breaking news
bad elements
-
తుని ఘటన వెనుక అసాంఘిక శక్తులు: పవన్ కల్యాణ్
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు గర్జనలో హింసాత్మక సంఘటనలు తన మనసుకు చాలా బాధ కలిగించిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో తాను కేరళలో ఉన్నానని, రైలును తగులబెట్టడం చూసి తనకు చాలా బాధ కలిగిందని అన్నారు. ఉద్యమంలో తాను నమ్మేది శాంతియుత మార్గం అని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందు ఈ పంథాను అనుసరిస్తూ విజ్ఞప్తి చేస్తేనే బాగుంటుందని అన్నారు. కాపుల రిజర్వేషన్ల సమస్య నేటిది కాదని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 'బ్రిటీష్ కాలం నుంచి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోనూ, 1956 సమయంలో కూడా ఈ సమస్య బయటకు వచ్చింది. అనేక దశాబ్దాలుగా ఈ డిమాండ్ ఉంది. అనేక తెగలు కలిపితే కాపులు. కాపుల్లో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే.. ఉత్తరాంధ్రలో, తెలంగాణలో వెనుకబడిన కులాలుగా వారికి గుర్తింపు ఉంది.. తూర్పు ఆంధ్రలో లేదు. పార్టీ నాయకులు బీసీల్లో చేరుస్తామని చెప్పడంతో వారిని ఓటుబ్యాంకుకు వాడుకుంటున్నారని కాపులకు బాధ అనిపిస్తోంది. ఒక శాంతియుతంగా జరగాల్సిన సభ ఎందుకు ఇలా దారితీసిందో అర్ధం కాలేదు. రైలు అగ్గిపుల్లతో తగలబెట్టేది కాదు. దీని వెనుక ఎంతో వ్యూహం ఉండి ఉండొచ్చు. దీని వెనుక అసాంఘిక శక్తులు, ప్రొఫెషనల్స్ ఉండి ఉండాలి.. దీని వెనుక ఎవరి ప్రభావమో ఉంది' అని పవన్ ఆరోపించారు. అసలు లక్షల మంది ఒక సమస్యపై ఉద్యమించేందుకు కదులుతుంటే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదో అర్థం కావడం లేదని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. నిన్నటి సంఘటనపై ఎవరిపైనా నిందలు వేయడం లేదు సభ దగ్గర సరిపడా పోలీసులను ఎందుకు పెట్టలేదు కమిషన్లపై కాపులకు నమ్మకం లేదు కాపు సామాజిక వర్గంలో ఏదో భయం ఉంది ప్రజలను రెచ్చగొట్టేలా ఉద్యమ నేతలు ప్రసంగాలు చేయకూడదు ఉద్యమ నాయకులు చాలా బాధ్యతతో వ్యవహరించాలి తుని ఘటనను రాజకీయం చేయాలని కానీ, లబ్ధి పొందాలని కానీ నాకు లేదు ప్రభుత్వం ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు ట్రయిన్ను తగులబెట్టడం మామూలు కార్యకర్తలకు సాధ్యం కాదు మిగతా బీసీ కులాలకు నష్టం వాటిల్లకుండా కాపులకు న్యాయం చేయగలిగితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాళ్లు అవుతారు సాధ్యం అయితే చేస్తాం, లేకుంటే సాధ్యం కాదు అని స్పష్టం చేస్తే మంచిది గాల్లో దీపం పెట్టేలా మాటలు చెప్పకూడదు చౌరాచౌరీ సంఘటన వల్ల స్వాతంత్ర్యం 25 ఏళ్లు వెనక్కి వెళ్లింది హక్కులు తెచ్చుకోవడానికి ఓ ఎజెండా ఉంటుంది. కానీ, అది పక్కదారి పట్టకూడదు నేను కులంకోసం కాదు.. ప్రజలకోసం పోరాటం చేస్తాను జాతి సమగ్రత కోసం నేను ఆలోచిస్తాను -
'నేను రెడీ.. బెయిల్ కూడా వద్దు'
తూర్పుగోదావరి: తనకు అవకాశం ఇస్తే.. ఇంట్లో లేదంటే జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ముద్రగడ పద్మనాభం అన్నారు. శుక్రవారం ఉదయం 9 నుంచి 10గంటల మధ్య తన సతీమణితో కలిసి దీక్షలో కూర్చుంటానని అన్నారు. తన జీవితాన్ని కాపులకు అంకితం చేస్తానని అన్నారు. ఈ ఉద్యమం కోసం తన ప్రాణంపోతే సంతోషిస్తానని, తను చనిపోయిన తర్వాతనైనా కచ్చితంగా తమ జాతికి రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. కావాలనే కాపులు ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చారని, దీని వెనుక కొన్ని పార్టీల హస్తం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించడంపట్ల ఆయన సోమవారం కిర్లంపూడిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తాము శాంతియుతంగా రాస్తారోకో, రైల్ రోకో కోసం రోడ్లపైకి వచ్చామని, తమకంటే ముందుగానే కొన్ని అసాంఘిక శక్తులు రోడ్లపైకి చేరి ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చేందుకు ప్రయత్నించాయని అన్నారు. వీటికి కొన్ని మీడియా సంస్థలు తోడయ్యాయని చెప్పారు. తమ మనుషుల ప్రమేయం లేకుండానే పెట్రోల్ బాంబులతో ఓపక్క రైలుపైన, మరోపక్క రాత్రి పోలీస్ స్టేషన్ పై దాడులు చేశారని చెప్పారు. ఆ దాడులకు తమకు ఎలాంటి సంబంధం లేదని, టీడీపీ అధికార ప్రతినిధుల హస్తం ఈ దాడుల వెనుక ఉందని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... మీడియా ద్వారా మాపై దాడులు చేశారు దాడుల చేసే అలవాట్లు మాజాతికి అలాంటి అలవాట్లు లేవు కొన్ని దుష్టశక్తులతో ఆ పనిచేయించారు అధికారిక పార్టీ ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం అయ్యారు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఈ పనిచేయించారు మరింత చెడుగా దీన్ని మారుస్తారని తన దీక్షను విరమించాను టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నవారందరిపై కేసులు పెట్టాలని అనుకుంటున్నారు. మా ఉద్యమంలో చెడుసంఘటనలకు ప్రభుత్వానిదే బాధ్యత నేను ఉద్యమాన్ని మాత్రమే నడుపుతున్నాను.. నాపై బురద జల్లడం మానుకోండి ముఖ్యమంత్రి తప్పుడు మార్గం అనుసరిస్తున్నారు తప్పుడు మాటలు చెప్పి గద్దెనెక్కారు మాకు ఇచ్చిన హామీ మరిచారు కాబట్టే ఉద్యమం చేస్తున్నాం.. రోడ్లెక్కుతున్నాం ఎన్నో జాతులను చంద్రబాబునాయుడు మోసం చేశారు.. రైతుల మాఫీ అన్నారు అది పక్కకు పోయింది. డ్వాక్రా అన్నారు అదీ అంతే అయింది, జాబులు అన్నారు గాలికిపోయింది. విధ్వంసానికి కుట్రలు చేసింది అధికారపార్టీనే. చంద్రబాబు పంగనామాలు పెట్టడం మాని అబద్ధాలు నిజం చేయాలి. గత రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీకన్నా దారుణంగా ఉంది సీఎం అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారు ప్రత్యేక విమానాలకు కోట్లకు కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రపంచంలో గొప్ప టెక్నాలజీ మీ దగ్గర ఉంది.. మా జాతకాలు అందులో ఉన్నాయి గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు దొంగ జీవోలు అనడం సరికాదు. గాల్లో తిరుగుతూ మా జాతిని గాలికి వదిలేస్తున్నారు మా పిల్లలు మధ్యాహ్నం బోజనంకోసం స్కూల్ కు పంపిస్తున్నాం. వెంటనే జీవో జీవోను ఇవ్వండి లేదంటే .. నేను రెడీగా ఉన్నాను.. ఎన్ని సెక్షన్లయినా పెట్టుకోండి బెయిల్ కూడా తెచ్చుకోను.. కాపు జాతికి నా జీవితం అంకితం.. నా జాతికి న్యాయం చేస్తాను.. ఎక్కడికీ పారిపోను. ఆమరణ దీక్ష చేస్తాను. ప్రతి గ్రామంలో మద్యాహ్నం ఒక పూట భోజనం మాని పల్లేలతో రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలపండి ఇంట్లో అనుమతిస్తే నేను నాభార్య కలిసి దీక్ష చేస్తాం.. లేదంటే మహిళల జైలులో నా భార్య, వేరే జైలులో నేను దీక్ష చేస్తాను -
ఆ దుష్టశక్తులు చంద్రబాబు పంపినవే: ముద్రగడ
