-
‘వారి అదృష్టం కొన్ని గంటలే’.. మరోసారి ఎస్పీ అభ్యర్థుల మార్పు
లక్నో: ఉత్తర ప్రదేశ్లో లోక్సభ ఎన్నికలకు ప్రకటించిన అభ్యర్థులను సమాజ్వాదీ పార్టీ తరచూ మారుస్తోంది. మీరట్ స్థానానికి అభ్యర్థిని రెండోసారి మార్చింది. అలాగే భాగ్పట్ నియోజకవర్గ అభ్యర్థిని కూడా మార్చింది. ఇప్పుడు అతుల్ ప్రధాన్ స్థానంలో సునీత వర్మ మీరట్ నుంచి పోటీ చేయనున్నారు. సోమవారం రాత్రి ‘ఎక్స్’లో షేర్ చేసిన జాబితాలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ మీరట్, ఆగ్రా (రిజర్వ్డ్) పార్లమెంట్ స్థానాల నుంచి అతుల్ ప్రధాన్ సురేష్ చంద్ కదమ్ అభ్యర్థులుగా ఉంటారని పేర్కొంది. మీరట్ నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్న నటుడు అరుణ్ గోవిల్పై సమాజ్వాదీ పార్టీ మొదట భాను ప్రతాప్సింగ్ను పోటీకి నిలబెట్టింది. పార్టీ అలా తన పేరును ప్రకటించగానే అతుల్ ప్రధాన్ ‘ఎక్స్’ ద్వారా పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్కు కృతజ్ఞతలు కూడా తెలిపారు. తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే మీరట్ అభ్యర్థిని మరోసారి మారుస్తూ అతుల్ ప్రధాన్ స్థానంలో సునీత వర్మను పార్టీ ప్రకటించింది. ఇక భాగ్పట్లో మనోజ్ చౌదరి స్థానంలో అమర్పాల్ శర్మను బరిలోకి దింపింది. ప్రత్యర్థుల విమర్శలు సమాజ్వాదీ పార్టీ తమ అభ్యర్థులను తరచూ మారుస్తుండటంపై ప్రత్యర్థు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్దళ్ అధినేత జయంత్ సింగ్ సమాజ్ వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. "ప్రతిపక్షంలో కొంతమందికి అదృష్టం కొన్ని గంటల పాటే ఉంటుంది” అంటూ ఎద్దేవా చేశారు. -
సెటిల్ అవ్వగానే పెళ్లి చేస్తామన్నారు! ఇంతలోనే..
మంచిని మెదడుకి ఎక్కించుకోవడం మనిషికి కొంచెం కష్టమైన పనే. తెలిసీ తెలియని వయసులో కలిగిన ఆకర్షణను అర్థం చేసుకున్న ఆ పెద్దలు.. ముందు వాళ్లకు బాధ్యతలు గుర్తు చేద్దామనుకున్నారు. కొన్నాళ్లు ఆగాలంటూ ఇద్దరికీ సర్దిచెప్పబోయారు. అమ్మాయి అర్థం చేసుకుంది. కానీ, ఆ అబ్బాయే మూర్ఖంగా ఆలోచించాడు. ఫలితమే.. ఊహించని ఘోరం జరిగింది. లైఫ్లో సెటిల్ కాగానే పెళ్లి చేస్తామని హామీ ఇచ్చిన పెద్దల మాటల్ని ఆ యువకుడు నమ్మలేదు. ప్రేమించిన అమ్మాయిని.. వెంటనే పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ఒత్తిడిని ఆమె తట్టుకోలేకపోయింది. ప్రియుడిని తిట్టిపోసింది. ఇగో దెబ్బ తిన్న ఆ ప్రియుడు.. కత్తితో ప్రియురాలిని కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. ఉత్తర ప్రదేశ్లోని బాగ్పట్లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీపా సింగ్, రింకూ ఇద్దరికీ ఎనిమిదేళ్ల పరిచయం. స్కూల్డేస్ నుంచే మంచి ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. బుధవారం పెద్దలను తీసుకుని దీప(20) ఇంటికి వెళ్లి మాట్లాడాడు రింకూ. అయితే డిగ్రీనే చదువుతుండడంతో దీప వాళ్ల ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పారు. ఇద్దర్ని ముందు చదువులు పూర్తి చేయమని, జాబ్ల్లో సెటిల్ అయ్యాక తప్పకుండా పెళ్లి చేస్తామని మాటిచ్చారు. దీప అందుకు అంగీకరించింది. అయితే రింకూ మాత్రం అన్యమనస్కంగా తలూపాడు. గురువారం గురుద్వారా మార్కెట్కు వెళ్లిన దీపను రింకూ ఆటకాయించాడు. ఇప్పుడే పారిపోయి పెళ్లి చేసుకుందామని బలవంతం చేశాడు. కోపంతో ఆమె అతన్ని తిట్టిపోసింది. అది తట్టుకోలేక పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లి కత్తి తెచ్చుకున్నాడు. ఆమె గొంతు కోసి, ఇష్టమొచ్చినట్లు పొడిచి దారుణానికి పాల్పడ్డాడు.రక్తపు మడుగులో ఉన్న దీపను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. చికిత్స పొందుతూ గంటల వ్యవధిలోనే ఆమె కన్నుమూసింది. ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పరుగులు తీసిన రింకూ.. నేరుగా బాగ్పట్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. తొలుత ఇది ప్రేమోన్మాది పని అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇద్దరూ ఇష్టపడ్డారని, పెద్దలు పెళ్లికి అంగీకరించారని, అయితే పెళ్లి వాయిదా పేరుతో తనని దీపకు దూరం చేస్తారనే ఆలోచనతోనే నిందితుడు రింకూ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ప్రైవేట్ కాలేజీలో అటెండర్గా పని చేస్తున్న దీప తండ్రి నైన్ సింగ్.. కూతురు జాబ్ చేసి కొన్నాళ్లు తమను పోషిస్తుందని, ఆపై ఇష్టపడ్డ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాట. కానీ, రింకూ ఆవేశంతో.. ఆ తండ్రి ఆశలు ఆవిరయ్యాయి. -
కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి
బాగ్పట్: ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన చిన్నారులు ఊపిరాడక కన్నుమూసిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. సింగౌలి తాగ అనే గ్రామంలో అనిల్ త్యాగి అనే వ్యక్తికి చెందిన కారులో అడుకోవడానికి ఐదుగురు చిన్నారులు ఎక్కారు. అనంతరం కారు డోర్లు లాక్ అయిపోవడంతో వారంతా ఊపిరాడక మరణించారని పోలీసులు వెల్లడించారు. మరణించిన చిన్నారులను నియతి (8), అక్షయ్ (4), వందన (4), క్రిష్ణ (7)లుగా గుర్తించారు. వీరితో పాటే కారులో ప్రవేశించిన శివాన్(8) మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మంగళ్ సింగ్ ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే చిన్నారులు ఊపిరాడక మరణించినట్లు ఉందన్నారు. అయితే చుట్టుపక్కల వారు మాత్రం కారు ఓనర్ అనిల్ త్యాగి నిర్లక్ష్యం వల్లే పిల్లలు మరణించారని ఆరోపించారు. చదవండి: నకిలీ రెమిడెసివిర్ వ్యాక్సిన్లు.. హెచ్చరిస్తున్న పోలీసులు -
యూపీలో దారుణం.. బీజేపీ కీలక నేత కాల్చివేత
లక్నో : ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. బాగ్పత్ జిల్లాకు చెందిన బీజేపీ కీలక నేత సంజయ్ ఖోఖర్ను ముగ్గురు గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. మంగళవారం ఉదయం.. తన పోలానికి నడుచుకుంటూ వెళ్తుండగా అతడిపై కాల్పులకు దిగారు. ఈ సంఘటన బాగ్పత్ ఛప్రౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. (చదవండి : వైట్హౌజ్ పరిసరాల్లో కాల్పుల కలకలం) ఘటన జరిగిన సమయంలో సంజయ్ ఖోఖర్ ఒంటరిగా వెళుతున్నారని తెలుస్తోంది. సమాచారం అంతుకున్న వెంటనే పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. విచారణను వేగవంతం చేసి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అధికారులను ఆదేశించారు. కాగా, ఇదే ప్రాంతంలో గత నెలలో రాష్ట్రీయ లోక్దళ్ నాయకుడు దేశ్పాల్ ఖోఖర్ను కూడా గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. -
‘ఉన్నావ్’ కంటే దారుణంగా చంపుతా!
లక్నో: మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటమే కాకుండా అవసరమైతే బాధితుల ప్రాణాలు తీయడానికి కూడా మానవ మృగాలు వెనుకాడట్లేదు. గత గురువారం ఉన్నావ్ బాధితురాలు కోర్టు విచారణకు హాజరవటానికి వెళుతుండగా మార్గం మధ్యలో కాపుకాసిన నిందితులు ఆమెను సజీవదహనం చేశారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అత్యాచార బాధితురాలిని కూడా చంపేస్తామంటూ ఆమె ఇంటిపై లేఖ అతికించడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని భగపట్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఏడాది క్రితం అత్యాచారానికి గురైంది. దీనిపై జులైలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం అతడిని బెయిల్పై వదిలేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో నిందితుడు బాధితురాలిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘నువ్వు కోర్టు విచారణకు హాజరయ్యావంటే ఉన్నావ్ కంటే దారుణంగా చంపుతా’ అని ఆమె ఇంటి ముందు వార్నింగ్ లెటర్ అతికించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బాధితురాలికి భద్రత ఏర్పాటు చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
నేడు వరంగల్కు ప్రధాని రాక
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
వర్ష బీభత్సం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
తప్పక చదవండి
Advertisement