-
దారి తప్పుతున్న యువత.. ప్రమాదంలో భవిత
‘రాయచోటికి చెందిన ఐదుగురు యువకులు పగలు కూలి పనులు చేస్తూ రాత్రులలో చోరీలు చేసేవారు. చెడు వ్యసనాలకు బానిసలు కావడంతో వచ్చే కూలీ డబ్బులు సరిపోక కనిపించిన వస్తువు ఎంత విలువైనది అనేది కాకుండా అన్నింటినీ చోరీ చేసేవారు. ఆటోలకు ఉన్న బ్యాటరీలు, సెల్ఫోన్లు, బంగారు ఆభరణాలు వంటివి దోచుకెళ్లి జల్సాలు చేసుకునేవారు. ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు’. ‘మదనపల్లె టూటౌన్ పరిధిలో తాళం వేసిన ఇళ్లల్లోకి చొరబడి చోరీ చేసే ముఠాను పోలీసులు వలవేసి పట్టుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.20 లక్షల విలువ చేసే బంగారు, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అందరూ పాతికేళ్ల వయస్సు కుర్రాళ్లే. వీరు టెన్త్, ఇంటర్ చదివి విలాసాలకు అలవాటు పడి నేరస్తులుగా మారారు’. ‘మదనపల్లె మండలానికి చెందిన వారంతా ఇంటర్, డిగ్రీ చదువుతూ ఖర్చులకు డబ్బులు లేక రాత్రి పూట రహదారుల్లో తిరుగుతూ దోపిడీలకు పాల్పడేవారు. మారణాయుధాలతో వాహనదారులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలను దోపిడీ చేసేవారు. ఎట్టకేలకు పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు’. ‘అతడు విద్యావంతుడు. విలాసాలకు అలవాటు పడి మదనపల్లె పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలు చోరీ చేసేవాడు. ఇతని వయస్సు కేవలం 25 ఏళ్లే. బైకు చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు’. ‘చెడు అలవాట్లకు బానిసలై.. గంజాయి సేకరించి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను మదనపల్లె పట్టణ పోలీసులు అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు’. ‘మదనపల్లెకు చెందిన నలుగురు యువకులు కలిసి కార్లను బాడుగకు తీసుకువచ్చి కుదవకుపెట్టి, మళ్లీ అదే కార్లను చోరీ చేసేవారు. వీరిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు’. సాక్షి, మదనపల్లె సిటీ: అన్నమయ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పిల్లలపై పెద్దల పర్యవేక్షణ కొరవడటం, వారితో తగినంత సమయం గడపలేకపోవడం వంటివి ఈ తరహా ప్రవర్తనకు కారణమవుతున్నాయి. అరచేతిలో ఇమిడిన సాంకేతిక ఆయుధం సెల్ఫోన్ దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పిల్లలే ప్రపంచంగా కష్టపడుతున్న తల్లిదండ్రులు వారితో మనసు విప్పి మెలిగితేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని పోలీసు అధికారులు, మానసిక వైద్య నిపుణులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అనర్థాలపై యువకులకు అవగాహన నేరాల వల్ల జరిగే అనర్థాల గురించి యువకులకు అవగాహన కల్పిస్తాం. ఇప్పటికే పలు చోట్ల అవగాహన సదస్సులు నిర్వహించాం. యువత మంచి మార్గంలో నడవాలి. బిడ్డలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. వారిని వదిలేస్తే చెడుదారుల్లో తిరుగుతూ నేరాలకు పాల్పడతారు. – రవిమనోహరాచారి, డీఎస్పీ, మదనపల్లె. నైతిక విలువలు ప్రధానం పిల్లలకు మార్కులు కాదు. బిహేవియర్ క్వాలిటీస్ ప్రధానం. నైతిక విలువలు బోధించే పెద్దలు ఇంట్లో లేకపోవడం కూడా ఇబ్బందులకు కారణమవుతోంది. నీతి శతకాలు, పురాణగాథలు చిన్నారులకు సన్మార్గంలో నడిపించడానికి ఎంతో ఉపకరిస్తాయి. – జల్లా లలితమ్మ, బాలల హక్కుల ఐక్య వేదిక అధ్యక్షురాలు విలువలు నేర్పించాలి పిల్లలకు చిన్నప్పటి నుంచే విలువలు నేర్పించాలి. దీని బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు తీసుకోవాలి. పిల్లలు అధిక సమయం పాఠశాలల్లోనే గడుపుతారు. వారికి నీతి కథలు, మంచి, చెడు గురించి సూక్తులు బోధించాలి. – ఎస్.మహమ్మద్ అయూబ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రాయచోటి. సమాజం పెను సవాళ్లను ఎదుర్కొంటోంది యువత వ్యసనాలకు లోనై నేరమార్గం వైపు అడుగులు వేస్తున్నారు. మద్యం, మత్తు మందులు, సిగరెట్లను స్టేటస్ సింబల్గా, హీరోయిజంగా భావిస్తున్నారు. చదువులకు క్రమంగా దూరమై కొత్తదనం కోరుకుంటూ నేరపూరిత వాతావరణంలోకి జారిపోతున్నారు. విలువలు, సామాజిక బాధ్యతతో కూడిన ప్రవర్తనను నేర్పేందుకు తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. – డాక్టర్ రాధిక, మానసిక వైద్యనిపుణురాలు, మదనపల్లె -