► ట్రైనింగ్ ఇచ్చి మరీ రౌడీ మూకలను మీటింగుకు పంపారు ► ఆ మూకలకు నేతృత్వం వహించింది టీడీపీ నేతలే ► నా చావు తర్వాతైనా రిజర్వేషన్ ఇచ్చి తీరాలి ► శాంతియుతంగానే ఆమరణ దీక్ష చేసి తీరుతాం ► నేను, నా భార్య ఇద్దరం చేస్తాం ► అరెస్టు చేస్తే జైల్లో కూడా దీక్ష కొనసాగిస్తాం ► కర్వేపాకు కంటే దారుణంగా కాపులను వాడుకున్నారు ► మాది అమ్ముడైపోయే జాతి కాదు ► ప్రత్యేక విమానాల్లో తిరగడానికి వందలకోట్లు.. మాకు డబ్బులేదా కిర్లంపూడి: కాపు రిజర్వేషన్ల కోసం తాము శాంతియుత ఉద్యమం చేయాలనే తలపెట్టామని, అయితే ఉద్యమంలోకి కొన్ని దుష్టశక్తులు చొరబడి రైలును, పోలీసు జీపులను, బస్సులను తగలబెట్టాయని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడారు. ఈ దుష్టశక్తులకు శిక్షణ ఇప్పించింది, ఇక్కడకు పంపింది ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలేనని ఆయన స్పష్టంగా చెప్పారు. నాలుగైదు రోజుల్లో తాను, తన శ్రీమతి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తామని ప్రకటించారు. తమను అరెస్టు చేసినా బెయిల్ కోసం దరఖాస్తు చేయబోమని, జైల్లో కూడా దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. తమ దీక్షకు మద్దతుగా ఎవరూ కిర్లంపూడి రావొద్దని, ఎవరికి వాళ్లు తమ ఇళ్లలోనే నిరాహార దీక్ష చేయాలని కోరారు. తుని వద్ద జరిగిన ఉద్యమంలో.. తమ కార్యకర్తల కారు అద్దాలను కూడా పగలగొట్టారని, ప్రభుత్వం మాత్రం మాటిమాటికీ ఈ నేరాన్ని బయటివాళ్ల మీదకు తోస్తోందని చెప్పారు. ఈ సమావేశం తేదీ ప్రకటించినప్పటి నుంచి కూడా తమ సమావేశానికి ఎదురుదాడి చేయించారని, ఎన్నోరకాలుగా ప్రకటనలు ఇప్పించారని అన్నారు. తమ కుల సోదరులతో ఉద్యమాన్ని నీరుకార్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. ఆఖరికి కొన్నిచోట్ల రౌడీలతో సమావేశాలు పెట్టించారని ఆయన చెప్పారు. ఆ సమావేశాలకు వెళ్లాలని, అక్కడ గొడవలు చేయాలని, కాపులతో దెబ్బలు తిని.. వాళ్లు ఇతరులను కొడతారనిపించుకోవాలంటూ ట్రైనింగ్ ఇచ్చారని సమాచారం ఉందని ఆయన తెలిపారు. ఈ ఉద్యమానికి ఎవరో చేయూతనిస్తున్నారని, ఎవరికో తాను, ఈ జాతి అమ్ముడైపోయినట్లు ప్రకటనలు చేయడం బాధాకరమని ముద్రగడ అన్నారు. తమది అమ్ముడైపోయే జాతి అని, తాను అమ్ముడయ్యే మనిషినని టీడీపీ పెద్దలు వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేను ఉద్యమాలు చేసినప్పుడు తనను ఎన్ని వందల కోట్లకు కొన్నారని సూటిగా ప్రశ్నించారు. మేం ఎవరికీ వ్యతిరేకం, అనుకూలం కాదు ఈ ఉద్యమం ఏ మతానికి, కులానికి, పార్టీకి వ్యతిరేకంగా చేయట్లేదని, ఏ పార్టీకీ అనుకూలం కూడా కాదని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తమ ఆకలి బాధ తీర్చాలనే అడుగుతున్నామని.. సీఎం ఆశపెట్టడం వల్లే, తాము రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఆయన ఆ మాట ఇవ్వకపోతే ఇంత పెద్ద మీటింగ్ పెట్టేవాళ్లం కామని, అది తప్పించుకోడానికి కమిషన్ల మీద కమిషన్లు వేయడం న్యాయం కాదని ఆయనకు ఐదు నెలల క్రితం ఉత్తరం రాస్తే ఇప్పటి వరకు స్పందన, సమాధానం లేవన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కావాలని మహ్మద్ జానీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉత్తరం రాస్తే, మూడు నెలల్లో నివేదిక తెప్పించుకుని రిజర్వేషన్లు కల్పించారన్నారు. అదే తమకు మాత్రం ఏడాదికి వెయ్యి కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఈ ప్రభుత్వం భిక్షం వేసినట్లు 50 కోట్లు, వందకోట్లు ఇచ్చి ఈ జాతిని అవమానిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే ఉద్యమంలోకి దుష్టశక్తులను ప్రవేశపెట్టినందువల్ల.. వాటితో ఇంకా ఎన్ని దారుణాలు చేయిస్తారోననే అనుమానంతో తాను అప్పటికప్పుడు ఉద్యమం తప్పుదోవ పట్టకూడదన్న ఉద్దేశంతో ఆపానని, వేరే కార్యాచరణ కోసం సమాలోచనలు కొనసాగుతున్నాయని పద్మనాభం తెలిపారు. దీన్ని ఆకలితో కూడుకున్న ఆఖరి ఉద్యమంగా చేస్తున్నానన్నారు. రిజర్వేషన్ పొందేవరకు తన జీవితాన్ని తన జాతికి అంకితం చేస్తున్నట్లు చెప్పారు. నాలుగైదు రోజుల్లో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి తాను, తన భార్య సిద్ధమయ్యామని, అయితే ఈలోపే తమను ఏదో వంకతో అరెస్టు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. తాను పారిపోయేది గానీ.. బెయిల్ తెచ్చుకునే ప్రసక్తి గానీ లేదని స్పష్టం చేశారు. జైల్లో పెట్టినా అక్కడ కూడా ఆమరణ దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. తన దీక్షకు మద్దతుగా ఎవరూ కిర్లంపూడి రావొద్దని చెప్పారు. ఎవరికి వాళ్లు ఎక్కడికక్కడే నిరాహార దీక్షలు చేయాలని, ఇళ్ల ముందు కంచం మీద ఓ గంట సేపు గరిటెతో కొట్టాలని కోరారు. తునిలో జరిగిన ఘటనల మీద విచారణలో మీరు పురమాయించిన మనుషుల పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడతారని, అది తమకు తెలుసని ముద్రగడ అన్నారు. ముఖ్యమంత్రి గారూ, ఇది తప్పని నొక్కి చెప్పారు. దుష్టశక్తులకు నాయకత్వం వహించింది మీ పార్టీ నాయకులేనని.. అయినా ఇప్పుడు కేసులు పెట్టాలంటే తన మీద పెట్టాలి తప్ప తనవాళ్ల మీద వద్దని కోరారు. ఇక్కడ తనను అరెస్టు చేసినా ఎవరూ అడ్డుపడరని, ఏ జైల్లో పెడతారో పెట్టుకోవాలని అన్నారు. తాను అక్కడే దీక్ష చేస్తాను తప్ప వెనక్కి వెళ్లిపోయే ప్రసక్తి లేదన్నారు. ఈ సంగతి తేల్చేవరకు నిద్రపోనుని స్పష్టం చేశారు. మీడియా మీద, పోలీసుల మీద దాడి చేయొద్దని ముందునుంచే తాను అందరికీ చెప్పానని.. కానీ కొన్ని పత్రికల వాళ్లు సొంత ఎజెండాతో వచ్చి, వంకర రాతలు రాస్తుంటే వాటికి తాను ఎలా బాధ్యత వహిస్తానని ప్రశ్నించారు. వాళ్లు తమ వాహనాల మీదే దాడులు చేశారని.. దాడులు చేయాలని తానెప్పుడూ ట్రైనింగ్ ఇవ్వబోనని, ఇచ్చినవాళ్లు వేరే ఉన్నారని తెలిపారు. కాపు జాతిలో పుట్టడమే నేరమా.. వారం రోజుల నుంచి మనసు బాగా బాధపడుతోందని, సమావేశం దగ్గర్లో అన్నం వండుకునే స్థలం ఎవరైనా ఇస్తుంటే కూడా తోలు తీసేస్తామని పోలీసులు వాళ్లను బెదిరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తే, రేపు ఏం చేస్తారోనన్న భయంతో కార్యాచరణను ముందుకు తీసుకెళ్లలేకపోతున్నామని, నష్టం జరగకూడదనే శాంతియుత పద్ధతిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నారు. జీతాలకు డబ్బు లేదట గానీ.. జీతాలకు డబ్బు లేని మనిషి పట్టిసీమకు 1400 కోట్లు, రాజధాని శంకుస్థాపనకు 400-500 కోట్లు ఖర్చుపెట్టారని, ప్రత్యేక విమానాల్లో జిల్లాలకు, విదేశాలకు తిరుగుతున్నారని ముద్రగడ ఎద్దేవా చేశారు. వాట్టనింటికీ డబ్బులున్నాయి గానీ, తమ జాతికి ఇవ్వాలంటే డబ్బులు లేవంటున్నారని మండిపడ్డారు. ముందు హామీ ఇచ్చిన డబ్బు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తమను కర్వేపాకు కంటే దారుణంగా వాడుకుంటున్నారన్నారు. తన జీవితం అయిపోయేలోపు జాతికి ఏమైనా చేయాలని తలపెడితే.. ప్రభుత్వ పెద్దలు దాన్ని ఇలా వమ్ము చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తన చావు తర్వాతైనా రిజర్వేషన్ ఇచ్చి తీరాలని ఆవేదన వ్యక్తం చేశారు.