులు కాపురం చేసి ముఖం చాటేశాడు.. 44 రోజుల పాటు పగలు, రాత్రి.. చివరికి -
చేయి చేయి కలిపి...
సాక్షి, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం) : ఆ ఏడు గ్రామాల్లోని ప్రజల కడుపు నిండాలంటే...పంట పొలాల్లోకి బాహుదానది నీరు చేరాలి. సాగునీరు పంట పొలాల్లోకి చేరాలంటే కరకట్టల నిర్మాణానికి రైతులు నడుం కట్టాలి. చేయి చేయి కలపాలి...సొంత సొమ్ము ఖర్చుపెట్టాలి. ఇదీ గత ఐదేళ్ల నుంచి ఇచ్ఛాపురం మండలం కేశుపురం, బూర్జపాడు పంచాయతీ పరిధిలో ఉన్న 7 గ్రామాలకు చెందిన రైతన్నల ఖరీఫ్ కష్టాలు. స్థానిక బాహుదానది నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడి కేశుపురం, బూర్జపాడు గ్రామ పంచాయతీలకు చెందిన 3 వేల మందికి పైగా రైతులు సుమారు 2,500 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ఈదుపురం వంతెనకు సమీపంలో ఉన్న ఓల్డ్ కేశుపురం గ్రోయిన్నే నమ్ముకొని రైతులు పంటలు పండిస్తుంటారు. ఖరీఫ్ సీజన్లో అధికంగా వర్షాలు కురిసినప్పుడు వరద నీరు పంట పొలాల వైపుకు దూసుకు రాకుండా ఈ గ్రోయినే రైతులకు శ్రీరామరక్షగా నిలుస్తోంది. పంట పొలాలకు కావాల్సిన నీటిని తీసుకొని మిగతా నీటిని బంగాళాఖాతానికి మళ్లిస్తూ తమ పంట పండించుకుంటూ వస్తున్నారు. అప్పుడప్పుడు ఈ గ్రోయిన్ మరమ్మతులకు గురైతే రైతులే శ్రమదానం చేస్తూ తమ పంటలను రక్షించుకుంటున్నారు. విషయాన్ని రైతులు గత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ రూ.71 లక్షలతో 2016–17 సంవత్సరంలో గ్రోయిన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో తమ ఆశలు ఫలిస్తాయంటూ స్థానిక రైతులు సంబరాలు చేసుకున్నారు. ప్రజా ప్రతినిధులకు సత్కారాలు చేశారు. గ్రోయిన్ మరమ్మతులు పేరిట రాయిని పేర్చి చేతులు దులుపుకున్నారు. అంతే గ్రోయిన్ నిర్మాణం సంగతినే సదరు ప్రజాప్రతినిధులు మరిచిపోయారు. గతేడాది వచ్చిన తిత్లీ తుఫాన్కు బాహుదానదిలో అధికంగా వరద నీరు చేరడంతో మరమ్మతుకు గురైన గ్రోయిన్ పూర్తిగా ధ్వంసమయింది. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను ఓదార్చారు. తమ ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన పనులు వెంటనే చేయిస్తామంటూ మాట సైతం ఇచ్చి తప్పించుకున్నారు. ‘ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా’ అన్న సినీ గేయాన్ని ఐదేళ్లలో బాగా వంటబట్టించుకున్న రైతులు ఖరీఫ్ సీజన్లో తమ పంటలను తామే రక్షించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకు తగ్గట్టుగానే 7 గ్రామల రైతులంతా చేయిచేయి కలిపారు. రూ.7 లక్షలతో శ్రమదానం ఈ ఏడాది తాత్కాలిక పనులు చేపట్టి పంటను రక్షించుకునే ఆరాటంలో రైతులు పడ్డారు. పనులు చేపట్టాలంటే సుమారు రూ.7లక్షల వరకు ఖర్చవుతోంది. ఈ మొత్తాన్ని కేశుపు రం, బూర్జపాడు పంచాయతీలకు చెందిన రైతులే భరించుకునేందుకు ముందుకు వచ్చా రు. సెంటు భూమికి రూ.5 చొప్పున్న ఎకరా రైతుకు రూ.5 వేలు చందాగా ఇవ్వాలని రైతులు తీర్మానించారు. అనుకున్నదే తడువుగా శ్రమదానంతో పనులు మొదలుపెట్టారు. స్పందించిన కలెక్టర్ అధికారంలోకి వచ్చిన నూతన ప్రభుత్వం వైఎస్సార్సీపీపైనే రైతులు ఆధారపడ్డారు. తమను కష్టాల నుంచి గట్టెక్కించాలంటూ రైతులంతా కలసి వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజును కలిసి విన్నవించుకున్నారు. తక్షణమే స్పందించిన ఆయన గత నెల కలెక్టర్ నివాస్ను స్వయంగా కలిసి విన్నవించుకున్నా రు. తాత్కాలిక మరమ్మతుల కోసం తక్షణ సా యం రూపంలో సంబంధిత శాఖ ద్వారా రూ. 4 లక్షల 80 వేలు నిధులు మంజూరు చేస్తామంటూ హామీ ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. పదిహేను రోజుల నుంచి రైతులు తమ సొంత సొమ్ముతో జేసీబీ, ట్రాక్టర్ల సాయంతో పనులు ప్రారంభించారు. వందలాది ఇసుక బస్తాలతో కరకట్ట నిర్మించి తమ పంట పొలాలకు సాగునీరు అందేటట్టు దీక్షబూనారు. ప్రతి ఏటా పంటను కోల్పోతున్నాం బాహుదానదిలో నీరు అధికం కావడంతో ప్రతి ఏటా పంటను కోల్పోతున్నాం. గ్రోయిన్ పాడైపోవడంతో పంట పొలాలకు కావాల్సినంత సాగునీరు దొరకడంలేదు. అవసరమైన పరిస్థితుల్లో సాగునీరు వృథాగా సముద్రంలో కలసిపోతుంది. పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లాం. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి. – దున్న లోకనాథం, రైతు, డొంకూరు గ్రామం చందాలు పోగుచేసి శ్రమదానం చేస్తున్నాం గత ప్రభుత్వం చేతగాని తనం వల్ల మా రైతులమంతా భారీగా నష్టపోయాం. పదవులపై ఉన్న చిత్తశుద్ధి పనులపై లేకపోవడంతో గ్రోయిన్ పనులు నామమాత్రంగా చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ప్రతీ రైతు ఎకరా పొలంకు రూ.5 వేలు చందా ఇవ్వాల్సివస్తోంది. అధికారులు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి. – పిలక వెంకటరావు, రైతు, కేశుపురం -
బొజ్జ గణపయ్య కింద పడి యువకుడు మృతి
వినాయకుడి నిమజ్జనం సమయంలో విగ్రహం కింద నీటిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణం సమీపంలోని బహుదానదిలో శనివారం అర్ధరాత్రి ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని ముత్యాలమ్మపేటకు చెందిన ఓ విగ్రహాన్ని నిమజ్జనం కోసం బహుదానది పాయకు తీసుకొచ్చారు. విగ్రహాన్ని నిమజ్జనం కోసం నీటిలో వదిలిన సమయంలో ముత్యాలమ్మపేటకు చెందిన బీటెక్ విద్యార్థి సురేష్రెడ్డి (21) విగ్రహం కింద పడి నీటిలో మునిగిపోయాడు. తోటి వారు గుర్తించి విగ్రహాన్ని తొలగించడానికి 20 నిమిషాల సమయం పట్టింది. అప్పటికే సురేష్రెడ్డి మృతి చెందాడు. -
9 ఇసుక లారీల పట్టివేత
ఒడిశా నుంచి ఇసుకను అక్రమంగా తర లిస్తున్న లారీలను అధికారులు పట్టుకున్నారు. ఒడిశాలోని బాహుదా నది నుంచి ఇసుకను నకిలీ బిల్లులు సృష్టించి, రాష్ట్రంలోకి తీసుకువస్తున్న 9 లారీలను కంచిలి ఎస్సై ఆర్.వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. పత్రాలు పరిశీలించిన తర్వాత అవి నకిలీవని అని తేలడంతో లారీలను స్టేషన్కు తరలించి, దర్యాప్తు ప్రారంభించారు.