పొగాకు ప్రేమికులు మా ప్రియతమ నేతలు
* శరద్పవార్ నుంచి ఆర్ఆర్ పాటిల్ వరకు గుట్కా బాధితులే * పొగతాగే వారిలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు * డాక్టర్ పీసీ గుప్తా పరిశోధనలో బట్టబయలు సాక్షి, ముంబై: చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వేదికలనెక్కి ఉపన్యాసాలు దంచే అనేక మంది రాజకీయ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు దురలవాట్లకు బానిసలేనన్న ఆశ్చర్యకరమైన విషయం ఓ అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. చట్టాలను అమలు చేయాల్సిన నేతలే వాటిని తుంగలో తొక్కుతున్నారు. అనేక మంది ప్రస్తుత, మాజీ మంత్రులు, విధానసభ సభ్యులకు పాన్, గుట్కా, తంబాకు, సిగరెట్, బీడి వంటి వ్యసనాలున్నాయని ఆ అధ్యయన నివేదిక వెల్లడించింది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కోసం పనిచేసిన డాక్టర్ పి.సి.గుప్తా మహారాష్ట్రలో తంబాకు సేవనంపై పరిశోధన చేశారు. ప్రస్తుతం హెలీజ్ సిక్సారియా ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ రీసెర్చ్ కోసం పనిచేస్తున్న డాక్టర్ గుప్తా తన పరిశోధన వివరాలను వెల్లడించారు. ఇందులో పలువురు రాజకీయ నాయకుల విషయాలు కూడా బయటపడ్డాయి. ప్రస్తుతం బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతున్న మాజీ హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ కూడా తంబాకు సేవించేవారని తెలిసింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు, కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్కు కూడా క్యాన్సర్ ఉంది. గుట్కా అతిగా తినడంవల్ల నోటికి సోకిన క్యాన్సర్ను సర్జరీ ద్వారా తొలగించుకున్నారు. ఎన్సీపీకి చెందిన ప్రఫుల్ పటేల్కు సిగరెట్ తాగే అలవాటు చాలా ఉండేది. అయితే ప్రస్తుతం పొగ తాగడం మానుకున్నానని తెలిపారు. పొగాకు తయారిలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న సి.జె.గ్రూప్ ప్రఫుల్ పటేల్ కుటంబానికి చెందినదే. ఈ కంపెనీ ద్వారా యేటా నాలుగు వేల కోట్ల డాలర్ల లావాదేవీలు జరుగుతాయి. బీజేపీకి చెందిన గిరీష్ బాపట్, రెవెన్యూ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సేకు సిగరెట్ తాగే అలవాటుంది. కానీ ప్రస్తుతం ఆ అలవాటు మానుకున్నట్లు చెబుతున్నారు. గుట్కా, ఖైనీ, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులను ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్యులకు కూడా ఇవి అందుబాటులోనే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతీరోజు 2.50 కోట్ల మందికి పైగా ప్రజలు పొగాకును వివిధ రూపాల్లో సేవిస్తున్నారు. వీరిలో తంబాకు తినేవారు కోటిన్నర మంది ఉన్నారు. పొగాకును గుట్కా, ఖైనీ, పాన్ మసాల వంటి పదార్థాలుగా వీరు సేవిస్తున్నరు. ఇలా పొగాకుకు బానిసలైన ప్రతి 30 మందిలో ఒకరికి నోటి క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని ఈ అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ ప్రభాత్ ఝా తెలిపారు. 2010లో డాక్టర్ ప్రభాత్ ఝా వివిధ సేవా సంస్థల సాయంతో చేపట్టిన పరిశోధనలో భారత దేశంలో క్యాన్సర్ సోకిన వారిలో పురుషుల సంఖ్య 42 శాతం ఉండగా, మహిళల శాతం 18 ఉన్నట్లు పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement